ఏపీలో రాజకీయాలు ఊపందుకున్న నేపథ్యంలో సంచలనాలు కూడా అదే రేంజ్లో తెరమీదికి వస్తున్నాయి. ప్రస్తుత ప్రధాన పార్టీలన్నీ కూడా.. పెద్ద ఎత్తున ప్రచారంలో దూకుడుగా ఉన్నాయి. పార్టీల అధినేత నుంచి నాయకుల వరకు కూడా.. అందరూ ప్రచారాన్ని ముమ్మరంగా ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా ఆయా నాయకుల కుటుంబాల్లోని పిల్లలు కూడా.. తెరమీదికి వస్తు న్నారు. చిత్రం ఏంటంటే.. తమ వారికి అనుకూలంగా ఓటేయాలని చెప్పాల్సిన ఈ పిల్లలు.. యాంటీ ప్రచారం చేస్తున్నారు.
రెండు రోజుల కిందట.. కాపు ఉద్యమనాయకుడు.. ప్రస్తుత వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె.. క్రాంతి భారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ను తన తండ్రి తిట్టడాన్ని ఆమె తప్పు బట్టారు. అంతేకాదు.. తాను పవన్తో నడుస్తాననిచెప్పారు. తన తండ్రిని జగన్ వాడుకుంటున్నారని కూడా.. సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఒకవైపు.. చర్చ సాగుతుండగానే.. తాజాగా మరో సంచలనం తెరమీదికి వచ్చింది. అదే.. వైసీపీ కీలక నేత.. సంబరాల రాంబాబుగా పేరు తెచ్చుకున్న మంత్రి అంబటి రాంబాబు అల్లుడి సెల్ఫీ వీడియో.
మంత్రి అంబటి రాంబాబుకు ముగ్గురూ ఆడపిల్లలే. వీరిలో ఒకరి భర్త డాక్టర్ గౌత్. ఈయన తాజాగా సెల్ఫీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో పెట్టారు. దీనిలో ఆయన తన సొంత మామ అంబటిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “నేనుఅంబటి రాంబాబు అల్లుడిని అది నా దురదృష్టం. ఎవరూ ఏం చేయలేరు” అంటూ… ప్రారంభించిన ఆయన.. తన మామ అత్యంత నీచ,నికృష్ట దరిద్రుడని అన్నారు. “అంబటి రాంబాబు వంటి నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాలపై పేలాలు ఏరుకునే వ్యక్తిని నా జీవితంలో ఇప్పటి వరకు చూడలేద”న్నారు
“నేనూ రోజూ ఉదయాన్నే దేవుడికి దణ్ణం పెట్టుకునేప్పుడు.. ఇంత నీచుడిని నా జీవితంలో ఇంకెప్పుడూ.. ఇంట్రడ్యూస్ చేయకు స్వామీ అని దేవుడిని వేడుకుంటా. అంత నీచకృష్ట వ్యక్తి. కనీసం విలువలు, బాధ్య త.. ఏమాత్రం లేని వ్యక్తి” అని వ్యాఖ్యానించారు. ఇలాంటి వారికి ఓటేసే ముందు ఆలోచించుకోవా లని సూచించారు. ఓటేస్తే.. ఎంత లేకిపనైనా చేసి బతకొచ్చనే వారిని ప్రోత్సహిస్తున్నట్టు అన్నారు. ఇలాంటి వారికి ఓటేస్తే.. రేపు భవిష్యత్తు కూడా.. ఇలానే మారుతుందన్నారు. సరైన వ్యక్తిని ఎంచుకోవాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. మరి దీనిపై అంబటి ఏమంటారో చూడాలి.
This post was last modified on May 5, 2024 1:05 pm
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…