జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా బీజేపీపై విమర్శలు గుప్పించేవాళ్లు. ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి మరీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కేసీఆర్ మాటలతో చెలరేగిన రోజులూ ఉన్నాయి. కానీ ఇప్పుడు రిజర్వేషన్ల రద్దు అనే అంశంపై కేసీఆర్ సైలెంట్గా ఉండటం, బీజేపీని ఒక్క మాట కూడా అనకపోవడం హాట్ టాపిక్ గా మారింది. తన తనయ కవిత బెయిల్ కోసమే కేసీఆర్ కాంప్రమైజ్ అయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు, రాజ్యాంగంపై పెద్ద రగడే కొనసాగుతోంది. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు, రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ సారి 400 సీట్లు గెలవాలని ఎన్డీయే కూటమి లక్ష్యంగా పెట్టుకోవడానికి కూడా కారణం అదేనని విమర్శిస్తోంది. ఎక్కువ మెజారిటీ ఉంటే రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను రద్దు చేయొచ్చని బీజేపీ కుట్ర పన్నుతోందని, అందుకే ఆ పార్టీకి ఓటు వేయొద్దని కాంగ్రెస్ పిలుపునిస్తోంది. మరోవైపు బీజేపీ మాత్రం రాజ్యాంగానికి తాము వ్యతిరేకం కాదని, రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయని చెబుతోంది.
ఇప్పుడు ఈ విషయంపై కాంగ్రెస్, బీజేపీ మధ్య వార్ నడుస్తోంది. కానీ తెలంగాణలో మెజారిటీ లోక్సభ స్థానాలు గెలిస్తేనే పార్టీకి మనుగడ ఉంటుందనే స్థితిలో కేసీఆర్ మాత్రం సైలెంట్గా ఉంటున్నారు. ప్రతి విషయంపైనా మాట్లాడే ఆయన.. ఇప్పుడు రిజర్వేషన్లపై మాత్రం మౌనం దాల్చడం అనుమానాలకు తావిస్తోంది. కవిత బెయిల్ కోసం ఈ విషయంలో బీజేపీని కేసీఆర్ నిలదీయడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. అందుకే బీజేపీ విషయంలో కేసీఆర్ మెతక వైఖరి అవలంబిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఏదైనా గట్టిగా మాట్లాడితే అసలుకే మోసం వస్తుందని కేసీఆర్ నెమ్మదించారని తెలిసింది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కూడా రాజ్యాంగాన్ని మార్చాలన్నారు. అప్పుడే దీనిపై విమర్శలొచ్చాయి. అందుకే ఇప్పుడు ఈ విషయంపై ఏం మాట్లాడినా ఇబ్బందేనని కేసీఆర్ కాంప్రమైజ్ అయినట్లు సమాచారం.
This post was last modified on May 3, 2024 5:58 pm
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…