Political News

న‌వ‌ర‌త్నాలు స‌రే.. న‌వ సందేహాలున్నాయ్..?

వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్‌కు ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల లేఖ సంధించారు. దీని లో ఆమె .. “న‌వ‌ర‌త్నాలు స‌రే.. ఈ న‌వ‌సందేహాల‌కు స‌మాధానం చెప్పు అన్న‌య్యా” అని వ్యాఖ్యానించారు. న‌వ‌ర‌త్నాల పేరుతో వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు సంక్షేమాన్నిఅందిస్తున్న విష‌యం తెలిసిందే. మ‌రోసారి అధికారంలోకి వ‌స్తే.. వాటిని కొన‌సాగిస్తామ‌ని చెబుతోంది. దీంతో ప్ర‌జ‌ల్లో న‌వ‌ర‌త్నాల వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా మారింది.

అయితే.. దీనినే కార్న‌ర్ చేస్తూ.. ష‌ర్మిల ఇప్పుడు.. న‌వ‌సందేహాల పేరుతో బ‌హిరంగ లేఖ రాశారు. వీటికి స‌మాధానం చెప్పాల‌ని కూడా ఆమె డిమాండ్ చేశారు. కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇలా.. న‌వ‌సందే హాలు తీసుకురావ‌డం.. స‌మాధానం చెప్పాల‌ని కోర‌డం రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది. దీంతో ష‌ర్మిల చాలా వ్యూహాత్మ‌కంగా.. రాజ‌కీయ అడుగులు వేస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇవీ.. ష‌ర్మిల సంధించిన న‌వ సందేహాలు!

1) ఎస్సీ, ఎస్టీ రైతుల‌కు వైఎస్ హ‌యాంలో సాగు భూములు ఇచ్చారు. వాటిని ఎందుకు ఆపేశారు?

2) ఎస్సీ, ఎస్టీ స‌బ్ ప్లాన్ నిధులు దారి మళ్లించడం నిజం కాదా?

3)  గ‌త ప్ర‌భుత్వం అమ‌లు చేసిన ఎస్సీ, ఎస్టీల‌కు 28 ప‌థ‌కాల‌ను ఎందుకు నిలిపివేశారు?

4)  అంబేద్క‌ర్ విదేశీ విద్యా దీవెన ప‌థ‌కంలో అంబేద్క‌ర్ పేరు ఎందుకు తీసేశారు?

5)  ఎస్సీ, ఎస్టీ ల‌లో వెనుక బ‌డిన వారికి.. పున‌రావాసాల‌ను ఎందుకు ఆపేశారు?

6)  వైసీపీలో ఎస్సీ, ఎస్టీ స్థానాల్లోని సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు ఎందుకు టికెట్ ఇవ్వ‌లేదు?

7) అంబేద్క‌ర్ స్ట‌డీ స‌ర్కిళ్ల‌కు డ‌బ్బులు ఇవ్వ‌డం ఎందుకు ఆపేశారు?

8) సొంత డ్రైవ‌ర్‌ను చంపి డోర్ డెలివ‌రీ చేసిన అనంత‌బాబును ఎందుకు వెనుకేసుకువ‌స్తున్నారు?

9)  రైతుల‌కు సాగు భూములు పంచేకార్య‌క్ర‌మాన్ని ఎందుకు ఆపేశారు?

క‌ట్ చేస్తే.. వీటిని వైసీపీ ఎలా చూస్తుంది?  ఎలాంటి స‌మాధానం చెబుతుంది? అనేది చూడాలి. 

This post was last modified on May 1, 2024 3:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

2 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

3 hours ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

3 hours ago

డిజిటల్ మోసాల బారిన పడినోళ్లకు పరిహారం, కానీ…

కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం…

5 hours ago

అసలే కిమ్… ఎన్నికల్లో ఓట్లు వేయకపోతే…

ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…

6 hours ago

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

6 hours ago