ఏపీ సీఎం జగన్కు మరో ఐదేళ్ల వరకు ఏమీ జరగదు. ఆయన ప్రశాంతంగా.. సాఫీగా తన పని తాను చేసుకు ని పోవచ్చు. అదేంటి? అనుకుంటున్నారా? ఇది రాజకీయాల గురించి కాదు.. ముఖ్యమంత్రి పదవి గురించి కూడా కాదు. దీని గురించి ప్రజలు చూసుకుంటారు. జూన్ 4న తీర్పు వెల్లడవుతుంది. అయితే.. దీనికి మించిన వ్యవహారంలో జగన్ సేఫ్తోపాటు.. సేవ్ కూడా అయ్యారు. దాదాపు ఐదేళ్ల పాటు.. ఆయన కుశలంగా ఉండనున్నారు. చీకు చింతా కూడా లేకుండా గడపనున్నారు.
విషయంలోకి వెళ్తే.. 2011-12 మధ్య కాలంలో ప్రస్తుతం సీఎం స్థానంలో జగన్పై అక్రమ ఆస్తుల కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులకు సంబంధించి ఆయన 16 నెలలు జైల్లో కూడా గడిపి వచ్చారు. అయితే.. ఈ కేసులు ఒకటి రెండు కావు. ఏకంగా 33 చార్జిషీట్లు దాఖలు చేసిన కేసులు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు.. ఆయన అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమంగా సంస్థలను ఏర్పాటు చేశారనేది అభియోగం.
అంటే.. `ఎక్స్` అనే వ్యక్తికి వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు.. రూ.1000 లబ్ధి చేకూర్చాడని అనుకుంటే.. ఈ ఎక్స్ అనే వ్యక్తి.. ఓ 100 రూపాయలు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాడు. ఇదీ.. ఇతమిత్థంగా సీబీఐ పేర్కొన్న కేసు. ఇలానే.. 33 చార్జిషీట్లు దాఖలయ్యాయి. హైదరాబాద్లోని సీబీఐ కోర్టులో విచారణ సాగింది. దాదాపు 12 ఏళ్లుగా.. ఈ కేసుల విచారణను కొనసాగించారు. ఇక, మంగళవారం(ఏప్రిల్ 30) తుది తీర్పు రావాల్సి ఉంది. ఎందుకంటే.. ఈడీ, సీబీఐ కూడా.. తమ వాదనలు పూర్తి చేశాయి. దీంతో ఎన్నికలకు ముందు.. ఏం జరుగుతుందని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు.
కానీ, ఇక్కడే అనూహ్యమైన ఘటన జరిగింది. ఈ కేసులను సుదీర్ఘంగా 12 ఏళ్ల నుంచి వింటున్న సీబీఐ కోర్టు జడ్జి రమేష్బాబు.. బదిలీ అయిపోయారు. ఆయనను వేరే కోర్టుకు బదిలీ చేస్తూ.. కొన్నాళ్ల కిందటే ఉత్తర్వులు ఇచ్చారు. అయితే.. ఇక్కడ ఒక కండిషన్ పెట్టారు. ఏప్రిల్ 30 నాటికి ఏదో ఒకటి తేల్చేయాలని జడ్జి రమేష్బాబుకు హైకోర్టు, సుప్రీంకోర్టులు గడువు పెట్టాయి. సో.. ఏప్రిల్ 30 అంటే మంగళవారం ఏదో ఒకటి తేలిపోతుందని అందరూ అనుకున్నారు.
కానీ, ఇక్కడే కీలక మలుపు తిరిగింది. జడ్జి రమేష్బాబు… ఎలాంటి తీర్పు ఇవ్వలేదు. కానీ, విచారణలు మాత్రం విన్నానని.. వాదనలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. అయితే.. తీర్పు రాసేందుకు తన ఆరోగ్యం సహకరించలేదని.. కాబట్టి తదుపరివ చ్చే న్యాయమూరి చూసుకుంటారని తేల్చి చెప్పారు. అయితే.. తదుపరి వచ్చే న్యాయమూర్తి వెంటనే తీర్పు ఇచ్చేస్తారని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. మళ్లీ ఆయన కూడా.. మొదటి నుంచి ఈ కేసును వినాలని.. అప్పటి వరకు తీర్పు చెప్పరు. అంటే.. సీఎం జగన్ అక్రమాస్తుల వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ఇది తేలడానికి.. అంటే.. ఇరు పక్షాల వాదనలు వినడానికి కనీసంలో కనీసం 5 ఏళ్ల సమయం పడుతుంది. అప్పటి వరకు జగన్ సేవు, సేఫు.. అన్నమాట. అయితే… ఈ విషయంలో ఎవరైనా సుప్రీంకోర్టుకు పోతే అపుడు అంతా మారిపోవచ్చు.
+ కొసమెరుపు ఏంటంటే.. ఇప్పటి వరకు వాదనలకు అయిన ఖర్చు మొత్తం.. అటు ప్రభుత్వం, ఇటు జగన్ పెట్టిన ఖర్చు కూడా వృధా.
This post was last modified on May 1, 2024 7:26 pm
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…