Political News

జగన్ పై షర్మిల మోస్ట్ డామేజింగ్ కామెంట్

క‌డ‌ప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌ను క‌డ‌ప ఎంపీగా గెలిపిస్తే.. కేంద్రంలో మంత్రి అవుతాన‌ని చెప్పారు. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు. ఎంత సేపూ.. వైసీపీ ప్ర‌భుత్వంపైనా సొంత అన్న‌పైనా ఆమె విమ‌ర్శ‌లు గుప్పించారు. కానీ.. తొలిసారి తాను కేంద్ర మంత్రి అవుతాన‌ని తేల్చి చెప్పారు. అంతేకాదు.. ఏపీ కోసం.. కేంద్ర మంత్రి అయిన త‌ర్వాత‌. . ప్ర‌త్యేక హోదా తెస్తాన‌ని కూడా చెప్పారు.

తాజాగా క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్‌(క‌డ‌ప పార్ల‌మెంటు ప‌రిధిలో ఉంది) అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ష‌ర్మిల ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆమె ఇంటింటికీ ప్ర‌చారం చేశారు. మ‌హిళ‌ల‌ను… రైతుల‌ను క‌లుసుకున్నారు. వారి స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. వైఎస్ ఆర్ బిడ్డ‌గా తాను బ‌రిలో ఉన్నాన‌ని.. త‌న‌ను గెలిపించాల‌ని  కోరారు. త‌న‌ను గెలిపిస్తే.. కేంద్రంలో మంత్రి అవుతాన‌ని.. అప్పుడు అంద‌రి జీవితాల‌ను బాగు చేస్తాన‌ని చెప్పారు.

ఇదేస‌మ‌యంలో త‌న సోద‌రుడు, సీఎం జ‌గ‌న్ పై మ‌రిన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్‌ను గెలిపిస్తే.. త‌న‌కు, త‌న చుట్టూ ఉన్న హంత‌క ముఠాకు.. బెయిల్ తెచ్చుకుంటాడ‌ని.. ఇంత‌కు మించి రాష్ట్రానికి ఏమీ చేయ‌డ‌ని ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను గెలిపించాల‌ని కోరారు. “ఇక్కడే ఉంటా.. ప్రజల సేవ చేస్తా.  కడప ఎంపీగా గెలిపిస్తే ..కేంద్రంలో మంత్రిని కూడా అవుతా. ప్రత్యేక హోదా సాధించుకొని వస్తా. అదే జ‌గ‌న్ గెలిస్తే. త‌న‌కు , వివేకానంద‌రెడ్డిగారిని దారుణంగా చంపిన వారికి బెయిల్ తెచ్చుకుంటాడు” అని వ్యాఖ్యానించారు.

వైఎస్ వార‌సుడు జ‌గ‌న్ కాద‌న్నారు.  ఆయన ఆశయాలను ఒక్కటి అమలు చేశాడా? అని ప్ర‌శ్నించారు. వైఎస్  కొడుకు అధికారంలో ఉండి రైతులను అప్పుల పాలు చేశాడని అన్నారు. వైఎస్ హయాంలో వ్యవసాయం పండుగ అయితే. ఆయ‌న కొడుకు హ‌యాంలో రాష్ట్రంలో అప్పు లేని రైతు ఎక్కడా లేడన్నా రు. పంట నష్టపరిహారం అని మోసం చేశాడని,  ధరల స్థిరీకరణ నిధి అని మోసం చేశాడని, నిరుద్యోగ బిడ్డలను దారుణంగా మోసం చేశాడని ష‌ర్మిల దుయ్య‌బ‌ట్టారు. 

This post was last modified on May 2, 2024 9:46 am

Share

Recent Posts

మీరు టికెట్ ఇవ్వడానికి ఎవరు ఉండరు జగన్

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…

42 minutes ago

రోమాంచకం… సరిపోతుందా సమయం

టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…

2 hours ago

హనుమాన్ దర్శకుడి హవా మొదలైంది

‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…

2 hours ago

అజ్ఞాతవాసి… పుచ్చుకున్నదంతా ఇచ్చేసిన త్రివిక్రమ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…

3 hours ago

పంజాని మరో ఆరెంజ్ చేసేలా ఉన్నారు

ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…

3 hours ago

కియారాకు ఎలాంటి బ్రేక్ ఇస్తుందో

అందం అభినయం రెండూ ఉన్న కియారా అద్వానీతో అదృష్టం దోబూచులాడుతోంది. ఒకదశలో కరీనా కపూర్ ఎంజాయ్ చేసిన స్టార్ డం…

4 hours ago