Political News

ఏపీలో వేవ్ మొదలైనట్లేనా?

ఆంధ్రప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయికి చేరుకుని వైకాపా ఘనవిజయం సాధించబోతున్న సంకేతాలు కనిపించాయి. టీడీపీ ఓటమి, వైసీపీ గెలుపు ఎన్నికలకు ముందే ఖరారైపోయిందన్నది స్పష్టం.

కానీ టీడీపీ అంత చిత్తుగా ఓడిపోతుందని.. వైసీపీ ఏకంగా 151 సీట్లు సాధిస్తుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. ఐతే అప్పుడు అంతటి విజయం సాధించిన జగన్ సర్కారు.. ఐదేళ్ల పాలనతో టీడీపీని మించి వ్యతిరేకతను ఎదుర్కొంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

ప్రభుత్వ పథకాలు అందుకుంటున్న గ్రామీణుల్లో చాలా వరకు జగన్ వైపు ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. మిగతా వర్గాల్లో చాలా వరకు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఎన్నికల ప్రచార సరళిని గమనిస్తుంటే.. కూటమి జయకేతనం ఎగురవేయబోతున్న అంచనాలు కలుగుతున్నాయి. మెజారిటీ సర్వేలు కూడా ఇదే సూచిస్తున్నాయి.

కాగా అసలు ఎన్నికల సమరం జరగడానికి వారం ముందే.. ఒక మినీ ఎన్నికలు జరిగిపోయాయి. ఎన్నికల విధుల్లో పాల్గొనబోతున్న.. ఎన్నికల రోజు అందుబాటులో ఉండని ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ముందే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ సందర్భంగానే ఒక వేవ్ కనిపించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఉద్యోగులు కొంతమంది ఓటు వేయడాన్ని లైట్ తీసుకునేవారని.. కానీ ఈసారి మాత్రం కచ్చితంగా ఓటు వేయాలని వచ్చారని.. మండుటెండల్లో చాలాసేపు లైన్లలో నిలబడి ఓటు వేశారని.. వాళ్లందరిలో జగన్ సర్కారును దించాలనే కసి కనిపించిందని పోస్టల్ బ్యాలెట్ సరళిని గమనించిన వారు చెబుతున్నారు.

జగన్ సర్కారు తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న వర్గాల్లో ఉద్యోగులు ముందు వరసలో ఉంటారు. సీపీఎస్ రద్దు విషయంలో మోసపోయి.. సమయానికి పీఆర్సీలు అమలు కాక.. కనీసం ఒకటో తారీఖున జీతాలు కూడా సరిగా చెల్లించక.. ఇంకోవైపు తమ పీఎఫ్ డబ్బులకూ గ్యారెంటీ లేక.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక.. ఉద్యోగుల్లో జగన్ ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి నెలకొన్న మాట వాస్తవం.

ఈ నేపథ్యంలోనే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్లలో చాలా వరకు కూటమి వైపే నిలిచినట్లు భావిస్తున్నారు. రేప్పొద్దున అసలు ఎన్నికల్లో కూడా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు జగన్ సర్కారుకు వ్యతిరేకంగానే ఓటు వేస్తారని అంచనా వేస్తున్నారు.

This post was last modified on May 6, 2024 12:34 pm

Share

Recent Posts

‘సనాతన’ వివాదంపై అనసూయ క్లారిటీ

టాలీవుడ్ నటి అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ముక్కుసూటిగా మాట్లాడడం, అనుకున్నది ఠక్కున చెప్పేయడం ఆమె నైజం. ఇక,…

1 hour ago

ప‌వ‌న్ స‌తీమ‌ణి సింప్లిసిటీ… రైలులో పిఠాపురం వరకు..

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ సతీమ‌ని అన్నా కొణిదెల ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తున్నారు. త‌న…

1 hour ago

రాజగోపాల్ రెడ్డిపై ఈసారి వేటు తప్పదా?

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలాకాలంగా సొంత పార్టీ నేతలపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతున్న సంగతి…

2 hours ago

మైత్రీ సినిమాలన్నీ గతంలోకే వెళ్తున్నాయే!

మైత్రీ మూవీ మేకర్స్ చేతిలో ఉన్న లైనప్ చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తోంది. ప్రెజెంట్ నడుస్తున్న కథల కంటే…

3 hours ago

రేషన్ కార్డుపై మోదీ బొమ్మ వేయాల్సిందే!

ఈ రోజుల్లో పబ్లిసిటీకి కాదేదీ అనర్హం…రాజకీయ నేతలు మొదలు సినీ తారల వరకు అందరూ పబ్లిసిటీనే నమ్ముకున్నారంటే అతిశయోక్తి కాదు.…

3 hours ago

జగన్ కు అవమానం… జైలు సిబ్బంది క్లారిటీ

ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ని పరామర్శించేందుకు కర్నూలు జిల్లా పంచలింగాల జైలు వద్దకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్…

4 hours ago