ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డికేసులో తాజాగా సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ-8గా ఉన్న కడప ఎంపీ.. వైసీపీ నాయకుడు అవినాష్రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ను హైదరాబాద్లోని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అంతేకాదు.. ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. ఇదేసమయంలో ఆయన సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్న వాదనను కూడా తోసిపుచ్చింది.
ఇక, ఇదే కేసులో మరో భారీ ఊరట కూడా లబించింది. ఇప్పటివరుకు జైల్లో ఉన్న ఎంపీ అవినాష్రెడ్డి తండ్రి.. వైఎస్ భాస్కరరెడ్డికి తాజాగా తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికలకు ముందు ఇది మరింత కీలక పరిణామమనే చెప్పాలి. ఆయన ఆరోగ్య కారణాలతో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మేరకు అనుమతి ఇస్తున్నట్టు తెలిపింది. ఇక, ఇదే కేసులో తమకు కూడా బెయిల్ కావాలని కోరుతూ.. ఉదయ్ కుమార్రెడ్డి, సునీల్ కుమార్ యాదవ్లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టి వేసింది.
వివేకా కేసులో ఆయనను హత్య చేసిన.. దస్తగిరి అప్రూవర్గా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బెయిల్పై ఉన్నాడు. ఈయనన పులివెందుల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ కూడా చేస్తున్నాడు. అయితే.. తనకు ప్రాణ హాని ఉందని.. తనను జైల్లో ఉన్నప్పుడు బెదిరించారని.. డబ్బులు ఎర చూపారని పేర్కొంటూ.. పిటిషన్ వేశారు. ఈ క్రమంలోనే అవినాష్ బెయిల్ను రద్దు చేయాలని కోరాడు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు.. తాజాగా ఇచ్చిన తీర్పులో ఈ పిటిషన్ను కొట్టి వేసింది.
This post was last modified on May 3, 2024 12:47 pm
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…
టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…
‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…
ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…