చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్ లో ఉంది. బీజేపీ జాతీయ పార్టీ అయినందున అది పై స్థానంలో ఉంటుంది. అయితే కొత్తగా ఈవీఎంలో గుర్తుపక్కన పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు ఉండడం కొండాకు వచ్చిన కష్టానికి కారణం.
చేవెళ్ల లోక్ సభ స్థానం నుండి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేరుతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున ఒక వ్యక్తి పోటీచేస్తున్నాడు. ఈ కొండాకు ఆ కొండా ఇప్పుడు కంట్లో నలుసులా మారాడు. డమ్మా ఈవీఎంలతో ఎన్నికల ప్రచారానికి వెళ్తే 2 వ నంబరులో ఉన్న కొండాకు బదులు 5వ నంబరులో ఉన్న కొండా గుర్తును చూయిస్తుండడం ఈయన ఆందోళనకు కారణం.
దీంతో హైకోర్టులో అత్యవసర పిటిషన్ వేసి తన గోడును కోర్టుకు వెళ్లబోసుకున్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. తమ రెండు పేర్లు ఒకేలా ఉండటంతో ఓటర్లు అయోమయానికి గురయ్యే అవకాశం ఉందని, కనీసం వరుస సంఖ్యను అయినా మార్చమని కోరారు.
ఈవీఎంలో తన గుర్తు నెంబర్ 2 లో ఉన్నందున, తన పేరుతో ఉన్న మరో అభ్యర్థి సీరియల్ నంబర్ 10 తర్వాత ఉండేలా కేంద్ర ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని పిటీషన్లో అభ్యర్థించారు. ప్రస్తుతం ఈవీఎంలు కూడా సిద్ధమైపోయి, వరుస సంఖ్యలు కేటాయించిన దశలో వరుస సంఖ్యలు మార్చడం సాధ్యం కాదని, ఎన్నికల ప్రక్రియలో ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టంచేసింది. మరి కొండా ఈ ఎన్నికలను ఎలా గట్టెక్కుతాడో వేచిచూడాలి.
This post was last modified on May 3, 2024 9:15 pm
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…