‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారానే నేను ఎమ్మెల్యేని అయ్యాను. ఆయన నా మీద ఎప్పటికీ అదే అభిమానం చూపిస్తారు..’ అంటూ వైసీపీ పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థి, కాకినాడ ఎంపీ వంగా గీత చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి మనోగతం ఏంటి.? అసలు చిరంజీవి అభిమానులు ఏమనుకుంటున్నారు.?
చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు వేర్వేరు కాదు.! కాకపోతే, చిరంజీవి అభిమానులనే ముసుగేసుకుని, కొందరు పవన్ కళ్యాణ్ మీద రాజకీయంగా, సినిమాల పరంగా విమర్శలు చేస్తుంటారు. ఇదో రాజకీయ యెత్తుగడ. వైసీపీ అమలు చేస్తున్న రాజకీయ యెత్తుగడ అనడం సబబేమో.
వంగా గీత విషయమై మెగాస్టార్ చిరంజీవికి, ప్రత్యేకమైన అభిమానం వుంటుందా.? అంటే, చిరంజీవి రాజకీయాల్లో లేరు. రాజకీయంగా చిరంజీవి ఎవరికైనా మద్దతివ్వాల్సి వస్తే, తమ్ముడు పవన్ కళ్యాణ్ కోణంలోనే వుంటుంది.
‘తమ్ముడికి నా నైతిక మద్దతు ఎప్పుడూ వుంటుంది. పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదగాలని అన్నగా నాకూ వుంటుంది కదా. నా పేరు చెప్పుకుని, రాజకీయాల్లో పాపులారిటీ పెంచుకోవాలని చాలామంది అనుకుంటారు. దాన్ని నేను పట్టించుకోను..’ అంటూ చిరంజీవి తాజాగా, తనకు అత్యంత సన్నహితులైన కొందరు వ్యక్తుల వద్ద వ్యాఖ్యానించారట.
ఇక, పిఠాపురంలో ఎన్నికల ప్రచారానికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి వుంది. తమ్ముడు పవన్ కళ్యాణ్ పిలిస్తే, వెళ్ళడానికి చిరంజీవి సిద్ధంగానే వున్నారు. అయితే, రాజకీయ విమర్శలకు చిరంజీవిని దూరంగా వుంచాలన్న కోణంలో, ప్రచారానికి పవన్ కళ్యాణే పిలవడంలేదట.
వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తదితరులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు కదా.? అంటే, వాళ్ళు వేరు.. చిరంజీవి వస్తే, ఆ లెక్క వేరు.! సరైన సమయంలో చిరంజీవిని రప్పించాల్సి వస్తే, రప్పించాలన్న ఆలోచన జనసేనలో వుంది. పవన్ కళ్యాణ్ ఆమోద ముద్ర వేయడమే ఆలస్యం.! వంగా గీత విషయానికొస్తే, పవన్ కళ్యాణ్ని గెలిపించండని చిరంజీవి పిలుపునిస్తే, దానర్థం వంగా గీతను ఓడించమనే కదా.?
This post was last modified on May 2, 2024 7:31 am
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం తాడిపత్రిలో ఎన్నికల అనంతరం తీవ్ర హింస చెలరేగింది. ఇక్కడ పోటీలో ఉన్న జేసీ…
రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత చెలరేగిన తీవ్ర హింస పై కేంద్ర ఎన్నికల సంఘం…
https://www.youtube.com/watch?v=BacOcD8e_3k బాక్సాఫీస్ డ్రైగా ఉన్న టైంలో సరైన సినిమా కోసం మూవీ లవర్సే కాదు ట్రేడ్ మొత్తం ఎదురు చూస్తోంది.…