Political News

అమిత్ షా మౌనంపై ఆశ్చర్యం !

తెలంగాణలో ఈసారి 17 ఎంపీ స్థానాలకు 12 స్థానాలలో గెలుపు ఖాయం అని బీజేపీ అధిష్టానం గట్టి నమ్మకంతో ఉంది. నరేంద్రమోడీ ఆకర్షణ, రామమందిరం, హిందుత్వవాదం తమను గెలుపు వాకిట నిలబడతాయని భావిస్తున్నారు. అందుకే ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాలు తెలంగాణలో తరచూ పర్యటనలు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, సినీ నటులను ప్రచారానికి దించుతున్నారు.

అయితే ఈ సారి హోంమంత్రి అమిత్ షా పర్యటన తెలంగాణ బీజేపీ నేతలలో చర్చకు తెరలేపింది. గత కొన్నేళ్లుగా తెలంగాణలో బీజేపీ బలోపేతం కోసం పార్టీ అధిష్టానం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. వచ్చిన ప్రతిసారి అమిత్ షా రాష్ట్ర బీజేపీ నేతలను పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై క్లాస్ పీకడంతో పాటు నేతల తప్పిదాలను సాక్ష్యాలతో సహా ముందుపెట్టి నిలదీసి వెళ్తున్నాడు. అందుకే తెలంగాణ బీజేపీ నేతలు అమిత్ షా సమావేశం అంటే హడలిపోయే పరిస్థితికి వచ్చారు.

తాజాగా ఎన్నికల నేపథ్యంలో పర్యటనకు విచ్చేసిన అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతల సమావేశంలో 17 పార్లమెంటు స్థానాలలో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకుని కొన్ని సూచనలు మాత్రం చేశారట. అంతకుమించి ఏ ఒక్క నేతను కూడా ఒక్కమాట అనలేదట. అమిత్ షా అంత సైలెంట్ గా సమావేశం ముగించడం చూసి నేతలు ఆశ్చర్యానికి లోనయ్యారట.

తెలంగాణలో 17కు 12 స్థానాలలో గెలుపు ఖాయం అని అమిత్ షా చెప్పడంతో అన్ని స్థానాలు గెలుస్తున్నామా ? అని బీజేపీ నేతలు ఆశ్చర్యపోయారట. అధిక స్థానాలు గెలుస్తున్నందుకు సంతోషంతో ఏమీ అనకుండా ఉన్నారా ? లేక ఎన్ని సార్లు చెప్పినా ఏం ప్రయోజనం ? ఈ నేతలు మారేది లేదు. చచ్చేది లేదు అని వదిలేశాడా ? అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అమిత్ షా సైలెంట్ తెలంగాణ బీజేపీ నేతలకు అంతులేని ఆశ్చర్యానికి గురిచేసిందని బీజేపీ కార్యాలయవర్గాల సమాచారం.

This post was last modified on May 4, 2024 10:16 am

Share
Show comments
Published by
satya

Recent Posts

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

59 mins ago

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

2 hours ago

హర్యానా : కమలం ‘చే’జారేనా ?

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…

2 hours ago

ఆ భూమి జూనియర్ ఎప్పుడో అమ్మేశాడు !

ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…

3 hours ago

సోనియ‌మ్మ‌.. సెంటిమెంటు రాహుల్‌ను కాపాడుతుందా?

రాజ‌కీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ‌. ఉద్ధండ నాయ‌కుల నుంచి చ‌రిత్ర సొంతం చేసుకున్న పార్టీల వ‌ర‌క కూడా సెంటి మెంటుకు…

5 hours ago

“వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌క‌పోవ‌చ్చు”

వైసీపీ నాయ‌కులు స‌హా స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి క‌ళ్ల‌లో భ‌యం క‌నిపిస్తోంద‌ని ఆ పార్టీ రెబ‌ల్ ఎంపీ, ఉండి నుంచి…

12 hours ago