కడప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తనను కడప ఎంపీగా గెలిపిస్తే.. కేంద్రంలో మంత్రి అవుతానని చెప్పారు. నిజానికి ఇప్పటి వరకు ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఎంత సేపూ.. వైసీపీ ప్రభుత్వంపైనా సొంత అన్నపైనా ఆమె విమర్శలు గుప్పించారు. కానీ.. తొలిసారి తాను కేంద్ర మంత్రి అవుతానని తేల్చి చెప్పారు. అంతేకాదు.. ఏపీ కోసం.. కేంద్ర మంత్రి అయిన తర్వాత. . ప్రత్యేక హోదా తెస్తానని కూడా చెప్పారు.
తాజాగా కడప జిల్లా బద్వేల్(కడప పార్లమెంటు పరిధిలో ఉంది) అసెంబ్లీ నియోజకవర్గంలో షర్మిల పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆమె ఇంటింటికీ ప్రచారం చేశారు. మహిళలను… రైతులను కలుసుకున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్ ఆర్ బిడ్డగా తాను బరిలో ఉన్నానని.. తనను గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే.. కేంద్రంలో మంత్రి అవుతానని.. అప్పుడు అందరి జీవితాలను బాగు చేస్తానని చెప్పారు.
ఇదేసమయంలో తన సోదరుడు, సీఎం జగన్ పై మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ను గెలిపిస్తే.. తనకు, తన చుట్టూ ఉన్న హంతక ముఠాకు.. బెయిల్ తెచ్చుకుంటాడని.. ఇంతకు మించి రాష్ట్రానికి ఏమీ చేయడని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను గెలిపించాలని కోరారు. “ఇక్కడే ఉంటా.. ప్రజల సేవ చేస్తా. కడప ఎంపీగా గెలిపిస్తే ..కేంద్రంలో మంత్రిని కూడా అవుతా. ప్రత్యేక హోదా సాధించుకొని వస్తా. అదే జగన్ గెలిస్తే. తనకు , వివేకానందరెడ్డిగారిని దారుణంగా చంపిన వారికి బెయిల్ తెచ్చుకుంటాడు” అని వ్యాఖ్యానించారు.
వైఎస్ వారసుడు జగన్ కాదన్నారు. ఆయన ఆశయాలను ఒక్కటి అమలు చేశాడా? అని ప్రశ్నించారు. వైఎస్ కొడుకు అధికారంలో ఉండి రైతులను అప్పుల పాలు చేశాడని అన్నారు. వైఎస్ హయాంలో వ్యవసాయం పండుగ అయితే. ఆయన కొడుకు హయాంలో రాష్ట్రంలో అప్పు లేని రైతు ఎక్కడా లేడన్నా రు. పంట నష్టపరిహారం అని మోసం చేశాడని, ధరల స్థిరీకరణ నిధి అని మోసం చేశాడని, నిరుద్యోగ బిడ్డలను దారుణంగా మోసం చేశాడని షర్మిల దుయ్యబట్టారు.
This post was last modified on May 2, 2024 9:46 am
ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…
సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…
ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…
దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…