ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, శ్రీపీఠం అధ్యక్షుడు పరిపూర్ణానంద స్వామి హిందూపురం లోక్ సభ, శాసనసభ స్థానాలకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. హిందూపురం లోక్ సభ స్థానానికి బీజేపీ తరపున పోటీ చేయాలని ఆశించారు. ఆ స్థానం బీజేపీకి ఇవ్వడానికి చంద్రబాబు నిరాకరించారు. దీంతో పరిపూర్ణానంద స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు.
గతంలో శ్రీరాముడి గురించి కత్తి మహేష్ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ధర్మాగ్రహ యాత్రకు సిద్దమయ్యాడు. ఆ యాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ఆయనను గృహనిర్భంధం చేశారు. మూడు రోజుల పాటు ఆయన గృహ నిర్బంధంలో ఉన్నాడు.
2017 నవంబరులో రాష్ట్రీయ హిందూసేన సమావేశంలో పరిపూర్ణానంద చేసిన ప్రసంగంపై ఫిర్యాదులు రావడంతో ఆరునెలల పాటు పోలీసులు నగర బహిష్కరణ చేశారు. ఆ తర్వాత హైకోర్టు పోలీసులు విధించిన నగర బహిష్కరణను ఎత్తివేసింది.
ఆ తర్వాత ఆయన అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరి 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బీజేపీకి ప్రచారం చేశాడు. ఆ ఎన్నికల తర్వాత ఆయన కనుమరుగయ్యారు. ఇన్నాళ్లకు ఆంధ్రాలో హిందూపురం ఎన్నికల తెర మీదకు వచ్చారు.
This post was last modified on April 24, 2024 11:44 am
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…