దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది
అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే రాజకీయాల్లో రంగు పడుతోంది. తన సొంత నియోజకవర్గం నగరిలో ఆమె రోజులు గడుస్తున్న కొద్దీ.. పోలింగ్ డేట్ చేరువ అవుతున్న కొద్దీ.. ఒకటి కాదు.. రెండు కాదు..రోజు రోజుకూ రంగులు పడుతూనే ఉన్నాయి. దీనికి కారణం..ఆమె వ్యవహార శైలే. మరో 10 రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. నేతలు అందరూ తమ వారిని మచ్చిక చేసుకుంటున్నారు. గతంలో ఉన్న విభేదాలను కూడా మరచిపోవాలని కోరుతున్నారు.
కానీ, నగరిలో మాత్రం రోజా అడగడం లేదు. పైగా.. తనకు వ్యతిరేకంగా ఉన్న వారిని మరింత దూరం చేసుకుంటున్నారు. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న నేపత్యంలో ఆమె నియోజకవర్గంలో సెగ మరింత పెరుగుతోంది. కీలక నాయకులు పార్టీకి, ఆమెకు కూడా దూరంగా జరుగుతున్నారు. మరి ఇది వచ్చే ఎన్నికల ఫలితాన్ని ముందుగానే వారు ఊహించి చేస్తున్నారో..లేక ఆమెపై విరక్తి చెందే ఇలా దూరమవుతున్నారో.. తెలియాలి. తాజాగా.. కీలకమైన 5 మండలాల వైసీపీ ఇన్చార్జ్ లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. దీనికి ప్రధాన కారణం.. రోజా వైఖరేనని వారు బహిరంగంగానే చెబుతున్నారు.
ఎవరెవరు?
This post was last modified on May 3, 2024 9:11 pm
రాయలసీమలో ఓట్ల హైజాక్ జరిగిందా? వైసీపీకి పడాల్సిన ఓట్లు.. కాంగ్రెస్కు పడ్డాయా? అంటే.. ఔననే అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు.…
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్పై చీటింగ్ కేసు నమోదయ్యింది. ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తానని చెప్పి తన వద్ద రూ.50…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఇంకా ప్రారంభం కాని ప్యాన్ ఇండియా మూవీకి డ్రాగన్ టైటిల్…
యూత్ హీరో రాజ్ తరుణ్ కు మంచి హిట్టు దక్కి ఎంత కాలమయ్యిందో చెప్పడం కష్టం. సీనియర్ హీరోలతో సపోర్టింగ్…
ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు ఇంకో పద్దెనిమిది రోజుల్లో రాబోతున్నాయి. ఎవరికి వారు విజయం పట్ల ధీమాగా ఉన్నారు. అధికార పార్టీ,…
మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…