చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్ లో ఉంది. బీజేపీ జాతీయ పార్టీ అయినందున అది పై స్థానంలో ఉంటుంది. అయితే కొత్తగా ఈవీఎంలో గుర్తుపక్కన పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు ఉండడం కొండాకు వచ్చిన కష్టానికి కారణం.
చేవెళ్ల లోక్ సభ స్థానం నుండి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేరుతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున ఒక వ్యక్తి పోటీచేస్తున్నాడు. ఈ కొండాకు ఆ కొండా ఇప్పుడు కంట్లో నలుసులా మారాడు. డమ్మా ఈవీఎంలతో ఎన్నికల ప్రచారానికి వెళ్తే 2 వ నంబరులో ఉన్న కొండాకు బదులు 5వ నంబరులో ఉన్న కొండా గుర్తును చూయిస్తుండడం ఈయన ఆందోళనకు కారణం.
దీంతో హైకోర్టులో అత్యవసర పిటిషన్ వేసి తన గోడును కోర్టుకు వెళ్లబోసుకున్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. తమ రెండు పేర్లు ఒకేలా ఉండటంతో ఓటర్లు అయోమయానికి గురయ్యే అవకాశం ఉందని, కనీసం వరుస సంఖ్యను అయినా మార్చమని కోరారు.
ఈవీఎంలో తన గుర్తు నెంబర్ 2 లో ఉన్నందున, తన పేరుతో ఉన్న మరో అభ్యర్థి సీరియల్ నంబర్ 10 తర్వాత ఉండేలా కేంద్ర ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని పిటీషన్లో అభ్యర్థించారు. ప్రస్తుతం ఈవీఎంలు కూడా సిద్ధమైపోయి, వరుస సంఖ్యలు కేటాయించిన దశలో వరుస సంఖ్యలు మార్చడం సాధ్యం కాదని, ఎన్నికల ప్రక్రియలో ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టంచేసింది. మరి కొండా ఈ ఎన్నికలను ఎలా గట్టెక్కుతాడో వేచిచూడాలి.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…
ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…