ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరై.. ఐపీఎల్కు సిద్ధమవుతున్న సమయంలో ఉన్నట్లుండి యూఏఈ నుంచి ఇంటిముఖం పట్టాడు స్టార్ క్రికెటర్ సురేష్ రైనా. వ్యక్తిగత కారణాలతోనే స్వదేశానికి వచ్చేస్తున్నట్లు అతను ప్రకటించాడు. ఆ కారణాలేంటన్నది ఆరా తీస్తే అతడి మేనత్త ఆశాదేవి కుటుంబంలో నెలకొన్న విషాదం వల్లే అతను ఇంటిముఖం పట్టాడని తేలింది.దోపిడీ దొంగల దాడిలో ఆశాదేవి భర్త అశోక్ కుమార్, మరో వ్యక్తి మృతి చెందగా.. ఆశాదేవి విషమ స్థితికి చేరింది. ఈ విషాదానికి సంబంధించిన మిస్టరీ ఇప్పుడు వీడింది.
హత్యకు పాల్పడిన వారిలో ముగ్గురిని అరెస్టు చేశారు.ఈ పరిణామంపై స్పందించిన పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్సింగ్ కేసును పరిష్కరించినట్లు ప్రకటించారు. పంజాబ్ డీజీపీ దిన్కర్ గుప్తా మాట్లాడుతూ.. రైనా మేనత్త కుటుంబంలో జరిగిన దారుణానికి ఒడిగట్టింది దోపిడీ దొంగలే అని తేల్చారు. 11 మంది సభ్యులతో కూడిన అంతర్రాష్ట్ర ముఠా పంజాబ్, జమ్మూ కశ్మీర్, ఉత్తర ప్రదేశ్లో ఇలాంటి పలు ఘటనలకు పాల్పడినట్లు వెల్లడించారు. పంజాబ్లోని పఠాన్కోట్ రైల్వేస్టేషన్ ప్రాంతంలో సంచరిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి కొంత బంగారం, హత్యలకు వాడిన కర్రలు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మిగతావారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
ఆగస్టు 19న మూడు గ్రూపులుగా విడిపోయిన దొంగలు సురేష్ రైనా మేనత్త ఆశాదేవి ఇంట్లోకి ప్రవేశించేముందే వారి సమీపంలోని మరో రెండు ఇళ్లల్లో చోరీకియత్నించి విఫలమయ్యారు. అనంతరం నిచ్చెన సాయంతో ఆశాదేవి ఇంట్లోకి ప్రవేశించిన ఐదుగురు దొంగలు.. ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురి తలపై కర్రలతో దాడిచేసి దోపిడీకి పాల్పడ్డారు. చోరీ అనంతరం ఇంట్లోని మరో ఇద్దరిపై దాడిచేసి పారిపోయారు. ఈ దాడిలో రైనా మామ అశోక్కుమార్, బావమరిది కౌషల్ కుమార్ మృతిచెందగా.. రైనా అత్త పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. గాయపడ్డ మరో ఇద్దరు ఆసుపత్రిలో కోలుకున్నారు.
This post was last modified on September 16, 2020 9:53 pm
ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా మార్కెట్ ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. ఐతే భారీ చిత్రాల వీక్షణలో అద్భుతమైన అనుభూతిని…
బుల్లితెర నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ తన ప్రతి ప్రెస్ మీట్ లో ఏదో ఒక వైరల్ కంటెంట్ ఇవ్వడం…
జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబును ముద్రగడ పద్మనాభం పరామర్శించడం, జనసేన పార్టీలో ఉన్నా ఆయన కుమార్తె ఈ…
డైరెక్టర్ కమ్ హీరోగా సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ యూత్ ఫుల్ హీరోగా సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు ప్రదీప్ రంగనాథ్.…
తనపై ఓ మహిళ చేసిన లైంగిక ఆరోపణలపై జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తొలిసారి మీడియా ముందు స్పందించారు. అది…
కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమాగా ఆరెంజ్ మీద ఓ…