ఆ నియోజకవర్గంలో ఎవరికైనా ఒక్కసారే ఛాన్స్. ఏ ఎమ్మెల్యే కూడా రెండోసారి గెలిచిన చరిత్ర లేదు. వరసగా మూడు ఎన్నికలలో అక్కడి ఓటర్లు మూడు పార్టీల నుండి ముగ్గురు ఎమ్మెల్యేలను ఎన్నుకున్నారు. ఈ సారి ఎన్నికలలో అక్కడ ఏ పార్టీ జెండా ఎగురుతుందా ? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే విశాఖపట్నం నార్త్ శాసనసభ నియోజకవర్గం.
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఈ నియోజకవర్గం ఏర్పాటయింది. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి విజయ్ కుమార్ ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి శిరిన్ రహమన్ షేక్ మీద 5,523 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించాడు. 2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గం బీజేపీకి కేటాయించారు. ఆ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి పెన్మత్స విష్ణుకుమార్ రాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చొక్కాకుల వెంకట్రావు మీద 18,240 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించాడు. 2019 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు వైసీపీ అభ్యర్థి కమ్మీల కన్నపరాజు మీద 1944 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించాడు.
ప్రస్తుతం ఈ స్థానం నుండి వైసీపీ అభ్యర్థిగా కేకే రాజు, టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్ రాజు పోటీ చేస్తుండగా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ జైభారత్ నేషనల్ పార్టీ తరఫున సీబీఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి వైపు సానుభూతి కనిపిస్తున్నది. అయితే జేడీ లక్ష్మీనారాయణ ఎన్నికలలో ఎక్కువ ప్రభావం చూపితే అది ఎవరికి చేటు చేస్తుంది ? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
ముగ్గురు అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నా ప్రధాన పోటీ వైసీపీ, బీజేపీ మధ్యనే కనిపిస్తోంది. ఇక్కడ ఒకసారి గెలిచిన వారికి రెండో చాన్స్ లేదనే సెంటిమెంట్ కూడా వైసీపీ అభ్యర్థికి సానుకూలంగా మారుతోంది. గత ఎన్నికలలో టీడీపీ నుండి గెలిచిన గంటా ఆ తర్వాత నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంతో పూర్తి స్థాయిలో ఇక్కడ వైసీపీ అభ్యర్థి అందుబాటులో ఉండడం కూడా కలిసివస్తుంది.
This post was last modified on April 25, 2024 11:12 am
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…