Political News

అన‌కాప‌ల్లిలో సీఎం ర‌మేష్‌పై వైసీపీ నేత‌ల దాడి.. గాయాలు!

ఉమ్మ‌డి విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని అన‌కాప‌ల్లి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర క‌ల‌క‌లం రేగింది. వైసీపీ వ‌ర్సెస్ బీజేపీ కార్య‌క‌ర్త ల మ‌ధ్య నెల‌కొన్న తీవ్ర ఉద్రిక్త‌త‌లు దాడుల‌కు దారితీశాయి. ఈ దాడిలో అన‌కాప‌ల్లి కూట‌మి అభ్య‌ర్థి, బీజేపీ నేత సీఎం ర‌మేష్‌కు గాయాల‌య్యాయి. అంతేకాదు.. సీఎం ర‌మేష్‌ను పోలీసుల వాహ‌నంలో నుంచి దింపి మ‌రీ వైసీపీ కార్య‌క‌ర్త‌లు కొట్టార‌ని బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు మాత్రం మౌనంగా ఉన్నారు.

ఏం జ‌రిగింది?

ఎన్నిక‌ల ప్ర‌చారానికి మ‌రో ప‌ది రోజులు మాత్ర‌మే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో సీఎం ర‌మేష్‌.. త‌న ప్ర‌చారాన్ని పెంచారు. ఈ క్ర‌మంలో ఆయ‌నతో పాటు కూట‌మి పార్టీల నాయ‌కులు.. కూడా.. పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. శ‌నివారం మ‌ధ్యాహ్నం.. బీజేపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు.. ఇక్క‌డ నుంచి బ‌రిలో ఉన్న వైసీపీ అభ్య‌ర్థి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల‌నాయుడు స్వ‌గ్రామం మాడుగుల మండ‌లం తాడువ గ్రామంలో ప్ర‌చారానికి వెళ్లారు. అయితే.. బూడి ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్నారు. ఈ విష‌యాన్ని గుర్తించిన వైసీపీ కార్య‌క‌ర్త‌లు, ఆయ‌న అనుచ‌రులు.. బీజేపీ ప్ర‌చారాన్ని అడ్డుకున్నారు.

బీజేపీ నేత‌ల‌ను త‌రిమి త‌రిమి కొట్టారు. మా గ్రామానికే(తాడువ‌) వ‌స్తారా? అంటూ.. బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌ను ప‌రుగులు పెట్టించారు. ఇక‌, ఎక్క‌డో ప్ర‌చారంలో ఉన్న సీఎం ర‌మేష్‌కు ఈ విష‌యం తెలిసి.. ఆయ‌న హుటాహుటిన తాడువ‌కు బ‌య‌లు దేరారు. అయితే.. మార్గం మ‌ధ్య‌లో (తాడువ గ్రామ ప‌రిధిలో) పోలీసులు ర‌మేష్ ను అడ్డుకున్నారు. ఆయ‌న‌ను అరెస్టు చేసి..వాహ‌నంలోకి ఎక్కించి త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. అప్ప‌టికే ఈ విష‌యం తెలుసుకున్న బూడి అనుచ‌రులు .. కొంద‌రు నాయ‌కులు పోలీసు వాహ‌నం వ‌ద్ద‌కు చేరుకుని సీఎం ర‌మేష్‌పై భౌతిక దాడికి దిగారు. ఆయ‌న చొక్కాను చింపేసి పిడిగుద్దులు కురిపించారు.

ఎక్క‌డి నుంచో వ‌చ్చి ఇక్క‌డ పోటీ చేస్తావా? అంటూ.. దూషించారు. దీంతో ప‌రిస్థితి మ‌రింత తీవ్రం కావ‌డంతో పోలీసులు స్వ‌ల్ప లాఠీ చార్జి చేసి వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను అక్క‌డ నుంచి పంపించి.. సీఎం ర‌మేష్‌ను స‌మీపంలోని దేవ‌ర‌ప‌ల్లి పోలీసు స్టేష‌న్కు త‌ర‌లించారు. ఇదిలావుంటే.. ఈ ఘ‌ట‌న‌పై బూడి ముత్యాల‌నాయుడు మాట్లాడుతూ.. వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను త‌న‌ను చంపేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. త‌న ఇంటిపై డ్రోన్లు ఎగుర‌వేశార‌ని అందుకే.. కార్య‌క‌ర్త‌ల‌కు కోపం వ‌చ్చి ఉంటుంద‌ని వ్యాఖ్యానించారు.కాగా, ఈ ఘ‌ట‌న‌తో అన‌కాప‌ల్లిలో ఉద్రిక్త‌త‌లు మ‌రింత పెరిగాయి.

Satya

Recent Posts

సెట్ కి రాకుండా సినిమా తీసిన సింగీతం

దర్శకుడు లొకేషన్లో లేకుండా సినిమా తీయడం సాధ్యం అవుతుందా? అదెలా సాధ్యం అంటారా? సింగ్ గీతం టీం ఈ విషయాన్ని…

40 minutes ago

బ్రాండింగ్ లో బాబు, పవన్ తర్వాతే ఎవరైనా!

నిజమేనండోయ్… ఏ విషయంలో అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ…

2 hours ago

స‌మంత స్టార్ ప‌వర్ క‌నిపిస్తోంది

తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్ల‌కు మాత్ర‌మే సాధ్య‌మైన స్టార్ ఇమేజ్ సంపాదించింది స‌మంత‌. విజ‌య‌శాంతి, అనుష్క‌ల త‌ర్వాత హీరోల‌తో…

6 hours ago

ఇండియాలో ఆల్ టైం రికార్డు దిశ‌గా అబ్సెష‌న్

కేవ‌లం ప‌ది కోట్ల బ‌డ్జెట్లో తెర‌కెక్కిన సినిమా.. అబ్సెష‌న్. ఈ హాలీవుడ్ హార్ర‌ర్ మూవీ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి వ‌ర‌ల్డ్ వైడ్…

9 hours ago

తొందరపాటు ఎందుకు పెద్ది

స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…

10 hours ago

వరప్రసాద్ స్నేహితులకు క్లాష్ తప్పదా

సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…

11 hours ago