ఇదేదో బంపర్ అఫర్ లా ఉందే అని ఆశ్చర్యపోతున్నాారా ? అందరూ అదే అనుకుంటున్నారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఈ ఎన్నికలలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మీద గెలిస్తే ఎంపీ అయి కేంద్ర మంత్రి అవుతానని, ఓడిపోతే ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ అవుతానని తన సన్నిహితులతో చెబుతున్నట్లు సమాచారం. ఈ మేరకు బీజేపీ అధిష్టానం తనకు హామీ ఇచ్చిందని అమె అంటున్నారట.
హైదరబాాద్ ఎంపీ సీటు అనేది హాట్ సీట్. అందుకే దేశంలోని అందరి దృష్టి అక్కడే ఉంది. ఈ స్థానం నుండి సలాఉద్దీన్ ఓవైసీ ఆరు సార్లు, అసదుద్దీన్ ఓవైసీ నాలుగు సార్లు విజయం సాధించారు. నాలుగు దశాబ్దాలుగా అక్కడ వారిదే హవా. ఈ నేపథ్యంలో బీజేపీ వ్యూహాత్మకంగా మాధవీలతను బరిలోకి దింపింది. శ్రీరామనవమి రోజు బాణం ఎక్కుపెట్టినట్లు వైరలైన మాధవీలత వీడియో ఎన్నికల హీట్ ను పెంచింది.
పాతబస్తీలో ఎంఐఎం చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అడ్డుకుంటానని, మైనార్టీలు, హిందువులకు ఎంఐఎం న్యాయం చేయడం లేదని, హైదరాబాద్ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని, 40 ఏళ్ల తర్వాత ఇక్కడి ప్రజలకు మంచి రోజులు రానున్నాయని మాధవీలత ప్రచారంలో దూసుకుపోతున్నది.
బీజేపీలో మహిళా అగ్రనేతలు సుష్మాస్వరాజ్, స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్ ల మాదిరిగా మాధవీలత ఎదిగిపోవడం ఖాయమని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. మరి బీజేపీ అధిష్టానం ఏం చెప్పిందో కానీ రాష్ట్రంలో మిగిలిన బీజేపీ అభ్యర్థుల కన్నా ప్రచారంలో ఆమె అగ్రభాగంలో నిలుస్తున్నారన్నది వాస్తవం.
బాలీవుడ్లో దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి హై ప్రొఫైల్ హీరోయిన్ల పోటీని తట్టుకుని చాలా ఏళ్లుగా టాప్లో కొనసాగుతున్న…
జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…
ఇటీవలే విడుదలైన నాగబంధంకు అంత ఓపెనింగ్స్ వస్తాయని ఊహించినవాళ్లు చాలా తక్కువ. ఎంత విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సినిమా…
రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…
కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగత వంగవీటి మోహన్రంగా కుమార్తె ఆశాలత త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…