ఏపీలో రాజకీయాలు ఊపందుకున్న నేపథ్యంలో సంచలనాలు కూడా అదే రేంజ్లో తెరమీదికి వస్తున్నాయి. ప్రస్తుత ప్రధాన పార్టీలన్నీ కూడా.. పెద్ద ఎత్తున ప్రచారంలో దూకుడుగా ఉన్నాయి. పార్టీల అధినేత నుంచి నాయకుల వరకు కూడా.. అందరూ ప్రచారాన్ని ముమ్మరంగా ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా ఆయా నాయకుల కుటుంబాల్లోని పిల్లలు కూడా.. తెరమీదికి వస్తు న్నారు. చిత్రం ఏంటంటే.. తమ వారికి అనుకూలంగా ఓటేయాలని చెప్పాల్సిన ఈ పిల్లలు.. యాంటీ ప్రచారం చేస్తున్నారు.
రెండు రోజుల కిందట.. కాపు ఉద్యమనాయకుడు.. ప్రస్తుత వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె.. క్రాంతి భారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ను తన తండ్రి తిట్టడాన్ని ఆమె తప్పు బట్టారు. అంతేకాదు.. తాను పవన్తో నడుస్తాననిచెప్పారు. తన తండ్రిని జగన్ వాడుకుంటున్నారని కూడా.. సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఒకవైపు.. చర్చ సాగుతుండగానే.. తాజాగా మరో సంచలనం తెరమీదికి వచ్చింది. అదే.. వైసీపీ కీలక నేత.. సంబరాల రాంబాబుగా పేరు తెచ్చుకున్న మంత్రి అంబటి రాంబాబు అల్లుడి సెల్ఫీ వీడియో.
మంత్రి అంబటి రాంబాబుకు ముగ్గురూ ఆడపిల్లలే. వీరిలో ఒకరి భర్త డాక్టర్ గౌత్. ఈయన తాజాగా సెల్ఫీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో పెట్టారు. దీనిలో ఆయన తన సొంత మామ అంబటిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “నేనుఅంబటి రాంబాబు అల్లుడిని అది నా దురదృష్టం. ఎవరూ ఏం చేయలేరు” అంటూ… ప్రారంభించిన ఆయన.. తన మామ అత్యంత నీచ,నికృష్ట దరిద్రుడని అన్నారు. “అంబటి రాంబాబు వంటి నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాలపై పేలాలు ఏరుకునే వ్యక్తిని నా జీవితంలో ఇప్పటి వరకు చూడలేద”న్నారు
“నేనూ రోజూ ఉదయాన్నే దేవుడికి దణ్ణం పెట్టుకునేప్పుడు.. ఇంత నీచుడిని నా జీవితంలో ఇంకెప్పుడూ.. ఇంట్రడ్యూస్ చేయకు స్వామీ అని దేవుడిని వేడుకుంటా. అంత నీచకృష్ట వ్యక్తి. కనీసం విలువలు, బాధ్య త.. ఏమాత్రం లేని వ్యక్తి” అని వ్యాఖ్యానించారు. ఇలాంటి వారికి ఓటేసే ముందు ఆలోచించుకోవా లని సూచించారు. ఓటేస్తే.. ఎంత లేకిపనైనా చేసి బతకొచ్చనే వారిని ప్రోత్సహిస్తున్నట్టు అన్నారు. ఇలాంటి వారికి ఓటేస్తే.. రేపు భవిష్యత్తు కూడా.. ఇలానే మారుతుందన్నారు. సరైన వ్యక్తిని ఎంచుకోవాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. మరి దీనిపై అంబటి ఏమంటారో చూడాలి.
రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…
కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగత వంగవీటి మోహన్రంగా కుమార్తె ఆశాలత త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…
కేవలం మూడు వారాలు... ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మళ్లీ పాత స్థానానికి పడిపోవడానికి పట్టిన…
యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా…
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…