ఇదేదో బంపర్ అఫర్ లా ఉందే అని ఆశ్చర్యపోతున్నాారా ? అందరూ అదే అనుకుంటున్నారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఈ ఎన్నికలలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మీద గెలిస్తే ఎంపీ అయి కేంద్ర మంత్రి అవుతానని, ఓడిపోతే ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ అవుతానని తన సన్నిహితులతో చెబుతున్నట్లు సమాచారం. ఈ మేరకు బీజేపీ అధిష్టానం తనకు హామీ ఇచ్చిందని అమె అంటున్నారట.
హైదరబాాద్ ఎంపీ సీటు అనేది హాట్ సీట్. అందుకే దేశంలోని అందరి దృష్టి అక్కడే ఉంది. ఈ స్థానం నుండి సలాఉద్దీన్ ఓవైసీ ఆరు సార్లు, అసదుద్దీన్ ఓవైసీ నాలుగు సార్లు విజయం సాధించారు. నాలుగు దశాబ్దాలుగా అక్కడ వారిదే హవా. ఈ నేపథ్యంలో బీజేపీ వ్యూహాత్మకంగా మాధవీలతను బరిలోకి దింపింది. శ్రీరామనవమి రోజు బాణం ఎక్కుపెట్టినట్లు వైరలైన మాధవీలత వీడియో ఎన్నికల హీట్ ను పెంచింది.
పాతబస్తీలో ఎంఐఎం చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అడ్డుకుంటానని, మైనార్టీలు, హిందువులకు ఎంఐఎం న్యాయం చేయడం లేదని, హైదరాబాద్ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని, 40 ఏళ్ల తర్వాత ఇక్కడి ప్రజలకు మంచి రోజులు రానున్నాయని మాధవీలత ప్రచారంలో దూసుకుపోతున్నది.
బీజేపీలో మహిళా అగ్రనేతలు సుష్మాస్వరాజ్, స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్ ల మాదిరిగా మాధవీలత ఎదిగిపోవడం ఖాయమని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. మరి బీజేపీ అధిష్టానం ఏం చెప్పిందో కానీ రాష్ట్రంలో మిగిలిన బీజేపీ అభ్యర్థుల కన్నా ప్రచారంలో ఆమె అగ్రభాగంలో నిలుస్తున్నారన్నది వాస్తవం.
This post was last modified on May 4, 2024 11:17 am
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…