ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, శ్రీపీఠం అధ్యక్షుడు పరిపూర్ణానంద స్వామి హిందూపురం లోక్ సభ, శాసనసభ స్థానాలకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. హిందూపురం లోక్ సభ స్థానానికి బీజేపీ తరపున పోటీ చేయాలని ఆశించారు. ఆ స్థానం బీజేపీకి ఇవ్వడానికి చంద్రబాబు నిరాకరించారు. దీంతో పరిపూర్ణానంద స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు.
గతంలో శ్రీరాముడి గురించి కత్తి మహేష్ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ స్వామి పరిపూర్ణానంద హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ధర్మాగ్రహ యాత్రకు సిద్దమయ్యాడు. ఆ యాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు ఆయనను గృహనిర్భంధం చేశారు. మూడు రోజుల పాటు ఆయన గృహ నిర్బంధంలో ఉన్నాడు.
2017 నవంబరులో రాష్ట్రీయ హిందూసేన సమావేశంలో పరిపూర్ణానంద చేసిన ప్రసంగంపై ఫిర్యాదులు రావడంతో ఆరునెలల పాటు పోలీసులు నగర బహిష్కరణ చేశారు. ఆ తర్వాత హైకోర్టు పోలీసులు విధించిన నగర బహిష్కరణను ఎత్తివేసింది.
ఆ తర్వాత ఆయన అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరి 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బీజేపీకి ప్రచారం చేశాడు. ఆ ఎన్నికల తర్వాత ఆయన కనుమరుగయ్యారు. ఇన్నాళ్లకు ఆంధ్రాలో హిందూపురం ఎన్నికల తెర మీదకు వచ్చారు.
This post was last modified on April 24, 2024 11:44 am
ఏపీలో ఎన్నికల పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలను నిలువరించలేక పోయిన.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా కలెక్టరు, ముగ్గురు ఎస్పీలు) వేటు…
ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…
ఏపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. సతీమణి వైఎస్ భారతి, కుమార్తెలు హర్ష,…
మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…