కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాస్ పోర్టును రెడీ చేసుకుని సిద్ధంగా పెట్టుకున్నారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినాష్రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని తెలిపారు. అందుకే.. ఆయన రిజల్ట్ వచ్చిన తర్వాత.. ఏ క్షణమైనా ఊరు దాటి.. దేశం దాటి.. పోయేందుకు పాస్టు పోర్టును రెడీ చేసుకున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుతం సొంత జిల్లా కడపలో పర్యటిస్తున్న షర్మిల.. స్థానిక మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్, ఎంపీ అవినాష్రెడ్డిలను ఆమె టార్గెట్ చేసుకున్నారు.
“ఇక్కడ ప్రజల నాడి చూస్తే.. అందరూ వివేకా హత్యపై సానుబూతితో ఉన్నారు. ఆయనకు న్యాయం జర గాలంటే.. ఓటు వేసి షర్మిలను గెలిపించాలని నిర్ణయించుకున్నట్టు నాకు అర్థమవుతోంది” అని షర్మిల అన్నారు. ఒక ప్రభంజనమైతే కడపలో కనిపిస్తుందన్నారు. అవినాష్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని చెప్పా రు. ఓడిపోయిన వెంటనే.. అవినాష్ను అరెస్టు చేయడం తథ్యమని తెలిపారు. ఒకవైపు.. ఓడిపోతాననే భయం.. మరోవైపు, అరెస్టు భయం రెండూ ఆయనను వెంటాడుతున్నాయన్నారు.
అందుకే పాసుపోర్టును రెడీ చేసుకుని పెట్టుకున్నాడని షర్మిల విమర్శలు గుప్పించారు. ఒకవేళ అవినాష్ రెడ్డే కనుక గెలిస్తే.. నేరం గెలిచినట్టేనని వ్యాఖ్యానించారు. తామే సింగిల్ ప్లేయర్గా ఉండాలనేది వైఎస్ భారతి ప్లాన్గా ఉందని అన్నారు. “అదే నిజమైతే.. మిగతా వాళ్లను కూడా.. గొడ్డలితో నరికేయండి. అప్పు డు మీరే సింగిల్ ప్లేయర్ ” అని షర్మిల వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైఎస్సార్ పాలన జరగడం లేదని.. షర్మిల వ్యాఖ్యానించారు. అందుకే వైఎస్ వారసురాలిని తానేనని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
This post was last modified on May 8, 2024 3:44 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…