బండ్ల గణేష్ ఆలియాస్ బ్లేడ్ గణేష్. నిజమే ఈ కమేడియన్ పేరు వింటే మొదటగా గుర్తొచ్చేది 7 ఓ క్లాక్ బ్లేడ్ మాత్రమే. ఇన్నేండ్ల అతని నటన, నిర్మాత ఇచ్చిన గుర్తింపుకన్నా ఓ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే గొంతుకోసుకుంటాను అన్న సవాల్ బాగా గుర్తింపు ఇచ్చింది. ఆ తర్వాత ఆ సవాల్ ను ఆయన దాట వేయడం తర్వాతి విషయం.
ఆ తర్వాత బండ్ల గణేష్ అనేకమార్లు కేసీఆర్ పాలన మీద ప్రశంసలు కురిపించాడు. ఇక 2023 ఎన్నికల సమయంలో తిరిగి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచాడు. ప్రస్తుతం ఆయన పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి, వీ6 అధినేత, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు వంశీకృష్ణకు మద్దతుగా ప్రచారం చేస్తున్నాడు. ఈ సంధర్బంగా గణేష్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘’నేను కాంగ్రెస్ పార్టీలోనే పుట్టిన. కాంగ్రెస్ పార్టీలోనే చస్తా. తెలంగాణలో పద్నాలుగు లోక్ సభ స్థానాలు కాంగ్రెస్ గెలవాలి. నేను మంథనికి వచ్చిప్పుడు కొందరిని ఎవరికి ఓటు వేస్తావని అడిగితే. మేం హిందువులం.బీజేపీకి ఓటేస్తామని కొందరు చెప్పారు. వారికి అసలైన హిందుత్వ పార్టీ కాంగ్రెస్ అని వారికి చెప్పాను’’ అని బండ్ల గణేష్ అన్నాడు.
‘నాకు 50 ఏళ్లు. ఇప్పటికి 34 ఏళ్లు శబరిమలై వెళ్లి వచ్చాను. నువ్వు నాకంటే గొప్ప హిందువు కాదు. మీరు శ్రీరామ్ శ్రీరామ్ అంటున్నారు. కానీ నేను బతికేదే శ్రీరాముడిని నమ్ముకొని. మేం నమ్ముతున్నది ఆంజనేయుడిని. మేం ఉదయం నిద్రలేస్తే దేవుళ్లను తలుచుకుంటాం. ముస్లిం, క్రైస్తవులను గౌరవిస్తాం.. మా కంటే హిందువులు ఎవరూ లేరు’ అని వారికి సమాధానం ఇచ్చినట్లు గణేష్ వెళ్లడించాడు. తరచుగా మీడియా ఇంటర్వ్యూలతో వార్తల్లో ఉండే బండ్ల గణేష్ తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారానికి కూడా దిగాడు. గడ్డం వంశీకృష్ణ గెలుపు ఖాయం అని అంటున్నాడు. మరి గణేష్ కష్టం ఎంత వరకు ఫలిస్తుందో వేచిచూడాలి.
మహారాష్ట్రలో భారీ పాల కల్తీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో పోలీసులు, ఆహార భద్రత-ఔషధ పరిపాలన…
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వ్యవహారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి…
న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…
సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…
ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…