దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే రాజకీయాల్లో రంగు పడుతోంది. తన సొంత నియోజకవర్గం నగరిలో ఆమె రోజులు గడుస్తున్న కొద్దీ.. పోలింగ్ డేట్ చేరువ అవుతున్న కొద్దీ.. ఒకటి కాదు.. రెండు కాదు..రోజు రోజుకూ రంగులు పడుతూనే ఉన్నాయి. దీనికి కారణం..ఆమె వ్యవహార శైలే. మరో 10 రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. నేతలు అందరూ తమ వారిని మచ్చిక చేసుకుంటున్నారు. గతంలో ఉన్న విభేదాలను కూడా మరచిపోవాలని కోరుతున్నారు.
కానీ, నగరిలో మాత్రం రోజా అడగడం లేదు. పైగా.. తనకు వ్యతిరేకంగా ఉన్న వారిని మరింత దూరం చేసుకుంటున్నారు. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న నేపత్యంలో ఆమె నియోజకవర్గంలో సెగ మరింత పెరుగుతోంది. కీలక నాయకులు పార్టీకి, ఆమెకు కూడా దూరంగా జరుగుతున్నారు. మరి ఇది వచ్చే ఎన్నికల ఫలితాన్ని ముందుగానే వారు ఊహించి చేస్తున్నారో..లేక ఆమెపై విరక్తి చెందే ఇలా దూరమవుతున్నారో.. తెలియాలి. తాజాగా.. కీలకమైన 5 మండలాల వైసీపీ ఇన్చార్జ్ లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. దీనికి ప్రధాన కారణం.. రోజా వైఖరేనని వారు బహిరంగంగానే చెబుతున్నారు.
ఎవరెవరు?
దర్శకుడు లొకేషన్లో లేకుండా సినిమా తీయడం సాధ్యం అవుతుందా? అదెలా సాధ్యం అంటారా? సింగ్ గీతం టీం ఈ విషయాన్ని…
నిజమేనండోయ్… ఏ విషయంలో అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ…
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…