Political News

శింగ‌న‌మ‌ల సింగ‌మ‌లై ఎవ‌రో?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. పోలింగ్ తేదీ ద‌గ్గ‌ర ప‌డుతున్నా కొద్దీ పార్టీల‌న్నీ ప్ర‌చారంలో దూసుకెళ్తున్నాయి. అభ్య‌ర్థులు గెలుపోట‌ముల‌పై బేరీజు వేసుకుంటూ ఓట్ల వేట‌లో సాగుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఏపీలోని అనంతపురం జిల్లా శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గంలో పోరు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇక్క‌డ కాంగ్రెస్ గెలిచేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉండ‌ట‌మే అందుకు కార‌ణ‌మ‌ని చెప్పాలి. గ‌తంలో ఇక్క‌డి నుంచి రెండు సార్లు గెలిచిన మాజీ మంత్రి శైల‌జానాథ్ మ‌రోసారి కాంగ్రెస్ నుంచి విజ‌య‌దుందుభి మోగించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.

శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గంపై శైల‌జ‌నాథ్‌కు మంచి ప‌ట్టుంది. 2004, 2009 ఎన్నిక‌ల్లో ఆయ‌న కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్క‌డ విజ‌యాలు సాధించారు. కానీ 2014, 2019లో ఓడిపోయారు. ఉమ్మ‌డి ఏపీ విభ‌జ‌న కార‌ణంగా ఏపీలో కాంగ్రెస్‌పై వ్య‌తిరేక‌త పెరిగిపోవ‌డం శైల‌జానాథ్‌కు చేటు చేసింది. కానీ ఈ సారి మాత్రం ఆయ‌న గెలవాల‌నే ల‌క్ష్యంతో సాగుతున్నారు. అధికార వైసీపీపై వ్య‌తిరేక‌తే ప్ర‌ధాన ఆయుధంగా చేసుకుని, గ‌తంలో నియోజ‌క‌వ‌ర్గంలో తాను చేసిన మంచి ప‌నుల‌ను వివ‌రిస్తూ ప్ర‌చారంలో శైల‌జానాథ్ సాగిపోతున్నారు.

ఇక్క‌డ శైల‌జానాథ్‌కు వైసీపీ అభ్య‌ర్థి వీరాంజ‌నేయులు, టీడీపీ నుంచి పోటీ చేస్తున్న బండారు శ్రావణితో గ‌ట్టి పోటీ ఉంది. ఇక్క‌డ వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి మ‌రోసారి గెలిచే అవ‌కాశం లేద‌ని అభ్య‌ర్థిని జ‌గ‌న్ మార్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. కానీ ప‌ద్మావ‌తి భ‌ర్త సాంబ‌శివారెడ్డి ప‌ట్టుబ‌ట్టి మ‌రీ త‌న వ‌ద్ద టిప్ప‌ర్ డ్రైవ‌ర్‌గా ప‌నిచేసే వీరాంజ‌నేయులుకు టికెట్ ఇప్పించుకోవ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికే ప‌ద్మావ‌తిపై వ్య‌తిరేక‌త‌తో ఉన్న ఆ పార్టీ నాయ‌కులు ఇప్పుడు అస‌లే స‌పోర్ట్ చేయ‌డం లేదని తెలిసింది. ఇక టీడీపీ నాయ‌కురాలు బండారు శ్రావ‌ణి కూడా గెలుపు కోసం గ‌ట్టిగా కృషి చేస్తున్నారు. ఆమెకూ గెలిచే అవ‌కాశాలున్నాయ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

This post was last modified on May 4, 2024 2:03 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

16 mins ago

హర్యానా : కమలం ‘చే’జారేనా ?

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…

36 mins ago

ఆ భూమి జూనియర్ ఎప్పుడో అమ్మేశాడు !

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…

2 hours ago

సోనియ‌మ్మ‌.. సెంటిమెంటు రాహుల్‌ను కాపాడుతుందా?

రాజ‌కీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ‌. ఉద్ధండ నాయ‌కుల నుంచి చ‌రిత్ర సొంతం చేసుకున్న పార్టీల వ‌ర‌క కూడా సెంటి మెంటుకు…

3 hours ago

“వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌క‌పోవ‌చ్చు”

వైసీపీ నాయ‌కులు స‌హా స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి క‌ళ్ల‌లో భ‌యం క‌నిపిస్తోంద‌ని ఆ పార్టీ రెబ‌ల్ ఎంపీ, ఉండి నుంచి…

10 hours ago

సీమ ఓట్ల హైజాక్‌.. ఎవ‌రికి మేలు?

రాయ‌లసీమ‌లో ఓట్ల హైజాక్ జ‌రిగిందా? వైసీపీకి ప‌డాల్సిన ఓట్లు.. కాంగ్రెస్‌కు ప‌డ్డాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు కొంద‌రు రాజ‌కీయ విశ్లేష‌కులు.…

14 hours ago