ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండగా. వైఎస్ కుటుంబంలో తీవ్ర స్థాయిలో పరస్పరం మాటల దాడి జరుగుతోంది. వైఎస్ జగన్, అవినాష్ రెడ్డి ఓ వైపు ఉంటే… మరోవైపు షర్మిళ, సునీత నిలిచారు. వైఎస్ వివేకా హత్య విషయంలో ఒకరి మీద ఒకరు తీవ్రంగా విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు.
పులివెందులలో జరిగిన సభలో షర్మిళ, సునీతల మీద జగన్ ఎలా విరుచుకుపడ్డాడో తెలిసిందే. ఆ వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన సునీత.. జగన్కు ఇచ్చిన ఓ సలహా అందరి దృష్టినీ ఆకర్షించింది. వారం కిందట జరిగిన రాయి దాడి నేపథ్యంలో జగన్ నుదుటికి బ్యాండేజీతో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. చిన్న గాయానికి రోజుల తరబడి బ్యాండేజ్ వేసుకుని కనిపించడం మీద సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ మోత మోగుతోంది.
ఈ నేపథ్యంలో సునీత కూడా ఆ బ్యాండేజీ గురించి స్పందించింది. జగన్కు గాయం కావడం దుదరృష్టకరమని అంటూ.. ఆయనకు వైద్య పరంగా ఎవరో తప్పుడు సలహాలిస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. ఇలాంటి గాయాలు అయినపుడు ఎక్కువ రోజుల పాటు బ్యాండేజీలు వేయడం, కట్లు కట్టడం మంచిది కాదని ఆమె అన్నారు. దాని వల్ల సెప్టిక్ అయి గాయం ఇంకా పెద్దది అవుతుందని.. గాయాన్ని మామూలుగా వదిలేస్తే గాలికి ఆరి త్వరగా మానుతుందని ఆమె చెప్పారు. ఒక డాక్టర్గా ఇది తాను చెబుతున్నానని.. జగన్ ఇకనైనా బ్యాండేజ్ తీసేస్తే మంచిదని ఆమె అన్నారు. పరోక్షంగా జగన్కు సునీత గట్టి పంచే వేసినట్లు కనిపిస్తోంది. గాయానికి బ్యాండేజీ వేసి సింపతీ రాబట్టాలని జగన్ ప్రయత్నిస్తున్నారని.. ఎన్నికలు అయ్యే వరకు ఆయన ఈ బ్యాండేజ్ తీయకపోవచ్చని సోషల్ మీడియాలో ఆయనపై పంచ్ల వర్షం కురుస్తోంది.
This post was last modified on April 26, 2024 11:00 am
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…