Political News

అవినాష్‌రెడ్డి పాస్ పోర్టు రెడీ చేసుకున్నారు: ష‌ర్మిల‌

క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి పాస్ పోర్టును రెడీ చేసుకుని సిద్ధంగా పెట్టుకున్నార‌ని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అవినాష్‌రెడ్డికి ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌ని తెలిపారు. అందుకే.. ఆయ‌న రిజ‌ల్ట్ వ‌చ్చిన త‌ర్వాత‌.. ఏ క్ష‌ణ‌మైనా ఊరు దాటి.. దేశం దాటి.. పోయేందుకు పాస్టు పోర్టును రెడీ చేసుకున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌స్తుతం సొంత జిల్లా క‌డ‌ప‌లో ప‌ర్య‌టిస్తున్న ష‌ర్మిల‌.. స్థానిక మీడియాతో మాట్లాడారు. సీఎం జ‌గ‌న్‌, ఎంపీ అవినాష్‌రెడ్డిల‌ను ఆమె టార్గెట్ చేసుకున్నారు.

“ఇక్క‌డ ప్ర‌జ‌ల నాడి చూస్తే.. అంద‌రూ వివేకా హ‌త్య‌పై సానుబూతితో ఉన్నారు. ఆయ‌న‌కు న్యాయం జ‌ర గాలంటే.. ఓటు వేసి ష‌ర్మిల‌ను గెలిపించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు నాకు అర్థ‌మ‌వుతోంది” అని ష‌ర్మిల అన్నారు. ఒక ప్ర‌భంజ‌న‌మైతే క‌డ‌పలో క‌నిపిస్తుంద‌న్నారు. అవినాష్ రెడ్డి ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని చెప్పా రు. ఓడిపోయిన వెంట‌నే.. అవినాష్‌ను అరెస్టు చేయ‌డం త‌థ్య‌మ‌ని తెలిపారు. ఒక‌వైపు.. ఓడిపోతాననే భ‌యం.. మ‌రోవైపు, అరెస్టు భ‌యం రెండూ ఆయ‌న‌ను వెంటాడుతున్నాయ‌న్నారు.

అందుకే పాసుపోర్టును రెడీ చేసుకుని పెట్టుకున్నాడ‌ని ష‌ర్మిల విమ‌ర్శ‌లు గుప్పించారు. ఒకవేళ అవినాష్ రెడ్డే క‌నుక గెలిస్తే.. నేరం గెలిచిన‌ట్టేన‌ని వ్యాఖ్యానించారు. తామే సింగిల్ ప్లేయ‌ర్‌గా ఉండాల‌నేది వైఎస్ భార‌తి ప్లాన్‌గా ఉంద‌ని అన్నారు. “అదే నిజ‌మైతే.. మిగ‌తా వాళ్ల‌ను కూడా.. గొడ్డ‌లితో న‌రికేయండి. అప్పు డు మీరే సింగిల్ ప్లేయ‌ర్ ” అని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైఎస్సార్ పాల‌న జ‌ర‌గడం లేద‌ని.. ష‌ర్మిల వ్యాఖ్యానించారు. అందుకే వైఎస్ వార‌సురాలిని తానేన‌ని ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పారు.

This post was last modified on May 8, 2024 3:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

3 minutes ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

3 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

4 hours ago

అమరావతిపై జగన్‌కు 5 ప్రశ్నలు..!

అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…

6 hours ago

జ‌గ‌న్ రోడ్డున ప‌డేస్తే.. కూట‌మి ఆదుకుంది!

వైసీపీ అధినేత జ‌గ‌న్ హ‌యాంలో ఓ కుటుంబం రోడ్డున ప‌డింది. కేవ‌లం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించి…

6 hours ago

కోనసీమకు ప్రభుత్వం గుడ్ న్యూస్

కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…

6 hours ago