ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది ఐపీఎస్ అధికారులను ఐఏఎస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. వీరిలో చాలా మంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. ఇక, ఇప్పుడు ఏకంగా రాష్ట్ర డీజీపీపైనే వేటు పడింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆయనను తక్షణం బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది.
ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం.. ఆన్లైన్లో ఆదేశాలు పంపించడం గమనార్హం. ఏపీ డీజీపీగా కొత్త అధికారిని ఎంపిక చేసేందుకు.. ముగ్గురి పేర్లతో కూడిన ప్యానల్ను తమకు పంపించాలని కూడా.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. దీనిని కూడా.. సోమవారం ఉదయం 11 గంటల కల్లా తమకు పంపించా లని.. కోరింది. ఇక, ప్రస్తుత డీజీపీని బదిలీ చేయాలని ఆదేశించిన ఎన్నికల సంఘం.. ఆయనకు ఎన్నికల విధులతో సంబంధం లేని బాధ్యతలు అప్పగించాలని ఆదేశించడం విశేషం.
ఎవరీ డీజీపీ?
ప్రస్తుతం ఏపీకి డీజీపీగా ఉన్న అధికారి.. కడప జిల్లాకు చెందిన కసిరెడ్డి రాజేంద్రనాథ్రెడ్డి. ఈయన పూర్తి స్థాయి డీజీపీ కాకపోవడం గమనార్హం. ఈయన తాత్కాలిక డీజీపీగానే.. గత రెండు సంవత్సరాలుగా కొన సాగుతున్నారు. అయితే.. శాశ్వత డీజీపీ నియామకంపై అటు కేంద్ర హోం శాఖ, ఇటు రాష్ట్ర ప్రబుత్వం కూడా పట్టించుకోలేదు. దీంతో ఆయనే కొనసాగుతున్నారు. ఇక, ప్రతిపక్షాలు ఈయనపై చేసిన ఆరోపణ లు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని… ప్రతిపక్షాలను తొక్కేస్తున్నారన్న ది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది.
This post was last modified on May 5, 2024 6:39 pm
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…