తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్కు భారీ షాక్ తగిలింది. కీలకమైన పార్లమెంటు ఎన్నికల సమయం లో ఆయనను ప్రచారం నుంచి నిషేధం విధిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా ఇచ్చిన ఆదేశాల మేరకు కేసీఆర్.. రెండు రోజుల పాటు ప్రచారానికి దూరంగా ఉండాల్సిందేనని ఈసీ పేర్కొంది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి తమ ఆదేశాలు అమల్లోకి వస్తాయని తెలిపింది. అప్పటి నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు ఎలాంటి ప్రచారానికి ఆయన వెళ్లకూడదని కూడా ఈసీ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
అంతేకాదు.. ఆన్లైన్, ఆఫ్లైన్ ఎన్నికల ప్రచారానికి కూడా దూరంగా ఉండాలని.. టెలీ కాన్ఫరెన్స్ సహా టీవీలు, సెల్పీ వీడియోలు.. ఇతరత్రా మాధ్యమాల్లో దేనినీ వినియోగించుకుని ప్రచారం చేయడానికి వీల్లేదని.. పేర్కొంది. అయితే.. పార్టీ ఆఫీసుకు మాత్రం వెళ్లవచ్చని తెలిపింది. కానీ, ఈ సందర్భంగా కూడా ప్రజలను ప్రభావితం చేసేలా ఎలాంటి ప్రకటనలు ఇవ్వడానికి వీల్లేదని ఈసీ తేల్చి చెప్పింది. తాము ఇచ్చిన ఆదేశాలు రెండు రోజుల వరకు అమల్లో ఉంటాయని తెలిపింది. ఈ ఆదేశాలను విస్మరించి.. ప్రచారం చేస్తే.. తదుపరి కఠిన నిర్ణయాలు ఉంటాయని ఈసీ స్పష్టం చేయడం గమనార్హం.
ఏం జరిగింది?
కేసీఆర్ బీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా సిరిసిల్లలో గత వారం జరిగిన ప్రచారంలో కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ దుమ్మెత్తి పోశారు. ప్రజల రక్తం తాగుతున్నారని అన్నారు. అదేవిదంగా రేవంత్పై వ్యక్తిగత విమర్శలు చేశారు. వీటిపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో తాజాగా కేసీఆర్ ప్రచారంపై నిషేధం విధించారు.
This post was last modified on May 1, 2024 11:33 pm
స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఫ్యామిలీ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. మంత్రి కుమారుడు బండి భగీరథ్ ఓ…
బాక్సాఫీస్ వద్ద కరుప్పు / వీరభద్రుడు జోరు బాగానే ఉంది. ముఖ్యంగా తమిళనాడులో రికార్డులు రాసే దిశగా పరుగులు పెడుతోంది.…
హఠాత్తుగా పెద్ది సినారియో మారిపోయింది. ప్యాన్ ఇండియా స్థాయిలో పెద్ది గురించి రెండు మూడు రోజులు మాట్లాడుకుంటారనుకుంటే దానికి భిన్నంగా…
మంచు మనోజ్.. కొన్నేళ్ల ముందు భూమా మౌనికను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అది అతడికి రెండో పెళ్లి. మరోవైపు…
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మరో దారుణం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్ అవకాశం ఇస్తామని నమ్మించి ఇద్దరు అనాథ యువతులను సికింద్రాబాద్లోని గదికి…