Political News

గుంటూరు, క్రిష్ణాలో టీడీపీకి అమరావతి వరం!

వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుద‌లైన త‌ర్వాత‌.. కూట‌మి పార్టీల అభ్య‌ర్థుల‌ ప్ర‌చారంలో భారీ మార్పు చోటు చేసుకుంది. ముఖ్యంగా ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో పోటీ చేస్తున్న అభ్య‌ర్థులు.. వైసీపీ మేనిఫెస్టోను ప‌ట్టుకుని తిరుగుతున్నారు. అంటే.. ఒక‌ర‌కంగా వైసీపీ మేనిఫెస్టోపై టీడీపీ నేత‌లే ప్ర‌చారం చేస్తున్నారు. అయితే.. ఇది పాజిటివ్‌గా కాదు.. యాంటీగా మాత్ర‌మే. “బాబును గెలిపించ‌క‌పోతే.. అమ‌రావ‌తిని మ‌రిచిపో వ‌డ‌మే” అని తాడికొండ‌(అమ‌రావ‌తి ప్రాంతంలో కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం) నాయ‌కులు చెబుతున్నారు.

ఇంటింటికీ వెళ్లి.. వైసీపీ మేనిఫెస్టో జిరాక్స్ కాపీల‌ను టీడీపీ నాయ‌కులు పంచుతున్నారు. “చూడండి. మీకు అమ‌రావ‌తి కావాలంటే.. టీడీపీకి అండ‌గా ఉండాలి” అని ప్ర‌చారం చేస్తున్నారు. వైసీపీ అధినేత జ‌గ‌న్ ప్ర‌క‌టించిన 2024 మేనిఫెస్టోలో రాజ‌దాని నిర్మాణం గురించి ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు. పైగా.. తాను విశాఖ నుంచే పాల‌న ప్రారంభిస్తాన‌ని చెప్పారు. దీనిని ఆయ‌న గొప్ప‌గా చెప్పుకొని ఉండొచ్చు. కానీ, ఇదే టీడీపీకి, కూట‌మి పార్టీల‌కు కూడా అస్త్రంగా మారింది.

గుంటూరు ఎంపీ నుంచి ఎమ్మెల్యే అభ్య‌ర్థుల  వ‌ర‌కు కూడా వైసీపీ మేనిఫెస్టోలోని లోపాల‌ను వివ‌రిస్తున్నా రు. ముఖ్యంగా చంద్ర‌బాబు క‌నుక రాక‌పోతే.. ఇక‌, అమ‌రావ‌తి ఉండ‌ద‌ని.. రాజ‌ధానిలేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోతుంద‌ని కూడా చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాల‌ని కోరుతున్నారు. అయితే.. అనేక ప‌థ‌కాల విష‌యంలోనూ వైసీపీ దోబూచులాడింది.

వాటిని ప‌క్క‌న పెట్టినా.. అమ‌రావ‌తి విష‌యాన్ని మాత్రం టీడీపీ నేత‌లు విస్తృతంగా ప్ర‌చారంలోకి తీసుకు వ‌స్తున్నారు. మ‌రి ప్ర‌జ‌లు ఎటువైపు మొగ్గు చూపుతారో చూడాలి. ఇప్ప‌టికే ప‌దేళ్లుగా రాజ‌ధాని లేదు. ఉన్న ఉమ్మ‌డి రాజ‌ధాని కూడా.. గ‌డువు తీరిపోయింది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు చెప్పుకొనేందుకు, చూసుకునేం దుకు కూడా అమ‌రావ‌తి లేదు. రైతులు చేసిన త్యాగాలు కూడా వృథా అవుతున్నాయి. ఇక‌, ఇప్పుడు వైసీపీ తేల్చి చెప్పేసింది. తాము వ‌స్తే.. విశాఖ నుంచే పాల‌న ఉంటుంద‌ని పేర్కొంది. ఈ నేప‌థ్యంలో జ‌నాలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. 

This post was last modified on April 28, 2024 7:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

1 hour ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

3 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

4 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

6 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

9 hours ago