Political News

ఎన్నిక‌ల కోడ్ ఉంద‌ని ఆగుతున్నాం: బొత్స

ఏపీ అధికార పార్టీ వైసీపీ కీల‌క నాయ‌కుడు, మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల కోడ్ ఉంద‌ని స‌హిస్తున్నామ‌ని.. లేక‌పోతే.. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను బొక్క‌లో వేసేవార‌మ‌ని అన్నారు. అయితే.. అది బొత్స‌కు క‌లిగిన బాధ వ‌ల్ల అన్నారో.. లేక ఎన్నిక‌ల భ‌యం వ‌ల్ల అన్నారో తెలియ‌దు. మొత్తానికి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లైతే చేసేశారు. దీనిపై టీడీపీ నాయ‌కులు ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు. ఇది ఎటు దారితీస్తుందో బొత్స చిక్కుల్లో ప‌డ‌తారో లేదో చూడాలి.

ఏం జ‌రిగింది?

ప్ర‌స్తుతం ఏపీ ఎన్నిక‌ల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి రాజ‌కీయ మంట‌లు ర‌గులుతున్నాయి. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఈ యాక్టును తీసుకువ‌చ్చి.. ప్ర‌జ‌ల ఆస్తులు దోచుకుంటోంద‌ని.. ప్ర‌జ‌ల ఆస్తుల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని.. గ‌త నాలుగు రోజులుగా టీడీపీ, జ‌న‌సేన అధినేతలు చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు ప్ర‌చారంలో చెబుతున్నారు. దీనిని భారీ ఎత్తున ప్రొజెక్టు చేస్తున్నారు. అంతేకాదు.. ప‌వ‌న్ మ‌రో అడుగు ముందుకు వేసి “జ‌గ‌న్ దోచుకునే చ‌ట్టం“ ఇదే న‌ని చెబుతున్నారు ఇక‌, చంద్ర‌బాబు కూడా ఎక్క‌డ స‌భ పెట్టినా.. ఇదే చ‌ట్టంపై తీవ్ర విమ‌ర్శ‌లు  చేస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే.. ఈ చ‌ట్టాన్ని ర‌ద్దు చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

రాజ‌కీయంగా ఈ వ్య‌తిరేక ప్ర‌చారం తీవ్ర‌స్థాయిలో ఉండ‌డంతోపాటు.. ప్ర‌ధాన మీడియా కూడాదీనిపై పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తోంది. దీంతో ఇప్ప‌టికే సీఎం జ‌గ‌న్ బుధ‌వారం వివ‌ర‌ణ ఇచ్చారు. దీనిని ప్ర‌జ‌ల ర‌క్ష‌ణ కోసం తెచ్చామ‌న్నారు. వారి ఆస్తుల‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌న్న ఉద్దేశంతోనే 100 ఏళ్ల కింద‌టి రికార్డుల‌ను తాజా ప‌రుస్తున్నామ‌ని.. దీనిలో కుట్ర‌లేవ‌ని వివ‌రణ ఇచ్చారు. అయినా.. కూడా ప్ర‌తిప‌క్షాలు వినిపించుకోవ‌డం లేదు. ఇక‌, వైసీపీ కీల‌క నాయ‌కుడు, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కూడా.. దీనిపై వివ‌ర‌ణ ఇచ్చారు. ఇది కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన చ‌ట్ట‌మేన‌ని అన్నారు.

అయినా.. ప్ర‌తిప‌క్షాలు వినిపించుకోలేదు. దీంతో ఏమ‌నుకున్నారో.. ఏమో మంత్రి బొత్స మీడియా ముందుకు వ‌చ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని.. దీనిని ఖండిస్తున్నామ‌ని అన్నారు. ఎన్నిసార్లు చెప్పినా ప్ర‌తిప‌క్షాల‌కు బుద్ధి రావ‌డం లేద‌ని, ప్ర‌జ‌ల‌ను భ‌య భ్రాంతుల‌కు గురి చేస్తున్నార‌ని అన్నారు. ఎన్నిక‌ల కోడ్ ఉండి కాబ‌ట్టి వ‌దిలేశామ‌ని.. లేక‌పోతే.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై దుష్ప్ర‌చారం చేస్తున్న‌వారిని అరెస్టు చేసి బొక్క‌లో వేసేవార‌మ‌ని చెప్పారు. ఇంత దారుణ‌మైన అబ‌ద్ధాలు చెబుతూ.. ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. 

This post was last modified on May 3, 2024 8:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

2 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

4 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago