ఏపీ సీఎం జగన్ తాజాగా పులివెందులలో నిర్వహించిన సభలో సొంత చెల్లి.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్.. వైఎస్ షర్మిలపై తీవ్ర విమర్శలు చేశారు. ఆమె కట్టుకునే చీరలపై ఆయన వ్యాఖ్యలు సంధించారు. పసుపు చీర కట్టుకుని.. వైఎస్ శత్రువులకు ఆహ్వానించారంటూ.. కామెంట్లు కురిపించారు. నిజానికి షర్మిల తన కుమారుడు రాజా వివాహాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరిలో ఆమె పలువురు అగ్రనేతలను వారి ఇళ్లకు వెళ్లి ఆహ్వానించారు.
ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఆమె హైదరాబాద్ నివాసంలో కలుసుకున్నారు. కుమారుడి వివాహ పత్రికను ఇవ్వడంతోపాటు.. స్వీట్లు, కానుకలు కూడా ఇచ్చారు. ఈ సమయంలో ఆమె లైట్ ఎరుపు రంగు బార్డర్ ఉన్న పసుపు రంగు చీరను కట్టుకున్నారు. ఇది అనుకుని చేశారో.. లేదా.. యాదృచ్ఛికంగా జరిగిందో తెలియదు. ఎవరూ కూడా.. దీనిపై ఇప్పటి వరకు కామెంట్లు చేయలేదు. ఇది సభ్యత కూడా కాదని అందరికీ తెలిసిందే.
కానీ, తాజాగా సీఎం జగన్.. ఇదే చీరపై కామెంట్లు చేశారు. పసుపు రంగు చీర కట్టుకుని.. వైఎస్ శత్రువులకు ఆహ్వాన పత్రికలు అందించారంటూ.. నాటి ఘటనను ప్రస్తావించారు. దీనిపై తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఫైరయ్యారు.
“తోడబుట్టిన చెల్లెలి పుట్టుక పైనా…
మహాలక్ష్మీగా భావించే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రా?
ఎంత నీచం! ఇది కాదా వికృత మనస్తత్వం?“ అని సీఎం జగన్ను ఉద్దేశించి నిప్పులు చెరిగారు. మరి ఇది ఎటు వైపు దారి తీస్తుందో చూడాలి.
This post was last modified on April 25, 2024 5:47 pm
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…