Political News

ఎన్నిక‌ల కోడ్ ఉంద‌ని ఆగుతున్నాం: బొత్స

ఏపీ అధికార పార్టీ వైసీపీ కీల‌క నాయ‌కుడు, మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల కోడ్ ఉంద‌ని స‌హిస్తున్నామ‌ని.. లేక‌పోతే.. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను బొక్క‌లో వేసేవార‌మ‌ని అన్నారు. అయితే.. అది బొత్స‌కు క‌లిగిన బాధ వ‌ల్ల అన్నారో.. లేక ఎన్నిక‌ల భ‌యం వ‌ల్ల అన్నారో తెలియ‌దు. మొత్తానికి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లైతే చేసేశారు. దీనిపై టీడీపీ నాయ‌కులు ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు. ఇది ఎటు దారితీస్తుందో బొత్స చిక్కుల్లో ప‌డ‌తారో లేదో చూడాలి.

ఏం జ‌రిగింది?

ప్ర‌స్తుతం ఏపీ ఎన్నిక‌ల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి రాజ‌కీయ మంట‌లు ర‌గులుతున్నాయి. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఈ యాక్టును తీసుకువ‌చ్చి.. ప్ర‌జ‌ల ఆస్తులు దోచుకుంటోంద‌ని.. ప్ర‌జ‌ల ఆస్తుల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని.. గ‌త నాలుగు రోజులుగా టీడీపీ, జ‌న‌సేన అధినేతలు చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు ప్ర‌చారంలో చెబుతున్నారు. దీనిని భారీ ఎత్తున ప్రొజెక్టు చేస్తున్నారు. అంతేకాదు.. ప‌వ‌న్ మ‌రో అడుగు ముందుకు వేసి “జ‌గ‌న్ దోచుకునే చ‌ట్టం“ ఇదే న‌ని చెబుతున్నారు ఇక‌, చంద్ర‌బాబు కూడా ఎక్క‌డ స‌భ పెట్టినా.. ఇదే చ‌ట్టంపై తీవ్ర విమ‌ర్శ‌లు  చేస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే.. ఈ చ‌ట్టాన్ని ర‌ద్దు చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

రాజ‌కీయంగా ఈ వ్య‌తిరేక ప్ర‌చారం తీవ్ర‌స్థాయిలో ఉండ‌డంతోపాటు.. ప్ర‌ధాన మీడియా కూడాదీనిపై పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తోంది. దీంతో ఇప్ప‌టికే సీఎం జ‌గ‌న్ బుధ‌వారం వివ‌ర‌ణ ఇచ్చారు. దీనిని ప్ర‌జ‌ల ర‌క్ష‌ణ కోసం తెచ్చామ‌న్నారు. వారి ఆస్తుల‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల‌న్న ఉద్దేశంతోనే 100 ఏళ్ల కింద‌టి రికార్డుల‌ను తాజా ప‌రుస్తున్నామ‌ని.. దీనిలో కుట్ర‌లేవ‌ని వివ‌రణ ఇచ్చారు. అయినా.. కూడా ప్ర‌తిప‌క్షాలు వినిపించుకోవ‌డం లేదు. ఇక‌, వైసీపీ కీల‌క నాయ‌కుడు, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కూడా.. దీనిపై వివ‌ర‌ణ ఇచ్చారు. ఇది కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన చ‌ట్ట‌మేన‌ని అన్నారు.

అయినా.. ప్ర‌తిప‌క్షాలు వినిపించుకోలేదు. దీంతో ఏమ‌నుకున్నారో.. ఏమో మంత్రి బొత్స మీడియా ముందుకు వ‌చ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని.. దీనిని ఖండిస్తున్నామ‌ని అన్నారు. ఎన్నిసార్లు చెప్పినా ప్ర‌తిప‌క్షాల‌కు బుద్ధి రావ‌డం లేద‌ని, ప్ర‌జ‌ల‌ను భ‌య భ్రాంతుల‌కు గురి చేస్తున్నార‌ని అన్నారు. ఎన్నిక‌ల కోడ్ ఉండి కాబ‌ట్టి వ‌దిలేశామ‌ని.. లేక‌పోతే.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై దుష్ప్ర‌చారం చేస్తున్న‌వారిని అరెస్టు చేసి బొక్క‌లో వేసేవార‌మ‌ని చెప్పారు. ఇంత దారుణ‌మైన అబ‌ద్ధాలు చెబుతూ.. ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. 

This post was last modified on May 3, 2024 8:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మళ్లీ టాలీవుడ్‌కు రాధికా ఆప్టే

బాలీవుడ్లో విలక్షణ పాత్రలతో మంచి గుర్తింపు సంపాదించి.. దక్షిణాదిన కూడా కొన్ని సినిమాల్లో నటించింది రాధికా ఆప్టే.. ‘ధోని’, ‘కబాలి’ చిత్రాల్లో నటించిన…

2 minutes ago

కదిలిస్తున్న ‘మంచు’ వారి వీడియో

మంచు ఫ్యామిలీ గొడవ గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోన సంగతి తెలిసిందే. తండ్రీ కొడుకులు.. అన్నదమ్ములు…

53 minutes ago

రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా.. జ‌గ‌న్ భ‌ర‌తం ప‌డ‌తా!

"ఈ రోజు నుంచే.. ఈ క్ష‌ణం నుంచే నేను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా.. ఏ పార్టీలో చేరేదీ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తా. జ‌గ‌న్…

59 minutes ago

శ్రీవారికి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌తీమ‌ణి!

తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చిన ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌తీమ‌ణి, ఇటాలియ‌న్ అన్నాలెజెనోవో తిరుమ‌ల…

1 hour ago

సుందరకాండకు సమస్యలు ఎందుకొచ్చాయి

నారా రోహిత్ కొత్త సినిమా సుందర కాండ టీజర్ వచ్చి తొమ్మిది నెలలు దాటేసింది. అప్పుడెప్పుడో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు…

3 hours ago

స్టూడెంట్‌గా దాచుకున్న సొమ్ము నుంచి కోటి ఖ‌ర్చు చేశా: నారా లోకేష్‌

మంగ‌ళగిరి నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్‌గా ఉన్న‌ప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయ‌ల‌ను ఖర్చు చేసిన‌ట్టు మంత్రి…

5 hours ago