చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్ లో ఉంది. బీజేపీ జాతీయ పార్టీ అయినందున అది పై స్థానంలో ఉంటుంది. అయితే కొత్తగా ఈవీఎంలో గుర్తుపక్కన పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు ఉండడం కొండాకు వచ్చిన కష్టానికి కారణం.
చేవెళ్ల లోక్ సభ స్థానం నుండి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేరుతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున ఒక వ్యక్తి పోటీచేస్తున్నాడు. ఈ కొండాకు ఆ కొండా ఇప్పుడు కంట్లో నలుసులా మారాడు. డమ్మా ఈవీఎంలతో ఎన్నికల ప్రచారానికి వెళ్తే 2 వ నంబరులో ఉన్న కొండాకు బదులు 5వ నంబరులో ఉన్న కొండా గుర్తును చూయిస్తుండడం ఈయన ఆందోళనకు కారణం.
దీంతో హైకోర్టులో అత్యవసర పిటిషన్ వేసి తన గోడును కోర్టుకు వెళ్లబోసుకున్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. తమ రెండు పేర్లు ఒకేలా ఉండటంతో ఓటర్లు అయోమయానికి గురయ్యే అవకాశం ఉందని, కనీసం వరుస సంఖ్యను అయినా మార్చమని కోరారు.
ఈవీఎంలో తన గుర్తు నెంబర్ 2 లో ఉన్నందున, తన పేరుతో ఉన్న మరో అభ్యర్థి సీరియల్ నంబర్ 10 తర్వాత ఉండేలా కేంద్ర ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని పిటీషన్లో అభ్యర్థించారు. ప్రస్తుతం ఈవీఎంలు కూడా సిద్ధమైపోయి, వరుస సంఖ్యలు కేటాయించిన దశలో వరుస సంఖ్యలు మార్చడం సాధ్యం కాదని, ఎన్నికల ప్రక్రియలో ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టంచేసింది. మరి కొండా ఈ ఎన్నికలను ఎలా గట్టెక్కుతాడో వేచిచూడాలి.
This post was last modified on May 3, 2024 9:15 pm
మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో…
సౌతాఫ్రికా సిరీస్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…
పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…
‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…
తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…
రీఎంట్రీ తర్వాత వరుసగా మూడు రీమేక్లతో పలకరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ ఏడాది రెండు నెలల వ్యవధిలో రెండు…