Political News

చంద్ర‌బాబు.. న‌న్ను చంపేస్తానంటున్నాడు: జ‌గ‌న్

ఏపీ సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అది కూడా 45 ఏళ్ల అనుభ‌వం ఉన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబుపైనే కావ‌డం గ‌మ‌నార్హం. ఏకంగా.. చంద్ర‌బాబు క్రిమిన‌ల్ మెంటాలిటీతో ఆలోచిస్తున్నార‌ని అన్నారు. ఆయ‌న‌ను నేర‌స్తుడిగా పేర్కొన్నారు. త‌న‌ను చంపేస్తాన‌ని చంద్ర‌బాబు చెబుతున్న‌ట్టు జ‌గ‌న్ ఆరోపించారు. అయితే.. త‌నను చంద్ర‌బాబు చంపేస్తానంటే.. ప్ర‌జ‌లు ఊరుకోర‌ని.. ప్ర‌జ‌లే త‌న‌ను ర‌క్షించుకుంటార‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ‘మేం సిద్ధం’ యాత్ర విజ‌య‌న‌గ‌రం జిల్లా బొబ్బిలి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగింది. ఈ యాత్ర‌లో పాల్గొన్న సీఎం జ‌గ‌న్‌.. స‌భ‌లో మాట్లాడుతూ.. “నా తండ్రి వైఎస్ గాల్లోనే కలిసిపోతాడని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అన్న మాటలను నేను మర్చిపోను. నాడు నా తండ్రిని.. నేడు నన్ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక బాబు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబా బు చేస్తున్న వ్యాఖ్యలు ఆయ‌న‌ నేరప్రవృత్తికి నిదర్శనం” అని అన్నారు.

అంతేకాదు.. “జగన్‌ను చంపేస్తే తప్పేంటి అని చంద్రబాబు అంటున్నాడంటే.. ఆయ‌న న‌న్ను చంపేసేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టే. అయితే.. చంద్రబాబు అనుకుంటే జగన్‌ చనిపోడు. జగన్‌ను ప్రజలే రక్షించుకుంటారు. చంద్రబాబు మానసిక పరిస్థితిపై అందరూ ఆలోచన చేయాలి” అని సీఎం జ‌గ‌న్ పిలుపునిచ్చారు. చంద్ర‌బాబు మెంటల్ హెల్త్ ఏ పరిస్థితిలో ఉందో ఆలోచన చేయాల‌న్నారు. వెన్ను పోట్లు పొడవడం, మనుషుల్ని చంపేయడమే చంద్రబాబు రాజకీయమ‌ని నిప్పులు చెరిగారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబును ఉద్దేశించి సీఎం జ‌గ‌న్ కొన్ని ప్ర‌శ్న‌లు సంధించారు. “ఎన్టీఆర్‌ను, వంగవీటి మోహనరంగాను కుట్రలతో చంపిందెవరు?  ఐఏఎస్ అధికారి రాఘవేంద్రరావును కుట్రలతో చంపిందెవరు?” అని నిల‌దీశారు. చంద్రబాబు లాంటి వ్యక్తులను ప్రజలు ఎవరైనా నమ్మగలరా? అని ప్ర‌శ్నించారు. మ‌రో 13 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుందన్న జ‌గ‌న్‌.. వైసీపీకి ఓటేస్తే పథకాలు కొనసాగుతాయ‌ని.. బాబుకు ఓటేస్తే పథకాలు ఆగిపోతాయ‌ని చెప్పారు. కాగా.. జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నేత‌లు.. మండిప‌డుతున్నారు. మ‌రోసారి ఈసీకి ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యాయి. 

This post was last modified on May 1, 2024 6:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

8 minutes ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

2 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

2 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

3 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

6 hours ago

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

7 hours ago