Political News

ఒక మాజీ సీఎం తరఫున మరో మాజీ సీఎం ప్రచారం

ప్ర‌స్తుతం ఏపీలో జ‌రుగుతున్న అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో అనేక చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌ని నాయ‌కులు చేతులు క‌లుపుతున్నారు. ఒక‌రంటే.. ఒక‌రు నిప్పులు చెరిగే నేత‌లు.. కౌగిలించుకుని.. ఎన్నిక‌ల పోరులో ప్ర‌త్యేక‌త చాటుతున్నారు. ఇలాంటి వారిలో ఇప్పుడు.. మాజీ ముఖ్య‌మంత్రులు.. నారా చంద్ర‌బాబు.. న‌ల్లారి కిర‌ణ్‌లు మ‌రింత ప్ర‌త్యేకంగా క‌నిపిస్తున్నారు. ఇద్ద‌రూ కూడా ఒకే జిల్లా చిత్తూరుకు చెందిన వారు. జిల్లా ఒకటే అయినా.. పార్టీలు వేరు.. ప్రాంతం ఒకటే అయినా.. సిద్ధాంతాలు వేరు. రాద్ధాంతాలు కూడా వేరు. పైగా.. 40 ఏళ్ల రాజ‌కీయ శ‌త్రుత్వం!!

ఒక‌రి ఇంటిపై కాకి ఒక‌రి ఇంటిపై వాల‌నంత రాజ‌కీయం. అయితేనేం.. ఇప్పుడు బీజేపీతో టీడీపీ చేతులు క‌లిపిన నేప‌థ్యంలో ఆ శ‌త్రుత్వాన్ని.. రాజ‌కీయ రాద్ధాంతాల‌ను పక్క‌న పెట్టారు. చేతులు క‌లిపారు. క‌ల‌సి వేదిక‌లు.. వాహ‌నాలు కూడా పంచుకున్నారు. ప‌క్క ప‌క్క‌న నిల‌బ‌డి మీటింగుల్లో ప్ర‌సంగాలు దంచి కొట్టారు. దీంతో ఈ దృశ్య అంద‌రికీ ఆస‌క్తిగా మారింది. రాజ‌కీయాల్లో మార్పు ఇలా కూడా ఉంటుందా? అని ఆశ్చ‌ర్య ప‌డేలా చేసింది. నారా వారి కుటుంబం.. న‌ల్లారి కుటుంబం ఆదిలో కాంగ్రెస్‌లోనే ఉండేవి. న‌ల్లారి కిర‌ణ్‌కుమార్ రెడ్డి తండ్రి తొలినాళ్ల‌లో కాంగ్రెస్‌లో ఉండేవారు.

ఆయ‌న వార‌స‌త్వంగానే కిర‌ణ్‌కుమార్ రెడ్డి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. అప్ప‌ట్లో కిర‌ణ్ తండ్రి.. నారా చంద్ర‌బాబుకు రాజ‌కీయ గురువు కావ‌డం విశేషం. ఇలా.. సాగిన ప్ర‌స్తానం.. త‌ర్వాత చంద్ర‌బాబు టీడీపీ తీర్థం పుచ్చుకోవ‌డంతో.. మారిపోయింది. అసెంబ్లీ నుంచి ప్ర‌జాక్షేత్రం .. పార్టీల వ‌ర‌కు కూడా.. నిప్పులు చెరిగే నాయ‌కులుగా మారిపోయారు. ఎదురెదురు ప‌డింది లేదు. ప‌డినా ప‌ల‌క‌రించుకున్న‌దీ లేదు. ఇక, ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్‌గా(వైఎస్ హ‌యాం) చేసిన న‌ల్లారిపై స‌భ‌లోనే చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. ప‌క్ష‌పాతం చూపుతున్నార‌ని.. మైకు ఇవ్వ‌కుండా అడ్డుకుంటున్నార‌ని.. ఆయ‌న వ్యాఖ్యానిస్తే.. మీరే హ‌ద్దులు మీరుతున్నార‌ని నల్లారి ఎదురు దాడి చేసిన సంగ‌తి ఇప్ప‌టికీ తెలిసిందే.

ఇక‌, న‌ల్లారి ముఖ్య‌మంత్రిగా చేసిన(వైఎస్ మ‌ర‌ణాంత‌రం) స‌మ‌యంలోనూ బాబు వ‌ర్సెస్ న‌ల్లారిల మ‌ధ్య అసెంబ్లీ వేదిక‌గా అనేక సంద‌ర్భాల్లో నిప్పులు కురిశాయి. బాబు విధానాల‌ను న‌ల్లారి తీవ్ర‌స్థాయిలో ఎండ‌గ‌ట్టేవారు. ఇక‌, న‌ల్లారి పాల‌న‌ను బాబు దుయ్య‌బ‌ట్టేవారు.. ఇక‌, రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. న‌ల్లారి తెలంగాణ‌కు ప‌రిమితం కాగా.. ఏపీలో చంద్ర‌బాబు సీఎం అయ్యారు. ఇక‌, ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్న ద‌రిమిలా.. న‌ల్లారి.. రాజంపేట ఎంపీగా పోటీ చేస్తున్నారు. తాజాగా చంద్ర‌బాబు ఇక్క‌డ కూట‌మి ప‌క్షాన‌.. న‌ల్లారిని ప‌క్క‌న పెట్టుకుని మ‌రీ ప్ర‌చారం చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on April 26, 2024 11:05 am

Share

Recent Posts

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

4 minutes ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

21 minutes ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

1 hour ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

2 hours ago

ఇండియన్ స్టార్ హీరోల సరసన టామ్ హాలండ్

అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…

2 hours ago

బెంగ‌ళూరులో స్ట్రాట‌జిస్టుల‌తో జ‌గ‌న్ భేటీ?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌లువురు కీల‌క రాజకీయ వ్యూహ‌క‌ర్త‌ల‌తో భేటీ అయ్యారా?  వ‌చ్చే ఎన్నిక‌లు.. దీనికి ముందు ఆయ‌న చేయ‌నున్న…

3 hours ago