చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్ లో ఉంది. బీజేపీ జాతీయ పార్టీ అయినందున అది పై స్థానంలో ఉంటుంది. అయితే కొత్తగా ఈవీఎంలో గుర్తుపక్కన పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు ఉండడం కొండాకు వచ్చిన కష్టానికి కారణం.
చేవెళ్ల లోక్ సభ స్థానం నుండి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేరుతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున ఒక వ్యక్తి పోటీచేస్తున్నాడు. ఈ కొండాకు ఆ కొండా ఇప్పుడు కంట్లో నలుసులా మారాడు. డమ్మా ఈవీఎంలతో ఎన్నికల ప్రచారానికి వెళ్తే 2 వ నంబరులో ఉన్న కొండాకు బదులు 5వ నంబరులో ఉన్న కొండా గుర్తును చూయిస్తుండడం ఈయన ఆందోళనకు కారణం.
దీంతో హైకోర్టులో అత్యవసర పిటిషన్ వేసి తన గోడును కోర్టుకు వెళ్లబోసుకున్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. తమ రెండు పేర్లు ఒకేలా ఉండటంతో ఓటర్లు అయోమయానికి గురయ్యే అవకాశం ఉందని, కనీసం వరుస సంఖ్యను అయినా మార్చమని కోరారు.
ఈవీఎంలో తన గుర్తు నెంబర్ 2 లో ఉన్నందున, తన పేరుతో ఉన్న మరో అభ్యర్థి సీరియల్ నంబర్ 10 తర్వాత ఉండేలా కేంద్ర ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని పిటీషన్లో అభ్యర్థించారు. ప్రస్తుతం ఈవీఎంలు కూడా సిద్ధమైపోయి, వరుస సంఖ్యలు కేటాయించిన దశలో వరుస సంఖ్యలు మార్చడం సాధ్యం కాదని, ఎన్నికల ప్రక్రియలో ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టంచేసింది. మరి కొండా ఈ ఎన్నికలను ఎలా గట్టెక్కుతాడో వేచిచూడాలి.
This post was last modified on May 3, 2024 9:15 pm
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…