Political News

శ్యామల పొలిటికల్ కథలు.! ఛీటింగ్ సినిమా.!

బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ రియాల్టీ షో ఫేం శ్యామల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో క్యాంపెయినర్‌గా సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

శ్యామలతోపాటు ఆమె భర్త గతంలోనే వైసీపీలో చేరారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో శ్యామలకీ, ఆమె భర్తకీ యాక్సెస్ బాగానే వుంటుందని వైసీపీ వర్గాలు అంటుంటాయి.
ఆ కారణంగానే, ఎన్నికల సమయంలో శ్యామల, ఆమె భర్త (ఈయనా టీవీ నటుడే) ఇద్దరూ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తప్పేముంది.? ఎవరైనా, ఏ పార్టీకి అయినా అనుకూలంగా ప్రచారం చేయొచ్చు. ఏ పార్టీలో అయినా చేరొచ్చు. రాజకీయ విమర్శలూ చేయొచ్చు.

శ్యామల కూడా అలాగే రాజకీయ విమర్శలు చేస్తోంది. అడవి, గుంట నక్క.. అంటూ ఏదో కథ చెప్పింది తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్యామల. అది కాస్తా వైసీపీ శ్రేణుల పుణ్యమా అని వైరల్ అయ్యింది, శ్యామలపై విమర్శలకీ కారణమవుతోంది. తమలపాకుతో నువ్వొకటిస్తే, తలుపు చెక్కతో నేనొకటిస్తా.. అన్నట్లుంటుంది రాజకీయాల్లో వ్యవహారం.

శ్యామల చెప్పిన కథకి కౌంటర్ ఎటాక్‌గా చాలా కథలు పుట్టుకొస్తున్నాయి. గతంలో శ్యామల భర్తపై నమోదైన చీటింగ్ కేసు, ఆయన అరెస్టు వ్యవహారం ఇవన్నీ ఇప్పుడు ఇంకోసారి హాట్ టాపిక్ అవుతున్నాయి. వైసీపీలో చేరాలంటే, ఇలాంటి కేసులు వుండాల్సిందే.. అదే వైసీపీలో చేరడానికి అర్హత.. ఆ అర్హత సాధించేశారు శ్యామలగారూ.. అని సెటైర్లేస్తున్నారు నెటిజనం.

ఏదిఏమైనా, శ్యామల రాజకీయ విమర్శల వ్యవహారం, వైసీపీకి ఏమాత్రం లాభం చేకూర్చే అవకాశం లేదు. ఆమె వల్ల పదో పాతికో ఓట్లు కూడా అదనంగా వచ్చే అవకాశం లేదు సరికదా, ఆమె భర్తపై చీటింగ్ కేసు వ్యవహారం.. వైసీపీకి ఇంకాస్త నెగెటివ్ అయ్యేలా వుంది.

This post was last modified on May 5, 2024 12:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

26 minutes ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

1 hour ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

1 hour ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

3 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

4 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

5 hours ago