తెలంగాణలో తన పార్టీ పరిస్థితి, తన నేతల పరిస్థితి.. నానాటికీ తీసికట్టుగా మారుతున్నా.. మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం మెరమెచ్చు మాటలు మానడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలు కేసీఆర్కు అత్యంత కీలకం. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరువు పోయి.. అధికారం నుంచి దిగిపోయి ఉన్న పరిస్థితి నాయకుల వరుస జంపింగులతో పార్టీ పరిస్థితి దారుణంగా మారింది. ఇలాంటి పరిస్థితిలో అధినాయకుడు ముందు ఇల్లు చక్కబెట్టుకునే ప్రయత్నం చేస్తాడు.
కానీ, కేసీఆర్ దుస్సాహసి! ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఆయనకు బాగా తెలుసు. సరిగ్గా ఏపీలో ఎన్నికల ప్రచారం కీలక దశలో ఉండగా(చంద్రబాబు-పవన్-పురందేశ్వరి) కూటమికి అనుకూల పవనాలు మొదలవుతున్న సమయంలో అనూహ్యంగా కేసీఆర్ బరిలోకి దిగిపోయారు. తనకు సంబంధం లేదంటూనే ఆయన ఏపీ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మళ్లీ ఎవరు అధికారంలోకి వస్తారనే విషయంపై కేసీఆర్ స్పందించారు. మరోసారి జగనే అధికారంలోకి వచ్చేస్తారని చెప్పారు. అంతేకాదు.. తనకు ఉన్నగట్టి సమాచారంగా ఆయన పేర్కొన్నారు.
ఇంతలోనే ఏమనుకున్నారో..ఏమో.. ఎవరు గెలిస్తే.. మాకేంటి? అని కేసీఆర్ ప్రశ్నించారు. తమకు ఎవరితోనూ సంబంధాలు లేవన్నారు. ఏపీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీ కానీ, నాయకులు కానీ, జోక్యం చేసుకోరని తెలిపారు. తాము తటస్థంగా వ్యవహరిస్తా మని కేసీఆర్ చెప్పారు. అయితే.. వచ్చే తదుపరి ఎన్నికల్లో ఏమైనా ఉంటే చూసుకుంటామన్నారు. మొత్తానికి.. కేసీఆర్ చేసిన వ్యాఖ్యల వెనుక.. అంతరార్థం ఎలా ఉన్నా.. ముందు మునుగుతున్న తన బీఆర్ ఎస్ నావను కాపాడుకునే ప్రయత్నం చేయాల్సింది పోయి.. పక్కరాష్ట్రంపై ఇంత దృష్టిపెట్టడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on April 24, 2024 11:40 am
కెజిఎఫ్ తర్వాత చాలా పెద్ద గ్యాప్ తీసుకున్న హీరో యష్ ఏరికోరి చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ టాక్సిక్. ఇలాంటి…
సెలబ్రిటీలు ఏదైనా విషయం గురించి స్పందిస్తే చాలు దాన్ని చిలవలు పలవలు చేయడానికో టీమ్ సోషల్ మీడియాలో రెడీగా ఉంటుంది.…
సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…
సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…