వైసీపీ అధినేత, సీఎం జగన్కు ఆయన సోదరి, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల లేఖ సంధించారు. దీని లో ఆమె .. “నవరత్నాలు సరే.. ఈ నవసందేహాలకు సమాధానం చెప్పు అన్నయ్యా” అని వ్యాఖ్యానించారు. నవరత్నాల పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమాన్నిఅందిస్తున్న విషయం తెలిసిందే. మరోసారి అధికారంలోకి వస్తే.. వాటిని కొనసాగిస్తామని చెబుతోంది. దీంతో ప్రజల్లో నవరత్నాల వ్యవహారం హాట్ టాపిక్గా మారింది.
అయితే.. దీనినే కార్నర్ చేస్తూ.. షర్మిల ఇప్పుడు.. నవసందేహాల పేరుతో బహిరంగ లేఖ రాశారు. వీటికి సమాధానం చెప్పాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. కీలకమైన ఎన్నికల సమయంలో ఇలా.. నవసందే హాలు తీసుకురావడం.. సమాధానం చెప్పాలని కోరడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో షర్మిల చాలా వ్యూహాత్మకంగా.. రాజకీయ అడుగులు వేస్తోందని అంటున్నారు పరిశీలకులు.
ఇవీ.. షర్మిల సంధించిన నవ సందేహాలు!
1) ఎస్సీ, ఎస్టీ రైతులకు వైఎస్ హయాంలో సాగు భూములు ఇచ్చారు. వాటిని ఎందుకు ఆపేశారు?
2) ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించడం నిజం కాదా?
3) గత ప్రభుత్వం అమలు చేసిన ఎస్సీ, ఎస్టీలకు 28 పథకాలను ఎందుకు నిలిపివేశారు?
4) అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకంలో అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు?
5) ఎస్సీ, ఎస్టీ లలో వెనుక బడిన వారికి.. పునరావాసాలను ఎందుకు ఆపేశారు?
6) వైసీపీలో ఎస్సీ, ఎస్టీ స్థానాల్లోని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు?
7) అంబేద్కర్ స్టడీ సర్కిళ్లకు డబ్బులు ఇవ్వడం ఎందుకు ఆపేశారు?
8) సొంత డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబును ఎందుకు వెనుకేసుకువస్తున్నారు?
9) రైతులకు సాగు భూములు పంచేకార్యక్రమాన్ని ఎందుకు ఆపేశారు?
కట్ చేస్తే.. వీటిని వైసీపీ ఎలా చూస్తుంది? ఎలాంటి సమాధానం చెబుతుంది? అనేది చూడాలి.
This post was last modified on May 1, 2024 3:12 pm
ఇటీవల జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్తో డీఎంకే పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే అయితే కేవలం ఐదు సీట్లు…
అదేంటో అనుష్క సినిమాలు నిర్మాణంలోనే కాదు విడుదలలోనూ తెగ ఆలస్యానికి గురవుతున్నాయి. మలయాళంలో తను నటించిన ప్యాన్ ఇండియా మూవీ…
బాక్సాఫీస్ కు ఇంకో ఫ్రైడే వచ్చింది. కానీ థియేటర్ల దగ్గర సందడి వాతావరణం కనిపించడం లేదు. కారణం స్టార్ క్యాస్టింగ్…
టాలీవుడ్ నిర్మాతలు త్వరలోనే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఒక విన్నపం చేయబోతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక తరహాలో ఏపీ తెలంగాణలో ఫ్లెక్సి…
తమిళనాడు రాజకీయాలు మూడు రోజులుగా రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీవీకే పార్టీకి ప్రజలు…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు, రచ్చకు దారి తీసిన పేరు రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. ఈయన తమిళనాడుకు ఇంచార్జ్ గవర్నర్గా…