ఏపీ సీఎం జగన్ తాజాగా పులివెందులలో నిర్వహించిన సభలో సొంత చెల్లి.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్.. వైఎస్ షర్మిలపై తీవ్ర విమర్శలు చేశారు. ఆమె కట్టుకునే చీరలపై ఆయన వ్యాఖ్యలు సంధించారు. పసుపు చీర కట్టుకుని.. వైఎస్ శత్రువులకు ఆహ్వానించారంటూ.. కామెంట్లు కురిపించారు. నిజానికి షర్మిల తన కుమారుడు రాజా వివాహాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరిలో ఆమె పలువురు అగ్రనేతలను వారి ఇళ్లకు వెళ్లి ఆహ్వానించారు.
ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఆమె హైదరాబాద్ నివాసంలో కలుసుకున్నారు. కుమారుడి వివాహ పత్రికను ఇవ్వడంతోపాటు.. స్వీట్లు, కానుకలు కూడా ఇచ్చారు. ఈ సమయంలో ఆమె లైట్ ఎరుపు రంగు బార్డర్ ఉన్న పసుపు రంగు చీరను కట్టుకున్నారు. ఇది అనుకుని చేశారో.. లేదా.. యాదృచ్ఛికంగా జరిగిందో తెలియదు. ఎవరూ కూడా.. దీనిపై ఇప్పటి వరకు కామెంట్లు చేయలేదు. ఇది సభ్యత కూడా కాదని అందరికీ తెలిసిందే.
కానీ, తాజాగా సీఎం జగన్.. ఇదే చీరపై కామెంట్లు చేశారు. పసుపు రంగు చీర కట్టుకుని.. వైఎస్ శత్రువులకు ఆహ్వాన పత్రికలు అందించారంటూ.. నాటి ఘటనను ప్రస్తావించారు. దీనిపై తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఫైరయ్యారు.
“తోడబుట్టిన చెల్లెలి పుట్టుక పైనా…
మహాలక్ష్మీగా భావించే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రా?
ఎంత నీచం! ఇది కాదా వికృత మనస్తత్వం?“ అని సీఎం జగన్ను ఉద్దేశించి నిప్పులు చెరిగారు. మరి ఇది ఎటు వైపు దారి తీస్తుందో చూడాలి.
This post was last modified on April 25, 2024 5:47 pm
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిపోయారు. బెంగాల్ ను పదిహేనేళ్లుగా పాలిస్తూ…
గత ఏడాది సింగల్ సక్సెస్ తో ట్రాక్ లో పడిన శ్రీవిష్ణుకి అతి తక్కువ గ్యాప్ లో మూడు వరస…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…
దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…
సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…