Political News

ప‌థ‌కాల మాట ఎత్తొద్దు: జ‌గ‌న్‌కు ఈసీ షాక్‌!

ఏపీ ప్ర‌భుత్వానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జ‌గ‌న్ ప్ర‌బుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌స్తావించ‌డానికి వీల్లేద‌ని తాజాగా ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఏపీ అధికార పార్టీ వైసీపీకి చేతులు కాళ్లు క‌ట్టేసి న‌ట్టు అయింది. ప్ర‌స్తుతం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ప్ర‌స్తావించ‌రాద‌ని తేల్చి చెప్పింది. అదేవిధంగా ఒక్క రూపాయి నిధులు కూడా ఇవ్వ‌డానికి వీల్లేద‌ని ఎన్నిక‌ల సంఘం తేల్చి చెప్పింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం పెట్టుకున్న అర్జీని బుట్ట‌దాఖ‌లు చేసింది.

ఏం జ‌రిగింది?

ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప‌లు సంక్షేమ ప‌థ‌కాల‌ను 2019 నుంచి అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. వీటిలో కాలానుగుణంగా అమ‌లు చేసే కార్య‌క్ర‌మం వైఎస్సార్ రైతు భ‌రోసా, అమ్మ ఒడి వంటివి. మే మొద‌టి లేదా రెండో వారంలో రైతులు దుక్కుతున్నారు కాబ‌ట్టి వారికి పెట్టుబ‌డి సాయం కింద జ‌గ‌న్ ప్ర‌భుత్వం రూ.6000 ఇస్తోంది. న‌వంబ‌రు నాటికి మ‌రో రూ.7300 ఇస్తోంది. దీనిలో కేంద్ర సాయం 2000 చొప్పున ఉంటుంది. ఇప్పుడుమే రెండో వారం ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో రైతుల‌కు ఇన్ పుట్ స‌బ్సిడీ కింద‌.. సాయం చేయాల‌ని ప్ర‌భుత్వం చూసింది. అయితే.. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన టీడీపీ.. ఇప్ప‌టికే.. కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ప‌థ‌కాల పేరుతో జ‌గ‌న్‌ మోసం చేస్తున్నారంటూ లేఖ రాసింది.

ఇది జ‌రిగిన రెండు రోజుల‌కు క‌ళ్లు తెరిచిన ప్ర‌బుత్వం రైతుల‌కు ఏటా ఇస్తున్న‌ట్టుగానే ఇప్పుడు కూడా ఇన్ పుట్ సాయం కింద రూ.6000 ఇచ్చేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ.. కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాశారు. అయితే.. అప్ప‌టికే టీడీపీ ఇచ్చిన లేఖ‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న ఈసీ..ఏ ప‌థ‌కానికీ నిధులు విడుద‌ల చేయ‌డానికి వీల్లేద‌ని తేల్చి చెప్పింది. అయితే.. వైసీపీ మ‌రో లేఖ రాసింది. ఇప్ప‌టికే కొన‌సాగుతున్న ప‌థ‌కమ‌ని.. గ‌త నాలుగేళ్లుగా అమ‌ల్లోఉంద‌ని తెలిపింది. అయిన‌ప్ప‌టికీ.. ఇవ్వ‌డానికి వీల్లేద‌ని.. ఈసీ ష‌ర‌తులు విధించింది.

అంతేకాదు.. ఈ విష‌యాన్ని ప్ర‌చారంలో వాడుకోవ‌డానికి కూడా వీల్లేద‌ని తేల్చి చెప్పింది. దీంతో త్వ‌ర‌లో ఇవ్వ‌ల్సిన అంటే.. జూన్ 1, 2 తారీకుల్లో ఇవ్వాల్సిన అమ్మ ఒడికి కూడా.. ఈసీ అనుమ‌తి ఇవ్వ‌లేదు. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి. గ‌తంలో చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు కూడా.. ప‌సుపు-కుంకుమ ప‌థ‌కానికి ఇబ్బంది వ‌చ్చిన‌ప్పుడు హైకోర్టుకు వెళ్లి అనుమ‌తి తెచ్చుకున్నారు. ఇప్పుడు జ‌గ‌న్ స‌ర్కారు కూడా అలా చేస్తుందా ? లేదా.. అనేది చూడాలి.

This post was last modified on May 7, 2024 10:43 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago