వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయమై ఇప్పటికే ఆయన తనయురాలు సునీత, ఆయన అన్న కూతురు షర్మిళ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డిల మీద ఎలా తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడుతున్నారో తెలిసిందే. దీనికి జగన్, అవినాష్ కూడా గట్టిగానే బదులిస్తున్నారు. కానీ వివేకా హత్య అంశం రోజు రోజుకూ బలమైన రాజకీయ అంశంగా మారుతున్న నేపథ్యంలో వివేకా సతీమణి సౌభాగ్యమ్మ ఇప్పుడు లైన్లోకి వచ్చారు.
వివేకా హత్య విషయమై ఏపీ సీఎం జగన్కు ఆమె బహిరంగ లేఖ రాశారు. ఓవైపు జగన్ తన ఎన్నికల ప్రచారంలో వివేకా రెండో పెళ్లి గురించి ప్రస్తావించిన రోజే ఆమె ఈ లేఖ రాశారు. చెప్పలేని విధంగా వివేకా వ్యక్తిత్వ హననం చేస్తున్నారంటూ ఆమె జగన్ తీరును తప్పుబట్టారు.
‘‘2009లో నీ తండ్రిని కోల్పోయినపుడు ఎంత మనో వేదన అనుభవించావో 2019లో నీ చెల్లి సునీత కూడా అంతే వేదన అనుభవించింది. మన కుటుంబంలోని వారే ఈ హత్యకు కారణం కావడం.. వాళ్లకు నువ్వు రక్షణగా ఉండడం ఎంతో బాధించింది. నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తపించిన చిన్నాన్నపై నీ సొంత మీడియా, పార్టీ వర్గాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాయి. చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం చేయడం నీకు తగునా? న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెళ్లను హేళన చేస్తూ నిందలు మోపుతున్నారు. కొంతమంది దాడులకూ తెగబడే స్థాయికి దిగజారుతున్నారు. ఇదంతా నీకు పట్టడం లేదా? సునీతకు మద్దతుగా నిలిచి పోరాడుతున్న షర్మిళనూ టార్గెట్ చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు ఉండడమేంటి? కుటుంబ సభ్యుడిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇదేనా నీ కర్తవ్యం? ఇంకా బాధించే అంశం.. హత్యకు కారణమైన వారికి మళ్లీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించడం. ఇది సమంజసమా? ఇలాంటి దుశ్చర్యలు నీకు ఎంతమాత్రం మంచిది కాదు. చివరి ప్రయత్నంగా ప్రార్థిస్తున్నా. రాగద్వేషాలకు అతీతంగా పాలన సాగిస్తానని ప్రమాణం చేసిన ముఖ్యమంత్రిగా.. న్యాయం, ధర్మం, నిజం వైపు నిలవాలని వేడుకుంటున్నా’’ అని ఈ లేఖలో సౌభాగ్యమ్మ పేర్కొన్నారు.
This post was last modified on April 26, 2024 10:56 am
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…