భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో అబ్ కీ బార్ .. చార్ సౌ పార్ నినాదంతో దేశంలో ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తున్నది. అయితే తొలి, మలి దశ పోలింగ్ అనంతరం బీజేపీకి ఈ ఎన్నికలు అంత ఆశాజనకంగా లేవని ఆ పార్టీ నేతల మారిన స్వరాలు స్పష్టం చేస్తున్నాయి. అనుకూల వాతావరణం లేకపోవడంతో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు హిందూ – ముస్లిం విభజన, రిజర్వేషన్ల అంశాన్ని తెరమీదకు తెచ్చారని విమర్శలు వస్తున్నాయి.
ఉత్తరాదిన అనుకున్న స్థానాలు వస్తాయన్న నమ్మకం లేకపోవడం, కర్ణాటకలో ప్రజ్వల్ సెక్స్ స్కాండల్ ఉదంతం నేపథ్యంలో బీజేపీ తెలంగాణ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఏపీలో ఎవరు గెలిచినా తమకే మద్దతుగా నిలుస్తారని భావిస్తున్నారు.
అయితే తెలంగాణలో బీజేపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులంతా తనను గెలిపిస్తే కేంద్ర మంత్రి అయిపోతామని ఎవరికివారు ప్రచారం చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది. 2014లో తెలంగాణ నుండి బండారు దత్తాత్రేయకు మంత్రి పదవి ఇచ్చి మధ్యలోనే తొలగించారు. 2019 ఎన్నికల తరువాత ఏపీ, తెలంగాణ నుండి కలిపి ఒక్క కిషన్ రెడ్డికి మాత్రమే కేంద్ర మంత్రిగా అవకాశం లభించింది. బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లకు కేంద్ర మంత్రి వర్గంలో స్థానం ఖాయం భారీగా ప్రచారం జరిగినా అలాంటి అద్భుతాలు ఏం జరగలేదు.
ఇక ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ నుండి పోటీ చేస్తున్న కిషన్రెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ, బండి సంజయ్, విశ్వేశ్వర్రెడ్డి, ధర్మపురి అరవింద్, మాధవీలత, రఘునందన్రావు తదితరులు అందరూ తమను గెలిపిస్తే కేంద్రంలో మంత్రులం అవుతామని ప్రచారం చేసుకుంటున్నారు. మరి తెలంగాణ నుండే ఇంత మంది కేంద్రమంత్రులు అయితే మిగతా రాష్ట్రాలలో గెలిచిన వారికి ఏమిస్తారని రాజకీయ పరిశీలకులు ఎద్దేవా చేస్తున్నారు.
This post was last modified on May 4, 2024 10:39 am
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…