Political News

మీ భూములు పోతాయ్.! ఏపీ ఓటర్లలో పెరిగిన భయం.!

మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్ జగన్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే చేసి, జగన్ ఫొటోలతో కూడిన డాక్యుమెంట్లను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే.
భూములకు సంబంధించి సరిహద్దు రాళ్ళ వ్యవహారమూ ఓ పెద్ద కుంభకోణమేనన్న విమర్శలున్నాయి. ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు’ పేరుతో సరిహద్దు రాళ్ళను పెద్దయెత్తున తయారు చేయించి, పాతేస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య వస్తోంది.

ఆ రాళ్ళకు అవుతున్న ఖర్చు ఎంత.? ఇంత ప్రజా ధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు.? ప్రభుత్వం మారితే, ఆ రాళ్ళను తీసేసి, వేరే రాళ్ళను పెడితే, దానికయ్యే ఖర్చు ఎంత.? ఇలా చాలా అంశాలున్నాయి. అన్నిటికీ మించి, భూములకు సంబంధించి ఒరిజినల్ పత్రాలు వాటి హక్కుదారులైన పౌరుల దగ్గర కాకుండా, ప్రభుత్వం దగ్గర వుంటాయనేదే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తాలూకు లిటిగేషన్.

ఈ వ్యవహారంపై చాలాకాలంగా న్యాయ నిపుణులూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, అప్పట్లో ఈ అంశంపై ప్రజల్లో పెద్దగా అవగాహన లేకుండా పోయింది. కానీ, ఇప్పుడు ఎన్నికల సమయంలో విపక్షాలు, వివిధ రకాల రూపాల్లో ప్రజల్ని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయమై అవగాహన కల్పిస్తున్నాయి.

దాంతో, ప్రజల్లో.. అందునా చిన్నా చితకా భూములున్న సాధారణ ప్రజానీకం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే భయపడుతున్నారు. ఇది అమల్లోకి వచ్చినట్లు ఇటీవల బయటకు వచ్చిన ఓ జీవో ద్వారా తేలడంతో, ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది.

అధికార పార్టీ మాత్రం, కేంద్ర ప్రభుత్వ సూచన మేరకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ని అమల్లోకి తెద్దామనుకున్నామనీ, అదింకా అమల్లోకి రాలేదనీ బుకాయించాల్సి వస్తోంది. కానీ, జరగాల్సిన డ్యామేజ్ అయితే దారుణంగా జరిగిపోయింది.

ఏ రచ్చ బండ వేదిక దగ్గర చూసినా, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించిన చర్చే జరుగుతోంది. భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటో ఎందుకు.? సరిహద్దు రాళ్ళపై జగన్ ఫొటో ఎందుకు.? ఆ హక్కు పత్రాలకు సంబంధించి జిరాక్సులు ప్రజలకిచ్చి, ఒరిజినల్స్ ప్రభుత్వం దగ్గర పెట్టుకోవడమేంటి.? అని జనం నిలదీస్తున్నారు.
ఎన్నికల్లో వైసీపీకి ఇదొక ఎదురు దెబ్బలా మారే అవకాశం వుంది.

This post was last modified on May 2, 2024 7:13 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

1 hour ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

1 hour ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

4 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

6 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

6 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

6 hours ago