ఏపీ అధికార పార్టీ వైసీపీ కీలక నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోడ్ ఉందని సహిస్తున్నామని.. లేకపోతే.. ప్రతిపక్ష నేతలను బొక్కలో వేసేవారమని అన్నారు. అయితే.. అది బొత్సకు కలిగిన బాధ వల్ల అన్నారో.. లేక ఎన్నికల భయం వల్ల అన్నారో తెలియదు. మొత్తానికి వివాదాస్పద వ్యాఖ్యలైతే చేసేశారు. దీనిపై టీడీపీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు. ఇది ఎటు దారితీస్తుందో బొత్స చిక్కుల్లో పడతారో లేదో చూడాలి.
ఏం జరిగింది?
ప్రస్తుతం ఏపీ ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి రాజకీయ మంటలు రగులుతున్నాయి. జగన్ ప్రభుత్వం ఈ యాక్టును తీసుకువచ్చి.. ప్రజల ఆస్తులు దోచుకుంటోందని.. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని.. గత నాలుగు రోజులుగా టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ప్రచారంలో చెబుతున్నారు. దీనిని భారీ ఎత్తున ప్రొజెక్టు చేస్తున్నారు. అంతేకాదు.. పవన్ మరో అడుగు ముందుకు వేసి “జగన్ దోచుకునే చట్టం“ ఇదే నని చెబుతున్నారు ఇక, చంద్రబాబు కూడా ఎక్కడ సభ పెట్టినా.. ఇదే చట్టంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే.. ఈ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.
రాజకీయంగా ఈ వ్యతిరేక ప్రచారం తీవ్రస్థాయిలో ఉండడంతోపాటు.. ప్రధాన మీడియా కూడాదీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. దీంతో ఇప్పటికే సీఎం జగన్ బుధవారం వివరణ ఇచ్చారు. దీనిని ప్రజల రక్షణ కోసం తెచ్చామన్నారు. వారి ఆస్తులకు భద్రత కల్పించాలన్న ఉద్దేశంతోనే 100 ఏళ్ల కిందటి రికార్డులను తాజా పరుస్తున్నామని.. దీనిలో కుట్రలేవని వివరణ ఇచ్చారు. అయినా.. కూడా ప్రతిపక్షాలు వినిపించుకోవడం లేదు. ఇక, వైసీపీ కీలక నాయకుడు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా.. దీనిపై వివరణ ఇచ్చారు. ఇది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టమేనని అన్నారు.
అయినా.. ప్రతిపక్షాలు వినిపించుకోలేదు. దీంతో ఏమనుకున్నారో.. ఏమో మంత్రి బొత్స మీడియా ముందుకు వచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారని.. దీనిని ఖండిస్తున్నామని అన్నారు. ఎన్నిసార్లు చెప్పినా ప్రతిపక్షాలకు బుద్ధి రావడం లేదని, ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఎన్నికల కోడ్ ఉండి కాబట్టి వదిలేశామని.. లేకపోతే.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుష్ప్రచారం చేస్తున్నవారిని అరెస్టు చేసి బొక్కలో వేసేవారమని చెప్పారు. ఇంత దారుణమైన అబద్ధాలు చెబుతూ.. ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
This post was last modified on May 3, 2024 8:45 am
మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 40 ప్లస్ వయసులోనూ ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా, పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న…
తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన స్టార్ హీరో దళపతి విజయ్… ప్రతి అడుగులోనూ తనదైన శైలి ప్రత్యేకతను చాటుతున్నారు.…
కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.…
పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఎనిమిది నెలల వ్యవధిలో మూడు సినిమాలు రిలీజవడం ఆయన అభిమానులకు అరుదైన…
కొన్ని నెలలు వెనక్కి వెళ్తే.. ప్రభాస్ సినిమా రాజాసాబ్ గురించి ఆ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్లో కమెడియన్ సప్తగిరి…
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రమాణ స్వీకార…