Political News

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ అధికారంలోకి వ‌రుస‌గా మూడోసారి రానుంద‌ని తెలిపారు. రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగించారు. భార‌త్ త్వ‌ర‌లోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా అవ‌త‌రించ‌నుంద‌ని చెప్పారు. అన‌కాప‌ల్లి బెల్లం అంత‌ర్జాతీయ ఖ్యాతి పొందింద‌ని.. అలాంటి తీయ‌టి ప్ర‌భుత్వ‌మే ఏపీలో ఏర్ప‌డ‌నుంద‌ని చెప్పారు. జూన్ 4న వ‌చ్చే ఫ‌లితాలు.. ఇంత క‌న్నా తియ్య‌గా ఉంటాయ‌ని, ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వ‌మే ఏర్ప‌డుతుంద‌ని మోడీ తెలిపారు.

విశాఖ‌ రైల్వేజోన్ ఇచ్చేందుకు తాము రెడీగానే ఉన్నామ‌ని..కానీ.. ఇక్క‌డి ప్ర‌భుత్వ‌మే భూమి ఇవ్వ‌డం లేద‌ని మోడీ విమ‌ర్శించారు. ఏపీలో 9 వేల కిలో మీట‌ర్ల మేర‌కు జాతీయ ర‌హ‌దారులు అభివృద్ధి చేస్తున్నామ‌ని చెప్పారు. ఐఐటీ, ఎయిమ్స్ వంటివి ఇచ్చామ‌ని తెలిపారు. విక‌సిత్ ఏపీ, విక‌సిత భార‌త్ కోసం.. మే 13న ఓటేయాల‌ని.. ఎన్డీయే కూట‌మిని గెలిపించాల‌ని మోడీ కోరారు. ఏపీలో అవినీతి త‌ప్ప ఇంకేమీ క‌నిపించ‌డం లేద‌ని మోడీ వ్యాఖ్యానించారు. బీజేపీ హ‌యాంలో దేశ ఖ్యాతి పెరిగింద‌ని ప్ర‌ధాని మోడీ అన్నారు. కేంద్రం ఏపీలో ఎంతో అభివృద్ది చేస్తుంటే.. ఇక్క‌డున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ఎందుకు చేయ‌డం లేద‌ని ప్ర‌ధాని ప్ర‌శ్నించారు.

“నా ప‌నితీరు చూసి దేశ ప్ర‌జ‌లు ఓటేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇదే జ‌రిగింది” అని మోడీ చెప్పారు. పోల‌వరం ప్రాజెక్టుపై ప్ర‌ధాని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. “పోల‌వ‌రం ప్రాజెక్టుకు ఏపీకి జీవ‌నాడి వంటిది. దీనిని వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్రారం భించారు. తండ్రివార‌స‌త్వంగా వ‌చ్చి.. రాజ‌కీయాలు చేస్తున్న జ‌గ‌న్‌.. తండ్రి క‌ల‌లు క‌న్న ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేక పోయారు. కానీ, కేంద్ర ఈ ప్రాజెక్టుకు రూ.15000 కోట్లు ఇచ్చింది. మ‌రి ఆ నిధులు ఏం చేశారు? రైతుల విష‌యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చిత్త‌శుద్ది లేదు” అని విమ‌ర్శించారు.

వైసీపీ మంత్రం.. ‘అవినీతి-అవినీతి-అవినీతి’ అని మోడీ విమ‌ర్శించారు. కేంద్రం చేప‌ట్టిన ప‌నుల‌ను కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం అడ్డు కుంద‌ని చెప్పారు. కానీ, ఎన్డీయే మంత్రం మాత్రం..’అభివృద్ధి-అభివృద్ధి-అభివృద్ధి’ అని మోడీ తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్ర‌బుత్వ నిర్వాకంతో అన‌కాప‌ల్లి రైతులు చెరుకు పండించ‌డం మానేశార‌ని చెప్పారు. దీంతో ప‌రిశ్ర‌మ‌లు మూత‌బ‌డుతున్నాయ‌ని మోడీ వ్యాఖ్యానించారు. “వైసీపీ,కాంగ్రెస్ పార్టీలు ఒక్క‌టే. మాఫియా రాజ్‌. ఏపీలో ఇసుక మాఫియా, లిక్క‌ర్ మాఫియా కొన‌సాగుతున్నాయి” అని మోడీ దుయ్య‌బ‌ట్టారు.

This post was last modified on May 6, 2024 6:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

2 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

2 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

4 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

6 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

7 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

7 hours ago