హోరాహోరీగా సాగుతున్న ఏపీ ఎన్నికల యుద్ధం మరో వారం రోజుల్లో ఒక కొలిక్కి రావటంతో పాటు.. ఎన్నికల్లో కీలక అంకమైన పోలింగ్ దశకు చేరుకోనుంది. ఇలాంటి వేళలో ఎంతటి హడావుడి నెలకొని ఉంటుందో తెలిసిందే. రెండోసారి అధికారాన్ని ఎట్టి పరిస్థితుల్లో సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు రచించటంతో పాటు.. రోజువారీ ప్రచారంతో దూసుకెళుతున్నారు. అయితే ఎన్ని చేసినా ఏదో అనుమానం వెంటాడుతోందట. అందుకే ఎందుకైనా మంచిదని ఇంటి వాస్తు చూపించారట.
వాస్తు నిపుణుడి సలహా మేరకు తాడేపల్లిలోని తన నివాసంలో వాస్తు మార్పులు చేపట్టినట్లుగా చెబుతున్నారు. తాడేపల్లి ప్యాలెస్ లోపల ఏం జరుగుతుంది? ఎవరెవరు ఉన్నారు? లాంటివి దగ్గర్లోని అపార్టుమెంట్ నుంచి చూస్తే కనిపించేలా ఉండేది. దీంతో.. భవనం చుట్టూ ఎత్తైన గోడలు నిర్మించారు. దీనికి ఐరెన్ రాడ్లను నిర్మించారు. దీంతో.. కాస్త దగ్గర నుంచి చూసినా.. జగన్ నివాసం పోర్టికోలో ఎవరున్నారన్న విషయం తెలిసే పరిస్థితి లేదు.
ఇదిలా ఉంటే.. కీలకమైన ఎన్నికల వేళ.. ఇంటి మూల ఉన్న ప్రహరీని తొలగించినట్లుగా చెబుతున్నారు. వాస్తు నిపుణులు చేసిన సూచనలతోనే ఈ మార్పులు చేపట్టినట్లుగా చెబుతున్నారు.
ఊపిరి సలపని పనులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ముఖ్యమంత్రి జగన్.. తన ఇంట్లో జరుగుతున్న వాస్తు మార్పుల్ని దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో మరింత సానుకూలత కోసమే తాజా మార్పులు చేసినట్లుగా చెబుతున్నారు.
This post was last modified on May 4, 2024 12:45 pm
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…