Political News

పిఠాపురంలో ఇంకో ఇద్దరు పవన్ కళ్యాణ్‌లు?

రాజకీయంగా తనకు ప్రధాన ప్రత్యర్థి నారా చంద్రబాబు నాయుడే అయినప్పటికీ.. వైఎస్ జగన్ దృష్టి ఎక్కువగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీదే ఉంటుందన్నది వాస్తవం. 2014లో విజయం ఖాయమనుకున్న తనకు ఓటమి ఎదురవడానికి బాబుకు పవన్ ఇచ్చిన మద్దతే కారణమని జగన్ భావిస్తారు. అందుకే పవన్‌ను విమర్శినంత దారుణంగా చంద్రబాబును కూడా టార్గెట్ చేయరంటే అతిశయోక్తి కాదు. ప్రతి మీటింగ్‌లోనూ దత్త పుత్రుడు అని, ప్యాకేజ్ స్టార్ అని, నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని.. ఇలా తీవ్రమైన పదజాలంతో వ్యక్తిగత విమర్శలు చేస్తుంటాడు పవన్‌ను ఉద్దేశించి జగన్. అలాగే పవన్‌ను ఎన్నికల్లో ఓడించడానికి ఆయన ప్రతిసారీ గత పర్యాయం గట్టిగా ప్రయత్నించి విజయవంతం అయ్యారు. ఈసారి కూడా పవన్‌ను ఓడించడానికి జగన్ అండ్ కో గట్టి ప్రణాళికలే సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది.

వంగా గీత లాంటి బలమైన క్యాండిడేట్‌ను పిఠాపురం బరిలో నిలిచేలా చేయడమే కాదు.. ముద్రగడ పద్మనాభం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మిథున్ రెడ్డి లాంటి బలమైన నేతలకు ఆ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు జగన్. అంతే కాక పవన్‌ను దెబ్బ కొట్టడానికి వైసీపీ ఇంకో ప్రణాళిక కూడా రచించిన‌ట్లు ప్రచారం జ‌రుగుతోంది. పవన్ కళ్యాణ్ పేరుతో ఇద్దరు అభ్యర్థులను ఎంచుకుని వారికి గాజు గ్లాసు తరహా గుర్తులే వచ్చేలా చూసుకుని పిఠాపురం ఎన్నికల బరిలో నిలిపారని సోష‌ల్ మీడియా జ‌నాలు అంటున్నారు.. అందులో ఒక అభ్యర్థి పేరు కోనేటి పవన్ కళ్యాణ్ కాగా.. మరో అభ్యర్థి పేరు కనుమూరి పవన్ కళ్యాణ్. వీరిలో ఒకరి గుర్తు బకెట్. అది గాజు గ్లాసుకు చాలా దగ్గరగా ఉంది. మరో అభ్యర్థి గుర్తు కూడా గాజు గ్లాసుకు దగ్గరగానే ఉంది. దీనికి సంబంధించి బ్యాలెట్ పేపర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి చూసి జ‌నాల‌ను క‌న్ఫ్యూజ్ చేయ‌డం ద్వారా పవన్‌ను ఓడించడానికి వైసీపీ ఇంతకు దిగజారాలా అని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ ఇది ఉత్త ప్ర‌చార‌మే అని.. వాస్త‌వంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరుతో ఒక్క‌రే నామినేష‌న్ వేశార‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. ఇందులో ఏది నిజ‌మో మ‌రి.

This post was last modified on April 26, 2024 10:45 am

Share

Recent Posts

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

57 minutes ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

5 hours ago

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

9 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

9 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

10 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

10 hours ago