ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డికేసులో తాజాగా సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ-8గా ఉన్న కడప ఎంపీ.. వైసీపీ నాయకుడు అవినాష్రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ను హైదరాబాద్లోని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అంతేకాదు.. ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. ఇదేసమయంలో ఆయన సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్న వాదనను కూడా తోసిపుచ్చింది.
ఇక, ఇదే కేసులో మరో భారీ ఊరట కూడా లబించింది. ఇప్పటివరుకు జైల్లో ఉన్న ఎంపీ అవినాష్రెడ్డి తండ్రి.. వైఎస్ భాస్కరరెడ్డికి తాజాగా తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికలకు ముందు ఇది మరింత కీలక పరిణామమనే చెప్పాలి. ఆయన ఆరోగ్య కారణాలతో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మేరకు అనుమతి ఇస్తున్నట్టు తెలిపింది. ఇక, ఇదే కేసులో తమకు కూడా బెయిల్ కావాలని కోరుతూ.. ఉదయ్ కుమార్రెడ్డి, సునీల్ కుమార్ యాదవ్లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టి వేసింది.
వివేకా కేసులో ఆయనను హత్య చేసిన.. దస్తగిరి అప్రూవర్గా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బెయిల్పై ఉన్నాడు. ఈయనన పులివెందుల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ కూడా చేస్తున్నాడు. అయితే.. తనకు ప్రాణ హాని ఉందని.. తనను జైల్లో ఉన్నప్పుడు బెదిరించారని.. డబ్బులు ఎర చూపారని పేర్కొంటూ.. పిటిషన్ వేశారు. ఈ క్రమంలోనే అవినాష్ బెయిల్ను రద్దు చేయాలని కోరాడు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు.. తాజాగా ఇచ్చిన తీర్పులో ఈ పిటిషన్ను కొట్టి వేసింది.
2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లపై అప్పట్లో ఓ రేంజ్ లో…
ఎంత గొప్ప దర్శకులైనా ఏదో ఒక దశలో ఫామ్ కోల్పోవాల్సిందే. ట్రెండును అందుకోలేక వైఫల్యాలు చవిచూడాల్సిందే. తెలుగు సినీ చరిత్రలో…
ముక్కోణపు పోరు అంటే… క్రికెట్ టోర్నీ కాదు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ రగడ. ఓ వైపు బీజేపీ, మరోవైపు…
రిషికొండ ప్యాలెస్… ఏమాత్రం పరిచయం అక్కర్లేని కట్టడం. రిషికొండ ప్యాలెస్ పేరు వినిపిస్తే… ఆ మరుక్షణమే దానిని కట్టించిన వైసీపీ…
ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…