Political News

ఏసిబి జోరుకు హైకోర్టు బ్రేక్.. తాత్కాలికమా ? శాశ్వతమా ?

అమరావతి రాజధాని ప్రాంతంలో జరిగిందని ప్రభుత్వం ఆరోపిస్తున్న ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఎటువంటి విచారణ జరపకుండా హైకోర్టు బ్రేకులు వేసింది. టిడిపి హయాంలో అడ్వకేట్ జనరల్ గా పనిచేసి దమ్మాలపాటి శ్రీనివాస్ పైన ఏసిబి కేసు నమోదు చేసింది. అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన దమ్మాలపాటి తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రభుత్వం ద్వారా అనుచితమైన లబ్దిపొందారన్నది ఏసిబి అభియోగం.

ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన దమ్మాలపాటి సుమారు 45 ఎకరాలను సొంతం చేసుకున్నట్లు ఆరోపణలతో కూడిన కేసు ఇది. అయితే ఏసిబి చర్యను ముందే ఊహించిన దమ్మాలపాటి హైకోర్టులో ఓ పిటీషన్ వేశారు. తనపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించే అవకాశాలున్నాయంటూ పిటిషన్లో ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి దర్యాప్తుసంస్ధల తనపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా రక్షణ కావాలంటూ తన పిటీషన్లో వాదించారు.

దమ్మాలపాటి దాఖలు చేసిన పిటీషన్ పై కోర్టు మంగళవారం రాత్రి విచారించిన తర్వాత ఏసిబి దర్యాప్తును నిలిపేయాలంటూ ఆదేశాలు జారిచేసింది. ఏసిబి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో దమ్మాలపాటి + ఆయన కుటుంబసభ్యులతో పాటు సుప్రింకోర్టులో జడ్జిగా పనిచేస్తున్న కీలకమైన వ్యక్తి ఇద్దరు కూతుళ్ళు, మరికొందరి పేర్లు కూడా ఉన్నాయి.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే దమ్మాలపాటి తన విషయంలో మాత్రమే దర్యాప్తుసంస్ధల విచారణను అడ్డుకోవాలని కోరారు. కానీ కోర్టు మాత్రం ఎఫ్ఐఆర్ లో పేర్లున్న అందరిపైనా విచారణను నిలిపేసింది. హైకోర్టు తాజా ఆదేశాల కారణంగా ఇన్ సైడర్ ట్రేడింగ్ దర్యాప్తుకు తాత్కాలిక బ్రేక్ పడినట్లే అనుకోవాలి. మరి దీనిపై ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.

This post was last modified on September 19, 2020 6:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

36 minutes ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

50 minutes ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

3 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

5 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

6 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

6 hours ago