Political News

ముద్రగడ వ్యాఖ్యలతో వైసీపీ మునుగుతుందా ?

పచ్చగా సాగుతున్న వైసీపీ కాపురంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చిచ్చుపెడుతున్నాడా ? పార్టీకి ఆయన వ్యాఖ్యలు బలం చేకూర్చకపోగా చేటు చేస్తున్నాయా ? అసలు పిఠాపురంలో ముద్రగడ ప్రభావం ఎంత ఉంటుంది ? అంటే అంతంతమాత్రమే అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. నా మానాన నేను ప్రశాంతంగా ప్రచారం చేసుకుంటుంటే అనవసరంగా ముద్రగడ మూలంగా ఇబ్బందులు వస్తున్నాయని వైసీపీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

2019 ఎన్నికలలో గాజువాక, భీమవరం శాసనసభ స్థానాల నుండి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓటమి పాలయ్యాడు. ఈ ఎన్నికల్లో పవన్ పిఠాపురం నుండి పోటీ చేస్తున్నాడు. ఆయన తరపున ఆయన అన్న నాగబాబు, మెగా కుటుంబ సభ్యులు, పలువురు నటులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇక వీరందరికీ తోడుగా ఈ నెల 5 న స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ప్రచారం నిర్వహించబోతున్నాడు.

ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ ‘‘ఈ ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని, అలా కాని పక్షంలో తన పేరు మార్చుకుంటానని’’ సవాల్ విసిరాడు. ఈ వ్యాఖ్యలతో జనసేన వర్గాలు అప్రమత్తం అయ్యాయి. ఇప్పటికే ప్రచారంలో ముందున్న జనసేన ముద్రగడ వ్యాఖ్యలతో ఎట్టి పరిస్థితులలో గెలిచి తీరాలన్న కసిని పెంచిందని అంటున్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబును సైతం పక్కనపెట్టి వైసీపీ ఈ ఎన్నికలలో వంగా గీతను రంగంలోకి దింపింది. ఇరు వర్గాల ప్రచారం ఊపందుకుంటున్న నేపథ్యంలో ముద్రగడ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కాపు వర్గానికి చెందిన ముద్రగడ వైసీపీలో చేరడంతోనే తన ప్రాధాన్యతను కోల్పోయాడని, ఆయన వల్ల వైసీపీకి లాభం కలిగేది అనుమానమే అని అంటున్నారు.

Satya

Recent Posts

ఏడాది తర్వాత… అటు జగన్, ఇటు కేటీఆర్ !

మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…

28 minutes ago

డిజిటల్ పాఠం నేర్పిస్తున్న పెద్ది ఫలితం

థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…

57 minutes ago

పోక్సో కేసు నిందితుడికి బెయిలు రానివ్వకూడదు: రేవంత్ తో పవన్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘ‌ట‌న దారుణం`` అని…

1 hour ago

ప్రజాధనం అంటే పవన్ ఒప్పుకోరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…

1 hour ago

ముద్ర‌గ‌డ పాడె మోసిన జ‌గ‌న్‌

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అంత్య‌క్రియ‌లు ముగిశాయి. తూర్పుగోదావ‌రి జిల్లా కిర్లంపూడిలోని ఆయ‌న ఇంటి ప్రాంగ‌ణంలోనే…

2 hours ago

బాబు సర్కారును పొగిడిన కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…

2 hours ago