ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ కుటుంబ పోరును సీఎం జగన్ సెట్ రైట్ చేశారు. ఈ నియోజకవర్గంలో విజయం దక్కించుకుని తీరాలని కసితో ఉన్న సీఎం జగన్.. ఇక్కడ తలెత్తిన భార్యాభర్తల వివాదాన్ని తనదైన శైలిలో పరిష్కరించారు. టెక్కలి నుంచి టీడీపీ రాష్ట్ర చీఫ్ అచ్చెన్నాయుడు పోటీలో ఉన్న విషయం తెలిసిందే. ఈయనను ఓడించి తీరాలనేది సీఎం జగన్ పంతం. ఈ క్రమంలోనే ఫైర్ బ్రాండ్ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్కు ఆరు మాసాల ముందే.. టికెట్ ప్రకటించారు. కానీ, ఏమనుకున్నారో ఏమో.. జెడ్పీ మెంబర్గా ఉన్న శ్రీనివాస్ భార్య.. వాణికి తర్వాత..టికెట్ ఇస్తామని చెప్పారు.
దీంతో వాణి పేరు దాదాపు ఒక దశలో ఖరారైంది. జగన్ ప్రకటనతో ఆమె ప్రచారానికి కూడా రెడీ అయిపోయారు. తీరా ఎన్నికల వేళకు వచ్చేసరికి మళ్లీ జగన్ మనసు మార్చుకుని దువ్వాడ శ్రీనివాస్వైపే మొగ్గు చూపారు. కానీ, వాణి మాత్రం పోటీ నుంచి తప్పుకొనేది లేదని తేల్చి చెప్పారు. తన భర్తఅయినా.. సరే.. వెనక్కి తగ్గేది లేదన్నారు. వెంటనే ఇండిపెండెంట్గా నామినేషన్ కూడా వేసేశారు. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ను జగన్ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో భార్యాభర్తలు ఇద్దరూ ఒకే నియోజకవర్గం నుంచి పోటీ పడడంతో వైసీపీ ఓటు బ్యాంకు చెదిరి పోవడం ఖాయమని భావించిన పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది.,
తాజాగా విశాఖ పర్యటనలో ఉన్న జగన్.. ఇద్దరినీ అక్కడకు పిలుపించుకుని సర్ది చెప్పారు. ముందు వాణి.. సీఎం జగన్కు సైతం ఎదురు తిరిగారని సమాచారం. తనపేరును ప్రకటించిన తర్వాత.. వెనక్కి ఎలా తీసుకుంటారని.. ఇది మంచిది కాదని కూడా ఆమె వాదించినట్టు సమాచారం. అయితే.. సీఎం జగన్ ఆమెను అనునయించి.. మనం ఒక లక్ష్యం పెట్టుకునిముందుకు సాగుతున్నామని.. అచ్చెన్నను ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. ఇప్పుడు పంతాలు పట్టింపులకు పోయే సమయం కాదని నచ్చజెప్పారు. అయినప్పటికీ వాణి మాట వినలేదు.
\
దీంతో అరగంట సమయం ఇచ్చిన జగన్ తర్వాత.. కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ను గెలిపించేందుకు కృషి చేయాలని.. ఆయన గెలిచిన తర్వాత.. ఆయన ఎమ్మెల్సీ సీటును మీకు ఇస్తామని వాణికి బలమైన హామీ ఇచ్చారు. దీంతో వాణి మెత్తబడ్డారు. తాను పోటీ నుంచి తప్పుకొంటానని చెప్పారు. వేసిన నామినేషన్ను కూడా వెనక్కి తీసుకుంటానని వెల్లడించారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్కు లైన్ క్లియర్ అయింది.
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…
కేవలం మూడు వారాలు... ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మళ్లీ పాత స్థానానికి పడిపోవడానికి పట్టిన…
యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా…
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…