ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండగా. వైఎస్ కుటుంబంలో తీవ్ర స్థాయిలో పరస్పరం మాటల దాడి జరుగుతోంది. వైఎస్ జగన్, అవినాష్ రెడ్డి ఓ వైపు ఉంటే… మరోవైపు షర్మిళ, సునీత నిలిచారు. వైఎస్ వివేకా హత్య విషయంలో ఒకరి మీద ఒకరు తీవ్రంగా విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు.
పులివెందులలో జరిగిన సభలో షర్మిళ, సునీతల మీద జగన్ ఎలా విరుచుకుపడ్డాడో తెలిసిందే. ఆ వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన సునీత.. జగన్కు ఇచ్చిన ఓ సలహా అందరి దృష్టినీ ఆకర్షించింది. వారం కిందట జరిగిన రాయి దాడి నేపథ్యంలో జగన్ నుదుటికి బ్యాండేజీతో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. చిన్న గాయానికి రోజుల తరబడి బ్యాండేజ్ వేసుకుని కనిపించడం మీద సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ మోత మోగుతోంది.
ఈ నేపథ్యంలో సునీత కూడా ఆ బ్యాండేజీ గురించి స్పందించింది. జగన్కు గాయం కావడం దుదరృష్టకరమని అంటూ.. ఆయనకు వైద్య పరంగా ఎవరో తప్పుడు సలహాలిస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. ఇలాంటి గాయాలు అయినపుడు ఎక్కువ రోజుల పాటు బ్యాండేజీలు వేయడం, కట్లు కట్టడం మంచిది కాదని ఆమె అన్నారు. దాని వల్ల సెప్టిక్ అయి గాయం ఇంకా పెద్దది అవుతుందని.. గాయాన్ని మామూలుగా వదిలేస్తే గాలికి ఆరి త్వరగా మానుతుందని ఆమె చెప్పారు. ఒక డాక్టర్గా ఇది తాను చెబుతున్నానని.. జగన్ ఇకనైనా బ్యాండేజ్ తీసేస్తే మంచిదని ఆమె అన్నారు. పరోక్షంగా జగన్కు సునీత గట్టి పంచే వేసినట్లు కనిపిస్తోంది. గాయానికి బ్యాండేజీ వేసి సింపతీ రాబట్టాలని జగన్ ప్రయత్నిస్తున్నారని.. ఎన్నికలు అయ్యే వరకు ఆయన ఈ బ్యాండేజ్ తీయకపోవచ్చని సోషల్ మీడియాలో ఆయనపై పంచ్ల వర్షం కురుస్తోంది.
This post was last modified on April 26, 2024 11:00 am
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…