Political News

జగన్ పై షర్మిల మోస్ట్ డామేజింగ్ కామెంట్

క‌డ‌ప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌ను క‌డ‌ప ఎంపీగా గెలిపిస్తే.. కేంద్రంలో మంత్రి అవుతాన‌ని చెప్పారు. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు. ఎంత సేపూ.. వైసీపీ ప్ర‌భుత్వంపైనా సొంత అన్న‌పైనా ఆమె విమ‌ర్శ‌లు గుప్పించారు. కానీ.. తొలిసారి తాను కేంద్ర మంత్రి అవుతాన‌ని తేల్చి చెప్పారు. అంతేకాదు.. ఏపీ కోసం.. కేంద్ర మంత్రి అయిన త‌ర్వాత‌. . ప్ర‌త్యేక హోదా తెస్తాన‌ని కూడా చెప్పారు.

తాజాగా క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్‌(క‌డ‌ప పార్ల‌మెంటు ప‌రిధిలో ఉంది) అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ష‌ర్మిల ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆమె ఇంటింటికీ ప్ర‌చారం చేశారు. మ‌హిళ‌ల‌ను… రైతుల‌ను క‌లుసుకున్నారు. వారి స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. వైఎస్ ఆర్ బిడ్డ‌గా తాను బ‌రిలో ఉన్నాన‌ని.. త‌న‌ను గెలిపించాల‌ని  కోరారు. త‌న‌ను గెలిపిస్తే.. కేంద్రంలో మంత్రి అవుతాన‌ని.. అప్పుడు అంద‌రి జీవితాల‌ను బాగు చేస్తాన‌ని చెప్పారు.

ఇదేస‌మ‌యంలో త‌న సోద‌రుడు, సీఎం జ‌గ‌న్ పై మ‌రిన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్‌ను గెలిపిస్తే.. త‌న‌కు, త‌న చుట్టూ ఉన్న హంత‌క ముఠాకు.. బెయిల్ తెచ్చుకుంటాడ‌ని.. ఇంత‌కు మించి రాష్ట్రానికి ఏమీ చేయ‌డ‌ని ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను గెలిపించాల‌ని కోరారు. “ఇక్కడే ఉంటా.. ప్రజల సేవ చేస్తా.  కడప ఎంపీగా గెలిపిస్తే ..కేంద్రంలో మంత్రిని కూడా అవుతా. ప్రత్యేక హోదా సాధించుకొని వస్తా. అదే జ‌గ‌న్ గెలిస్తే. త‌న‌కు , వివేకానంద‌రెడ్డిగారిని దారుణంగా చంపిన వారికి బెయిల్ తెచ్చుకుంటాడు” అని వ్యాఖ్యానించారు.

వైఎస్ వార‌సుడు జ‌గ‌న్ కాద‌న్నారు.  ఆయన ఆశయాలను ఒక్కటి అమలు చేశాడా? అని ప్ర‌శ్నించారు. వైఎస్  కొడుకు అధికారంలో ఉండి రైతులను అప్పుల పాలు చేశాడని అన్నారు. వైఎస్ హయాంలో వ్యవసాయం పండుగ అయితే. ఆయ‌న కొడుకు హ‌యాంలో రాష్ట్రంలో అప్పు లేని రైతు ఎక్కడా లేడన్నా రు. పంట నష్టపరిహారం అని మోసం చేశాడని,  ధరల స్థిరీకరణ నిధి అని మోసం చేశాడని, నిరుద్యోగ బిడ్డలను దారుణంగా మోసం చేశాడని ష‌ర్మిల దుయ్య‌బ‌ట్టారు. 

This post was last modified on May 2, 2024 9:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

45 minutes ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

1 hour ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

4 hours ago

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

5 hours ago

పెద్ద ఒత్తిడిని ‘పెద్ది’ తట్టుకోగలదా

అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…

6 hours ago

అన్వేషణను అరెస్టు చేస్తారా?

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…

8 hours ago