వైసీపీ అధినేత, సీఎం జగన్కు ఆయన సోదరి, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల లేఖ సంధించారు. దీని లో ఆమె .. “నవరత్నాలు సరే.. ఈ నవసందేహాలకు సమాధానం చెప్పు అన్నయ్యా” అని వ్యాఖ్యానించారు. నవరత్నాల పేరుతో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమాన్నిఅందిస్తున్న విషయం తెలిసిందే. మరోసారి అధికారంలోకి వస్తే.. వాటిని కొనసాగిస్తామని చెబుతోంది. దీంతో ప్రజల్లో నవరత్నాల వ్యవహారం హాట్ టాపిక్గా మారింది.
అయితే.. దీనినే కార్నర్ చేస్తూ.. షర్మిల ఇప్పుడు.. నవసందేహాల పేరుతో బహిరంగ లేఖ రాశారు. వీటికి సమాధానం చెప్పాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. కీలకమైన ఎన్నికల సమయంలో ఇలా.. నవసందే హాలు తీసుకురావడం.. సమాధానం చెప్పాలని కోరడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో షర్మిల చాలా వ్యూహాత్మకంగా.. రాజకీయ అడుగులు వేస్తోందని అంటున్నారు పరిశీలకులు.
ఇవీ.. షర్మిల సంధించిన నవ సందేహాలు!
1) ఎస్సీ, ఎస్టీ రైతులకు వైఎస్ హయాంలో సాగు భూములు ఇచ్చారు. వాటిని ఎందుకు ఆపేశారు?
2) ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించడం నిజం కాదా?
3) గత ప్రభుత్వం అమలు చేసిన ఎస్సీ, ఎస్టీలకు 28 పథకాలను ఎందుకు నిలిపివేశారు?
4) అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకంలో అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు?
5) ఎస్సీ, ఎస్టీ లలో వెనుక బడిన వారికి.. పునరావాసాలను ఎందుకు ఆపేశారు?
6) వైసీపీలో ఎస్సీ, ఎస్టీ స్థానాల్లోని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు?
7) అంబేద్కర్ స్టడీ సర్కిళ్లకు డబ్బులు ఇవ్వడం ఎందుకు ఆపేశారు?
8) సొంత డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబును ఎందుకు వెనుకేసుకువస్తున్నారు?
9) రైతులకు సాగు భూములు పంచేకార్యక్రమాన్ని ఎందుకు ఆపేశారు?
కట్ చేస్తే.. వీటిని వైసీపీ ఎలా చూస్తుంది? ఎలాంటి సమాధానం చెబుతుంది? అనేది చూడాలి.
This post was last modified on May 1, 2024 3:12 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…