దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే రాజకీయాల్లో రంగు పడుతోంది. తన సొంత నియోజకవర్గం నగరిలో ఆమె రోజులు గడుస్తున్న కొద్దీ.. పోలింగ్ డేట్ చేరువ అవుతున్న కొద్దీ.. ఒకటి కాదు.. రెండు కాదు..రోజు రోజుకూ రంగులు పడుతూనే ఉన్నాయి. దీనికి కారణం..ఆమె వ్యవహార శైలే. మరో 10 రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. నేతలు అందరూ తమ వారిని మచ్చిక చేసుకుంటున్నారు. గతంలో ఉన్న విభేదాలను కూడా మరచిపోవాలని కోరుతున్నారు.
కానీ, నగరిలో మాత్రం రోజా అడగడం లేదు. పైగా.. తనకు వ్యతిరేకంగా ఉన్న వారిని మరింత దూరం చేసుకుంటున్నారు. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న నేపత్యంలో ఆమె నియోజకవర్గంలో సెగ మరింత పెరుగుతోంది. కీలక నాయకులు పార్టీకి, ఆమెకు కూడా దూరంగా జరుగుతున్నారు. మరి ఇది వచ్చే ఎన్నికల ఫలితాన్ని ముందుగానే వారు ఊహించి చేస్తున్నారో..లేక ఆమెపై విరక్తి చెందే ఇలా దూరమవుతున్నారో.. తెలియాలి. తాజాగా.. కీలకమైన 5 మండలాల వైసీపీ ఇన్చార్జ్ లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. దీనికి ప్రధాన కారణం.. రోజా వైఖరేనని వారు బహిరంగంగానే చెబుతున్నారు.
ఎవరెవరు?
This post was last modified on May 3, 2024 9:11 pm
బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…
బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…
ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…
కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…
ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…
బాలీవుడ్లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…