Political News

జగన్ పై షర్మిల మోస్ట్ డామేజింగ్ కామెంట్

క‌డ‌ప ఎంపీగా పోటీలో ఉన్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల.. తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. త‌న‌ను క‌డ‌ప ఎంపీగా గెలిపిస్తే.. కేంద్రంలో మంత్రి అవుతాన‌ని చెప్పారు. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు. ఎంత సేపూ.. వైసీపీ ప్ర‌భుత్వంపైనా సొంత అన్న‌పైనా ఆమె విమ‌ర్శ‌లు గుప్పించారు. కానీ.. తొలిసారి తాను కేంద్ర మంత్రి అవుతాన‌ని తేల్చి చెప్పారు. అంతేకాదు.. ఏపీ కోసం.. కేంద్ర మంత్రి అయిన త‌ర్వాత‌. . ప్ర‌త్యేక హోదా తెస్తాన‌ని కూడా చెప్పారు.

తాజాగా క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్‌(క‌డ‌ప పార్ల‌మెంటు ప‌రిధిలో ఉంది) అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ష‌ర్మిల ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆమె ఇంటింటికీ ప్ర‌చారం చేశారు. మ‌హిళ‌ల‌ను… రైతుల‌ను క‌లుసుకున్నారు. వారి స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. వైఎస్ ఆర్ బిడ్డ‌గా తాను బ‌రిలో ఉన్నాన‌ని.. త‌న‌ను గెలిపించాల‌ని  కోరారు. త‌న‌ను గెలిపిస్తే.. కేంద్రంలో మంత్రి అవుతాన‌ని.. అప్పుడు అంద‌రి జీవితాల‌ను బాగు చేస్తాన‌ని చెప్పారు.

ఇదేస‌మ‌యంలో త‌న సోద‌రుడు, సీఎం జ‌గ‌న్ పై మ‌రిన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్‌ను గెలిపిస్తే.. త‌న‌కు, త‌న చుట్టూ ఉన్న హంత‌క ముఠాకు.. బెయిల్ తెచ్చుకుంటాడ‌ని.. ఇంత‌కు మించి రాష్ట్రానికి ఏమీ చేయ‌డ‌ని ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను గెలిపించాల‌ని కోరారు. “ఇక్కడే ఉంటా.. ప్రజల సేవ చేస్తా.  కడప ఎంపీగా గెలిపిస్తే ..కేంద్రంలో మంత్రిని కూడా అవుతా. ప్రత్యేక హోదా సాధించుకొని వస్తా. అదే జ‌గ‌న్ గెలిస్తే. త‌న‌కు , వివేకానంద‌రెడ్డిగారిని దారుణంగా చంపిన వారికి బెయిల్ తెచ్చుకుంటాడు” అని వ్యాఖ్యానించారు.

వైఎస్ వార‌సుడు జ‌గ‌న్ కాద‌న్నారు.  ఆయన ఆశయాలను ఒక్కటి అమలు చేశాడా? అని ప్ర‌శ్నించారు. వైఎస్  కొడుకు అధికారంలో ఉండి రైతులను అప్పుల పాలు చేశాడని అన్నారు. వైఎస్ హయాంలో వ్యవసాయం పండుగ అయితే. ఆయ‌న కొడుకు హ‌యాంలో రాష్ట్రంలో అప్పు లేని రైతు ఎక్కడా లేడన్నా రు. పంట నష్టపరిహారం అని మోసం చేశాడని,  ధరల స్థిరీకరణ నిధి అని మోసం చేశాడని, నిరుద్యోగ బిడ్డలను దారుణంగా మోసం చేశాడని ష‌ర్మిల దుయ్య‌బ‌ట్టారు. 

This post was last modified on May 2, 2024 9:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

26 minutes ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

1 hour ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

1 hour ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

3 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

4 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

5 hours ago