కరోనాతో తిరుపతి పార్లమెంట్ సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బల్లి దుర్గాప్రసాద్ ఇటీవలే కరోనా బారిన పడ్డారు. ఈరోజు సాయంత్రం 6 గంటల సమయంలో చెన్నై అపోలోలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.
నెల్లూరికి చెందిన బల్లి దుర్గాప్రసాద్… 2019 ఎన్నికల్లో తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి పోటీ చేసి ఎన్నికయ్యారు. గతంలో ఆయన నాలుగు సార్లు నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే గా గెలిచిన రికార్డు ఉంది. సీనియర్ నాయకుడు అయిన బల్లి దుర్గాప్రసాద్ గతంలో తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేశారు.
1985లో రాజకీయ ప్రవేశం చేసిన దుర్గాప్రసాద్ పిన్న వయసులో 28 సంవత్సరాలకే శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరడంతో జగన్ తిరుపతి లోక్ సభకు నిలబెట్టారు. స్థానికేతరుడు అయినా కూడా 2 లక్ష్లలకు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించారు దుర్గాప్రసాద్. ఎంపీగా ఎన్నికైనా 15 నెలల్లో ఆయన కాలం చేశారు. దుర్గాప్రసాద్ మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్ దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. ఈ వార్త చిత్తూరు రాజకీయాలకే కాదు, ఏపీ లోనే షాకింగ్.
ఏపీలో పదవిలో ఉండి కోవిడ్ తో మృతి చెందిన తొలి నాయకుడు దుర్గాప్రసాద్. కోవిడ్ మరణం కావడంతో ప్రభుత్వం ఈయన అంత్యక్రియలను ఎలా ఏర్పాటుచేయనుందన్నది ఇపుడు ఇక కీలక ప్రశ్నగా మారింది.
This post was last modified on September 16, 2020 7:07 pm
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. వృద్ధులు, ఒంటరి…
నందమూరి బాలకృష్ణ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీ.. అఖండ-2. అఖండ సినిమా ఓటీటీలో రిలీజై నార్త్ ఇండియాలోనూ మంచి…
సాధారణంగా సినిమాల ఫలితాల విషయంలో హీరోయిన్ల వాటా తక్కువ అన్నది వాస్తవం. మన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం తక్కువగానే ఉంటుంది. ఎక్కువగా వాళ్లు గ్లామర్…
పెద్ద సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఆలస్యం కావడం ఇటీవల పెద్ద సమస్యగా మారుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు…