Political News

ఆ పార్టీలో అందరూ కాబోయే మంత్రులే !

భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో అబ్ కీ బార్ .. చార్ సౌ పార్ నినాదంతో దేశంలో ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నది. అయితే తొలి, మలి దశ పోలింగ్ అనంతరం బీజేపీకి ఈ ఎన్నికలు అంత ఆశాజనకంగా లేవని ఆ పార్టీ నేతల మారిన స్వరాలు స్పష్టం చేస్తున్నాయి. అనుకూల వాతావరణం లేకపోవడంతో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు హిందూ – ముస్లిం విభజన, రిజర్వేషన్ల అంశాన్ని తెరమీదకు తెచ్చారని విమర్శలు వస్తున్నాయి.

ఉత్తరాదిన అనుకున్న స్థానాలు వస్తాయన్న నమ్మకం లేకపోవడం, కర్ణాటకలో ప్రజ్వల్ సెక్స్ స్కాండల్ ఉదంతం నేపథ్యంలో బీజేపీ తెలంగాణ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఏపీలో ఎవరు గెలిచినా తమకే మద్దతుగా నిలుస్తారని భావిస్తున్నారు.

అయితే తెలంగాణలో బీజేపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులంతా తనను గెలిపిస్తే కేంద్ర మంత్రి అయిపోతామని ఎవరికివారు ప్రచారం చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది. 2014లో తెలంగాణ నుండి బండారు దత్తాత్రేయకు మంత్రి పదవి ఇచ్చి మధ్యలోనే తొలగించారు. 2019 ఎన్నికల తరువాత ఏపీ, తెలంగాణ నుండి కలిపి ఒక్క కిషన్ రెడ్డికి మాత్రమే కేంద్ర మంత్రిగా అవకాశం లభించింది. బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లకు కేంద్ర మంత్రి వర్గంలో స్థానం ఖాయం భారీగా ప్రచారం జరిగినా అలాంటి అద్భుతాలు ఏం జరగలేదు.

ఇక ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ నుండి పోటీ చేస్తున్న కిషన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, డీకే అరుణ, బండి సంజయ్‌, విశ్వేశ్వర్‌రెడ్డి, ధర్మపురి అరవింద్‌, మాధవీలత, రఘునందన్‌రావు తదితరులు అందరూ తమను గెలిపిస్తే కేంద్రంలో మంత్రులం అవుతామని ప్రచారం చేసుకుంటున్నారు. మరి తెలంగాణ నుండే ఇంత మంది కేంద్రమంత్రులు అయితే మిగతా రాష్ట్రాలలో గెలిచిన వారికి ఏమిస్తారని రాజకీయ పరిశీలకులు ఎద్దేవా చేస్తున్నారు.

This post was last modified on May 4, 2024 10:39 am

Share
Show comments

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

2 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

3 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

4 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago