ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డికేసులో తాజాగా సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ-8గా ఉన్న కడప ఎంపీ.. వైసీపీ నాయకుడు అవినాష్రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ను హైదరాబాద్లోని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అంతేకాదు.. ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. ఇదేసమయంలో ఆయన సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్న వాదనను కూడా తోసిపుచ్చింది.
ఇక, ఇదే కేసులో మరో భారీ ఊరట కూడా లబించింది. ఇప్పటివరుకు జైల్లో ఉన్న ఎంపీ అవినాష్రెడ్డి తండ్రి.. వైఎస్ భాస్కరరెడ్డికి తాజాగా తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికలకు ముందు ఇది మరింత కీలక పరిణామమనే చెప్పాలి. ఆయన ఆరోగ్య కారణాలతో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మేరకు అనుమతి ఇస్తున్నట్టు తెలిపింది. ఇక, ఇదే కేసులో తమకు కూడా బెయిల్ కావాలని కోరుతూ.. ఉదయ్ కుమార్రెడ్డి, సునీల్ కుమార్ యాదవ్లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టి వేసింది.
వివేకా కేసులో ఆయనను హత్య చేసిన.. దస్తగిరి అప్రూవర్గా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బెయిల్పై ఉన్నాడు. ఈయనన పులివెందుల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ కూడా చేస్తున్నాడు. అయితే.. తనకు ప్రాణ హాని ఉందని.. తనను జైల్లో ఉన్నప్పుడు బెదిరించారని.. డబ్బులు ఎర చూపారని పేర్కొంటూ.. పిటిషన్ వేశారు. ఈ క్రమంలోనే అవినాష్ బెయిల్ను రద్దు చేయాలని కోరాడు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు.. తాజాగా ఇచ్చిన తీర్పులో ఈ పిటిషన్ను కొట్టి వేసింది.
This post was last modified on May 3, 2024 12:47 pm
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…