కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాస్ పోర్టును రెడీ చేసుకుని సిద్ధంగా పెట్టుకున్నారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినాష్రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని తెలిపారు. అందుకే.. ఆయన రిజల్ట్ వచ్చిన తర్వాత.. ఏ క్షణమైనా ఊరు దాటి.. దేశం దాటి.. పోయేందుకు పాస్టు పోర్టును రెడీ చేసుకున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుతం సొంత జిల్లా కడపలో పర్యటిస్తున్న షర్మిల.. స్థానిక మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్, ఎంపీ అవినాష్రెడ్డిలను ఆమె టార్గెట్ చేసుకున్నారు.
“ఇక్కడ ప్రజల నాడి చూస్తే.. అందరూ వివేకా హత్యపై సానుబూతితో ఉన్నారు. ఆయనకు న్యాయం జర గాలంటే.. ఓటు వేసి షర్మిలను గెలిపించాలని నిర్ణయించుకున్నట్టు నాకు అర్థమవుతోంది” అని షర్మిల అన్నారు. ఒక ప్రభంజనమైతే కడపలో కనిపిస్తుందన్నారు. అవినాష్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని చెప్పా రు. ఓడిపోయిన వెంటనే.. అవినాష్ను అరెస్టు చేయడం తథ్యమని తెలిపారు. ఒకవైపు.. ఓడిపోతాననే భయం.. మరోవైపు, అరెస్టు భయం రెండూ ఆయనను వెంటాడుతున్నాయన్నారు.
అందుకే పాసుపోర్టును రెడీ చేసుకుని పెట్టుకున్నాడని షర్మిల విమర్శలు గుప్పించారు. ఒకవేళ అవినాష్ రెడ్డే కనుక గెలిస్తే.. నేరం గెలిచినట్టేనని వ్యాఖ్యానించారు. తామే సింగిల్ ప్లేయర్గా ఉండాలనేది వైఎస్ భారతి ప్లాన్గా ఉందని అన్నారు. “అదే నిజమైతే.. మిగతా వాళ్లను కూడా.. గొడ్డలితో నరికేయండి. అప్పు డు మీరే సింగిల్ ప్లేయర్ ” అని షర్మిల వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైఎస్సార్ పాలన జరగడం లేదని.. షర్మిల వ్యాఖ్యానించారు. అందుకే వైఎస్ వారసురాలిని తానేనని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
This post was last modified on May 8, 2024 3:44 pm
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం పుంజుకుంటోంది. ప్రధానంగా ఐటీ సంస్థల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు కూడా ఏఐ ఆధారిత…
ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 ది థర్డ్ కేస్ పూర్తి చేసే పనిలో ఉన్న న్యాచురల్ స్టార్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు లో తాజాగా…
గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద…
మాటల మాంత్రికుడు.. సోషల్ మీడియాలో దుమ్మురేపి.. ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా శాసన మండలిలో ఉన్న తీన్మార్ మల్లన్న తన వాయిస్ ద్వారా…