తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్కు భారీ షాక్ తగిలింది. కీలకమైన పార్లమెంటు ఎన్నికల సమయం లో ఆయనను ప్రచారం నుంచి నిషేధం విధిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇచ్చిన ఆదేశాల మేరకు కేసీఆర్.. రెండు రోజుల పాటు ప్రచారానికి దూరంగా ఉండాల్సిందేనని ఈసీ పేర్కొంది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి తమ ఆదేశాలు అమల్లోకి వస్తాయని తెలిపింది. అప్పటి నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు ఎలాంటి ప్రచారానికి ఆయన వెళ్లకూడదని కూడా ఈసీ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
అంతేకాదు.. ఆన్లైన్, ఆఫ్లైన్ ఎన్నికల ప్రచారానికి కూడా దూరంగా ఉండాలని.. టెలీ కాన్ఫరెన్స్ సహా టీవీలు, సెల్పీ వీడియోలు.. ఇతరత్రా మాధ్యమాల్లో దేనినీ వినియోగించుకుని ప్రచారం చేయడానికి వీల్లేదని.. పేర్కొంది. అయితే.. పార్టీ ఆఫీసుకు మాత్రం వెళ్లవచ్చని తెలిపింది. కానీ, ఈ సందర్భంగా కూడా ప్రజలను ప్రభావితం చేసేలా ఎలాంటి ప్రకటనలు ఇవ్వడానికి వీల్లేదని ఈసీ తేల్చి చెప్పింది. తాము ఇచ్చిన ఆదేశాలు రెండు రోజుల వరకు అమల్లో ఉంటాయని తెలిపింది. ఈ ఆదేశాలను విస్మరించి.. ప్రచారం చేస్తే.. తదుపరి కఠిన నిర్ణయాలు ఉంటాయని ఈసీ స్పష్టం చేయడం గమనార్హం.
ఏం జరిగింది?
కేసీఆర్ బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా సిరిసిల్లలో గత వారం జరిగిన ప్రచారంలో కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ దుమ్మెత్తి పోశారు. ప్రజల రక్తం తాగుతున్నారని అన్నారు. అదేవిదంగా రేవంత్పై వ్యక్తిగత విమర్శలు చేశారు. వీటిపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో తాజాగా కేసీఆర్ ప్రచారంపై నిషేధం విధించారు.
This post was last modified on May 1, 2024 11:33 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…