ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ కుటుంబ పోరును సీఎం జగన్ సెట్ రైట్ చేశారు. ఈ నియోజకవర్గంలో విజయం దక్కించుకుని తీరాలని కసితో ఉన్న సీఎం జగన్.. ఇక్కడ తలెత్తిన భార్యాభర్తల వివాదాన్ని తనదైన శైలిలో పరిష్కరించారు. టెక్కలి నుంచి టీడీపీ రాష్ట్ర చీఫ్ అచ్చెన్నాయుడు పోటీలో ఉన్న విషయం తెలిసిందే. ఈయనను ఓడించి తీరాలనేది సీఎం జగన్ పంతం. ఈ క్రమంలోనే ఫైర్ బ్రాండ్ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్కు ఆరు మాసాల ముందే.. టికెట్ ప్రకటించారు. కానీ, ఏమనుకున్నారో ఏమో.. జెడ్పీ మెంబర్గా ఉన్న శ్రీనివాస్ భార్య.. వాణికి తర్వాత..టికెట్ ఇస్తామని చెప్పారు.
దీంతో వాణి పేరు దాదాపు ఒక దశలో ఖరారైంది. జగన్ ప్రకటనతో ఆమె ప్రచారానికి కూడా రెడీ అయిపోయారు. తీరా ఎన్నికల వేళకు వచ్చేసరికి మళ్లీ జగన్ మనసు మార్చుకుని దువ్వాడ శ్రీనివాస్వైపే మొగ్గు చూపారు. కానీ, వాణి మాత్రం పోటీ నుంచి తప్పుకొనేది లేదని తేల్చి చెప్పారు. తన భర్తఅయినా.. సరే.. వెనక్కి తగ్గేది లేదన్నారు. వెంటనే ఇండిపెండెంట్గా నామినేషన్ కూడా వేసేశారు. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ను జగన్ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో భార్యాభర్తలు ఇద్దరూ ఒకే నియోజకవర్గం నుంచి పోటీ పడడంతో వైసీపీ ఓటు బ్యాంకు చెదిరి పోవడం ఖాయమని భావించిన పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది.,
తాజాగా విశాఖ పర్యటనలో ఉన్న జగన్.. ఇద్దరినీ అక్కడకు పిలుపించుకుని సర్ది చెప్పారు. ముందు వాణి.. సీఎం జగన్కు సైతం ఎదురు తిరిగారని సమాచారం. తనపేరును ప్రకటించిన తర్వాత.. వెనక్కి ఎలా తీసుకుంటారని.. ఇది మంచిది కాదని కూడా ఆమె వాదించినట్టు సమాచారం. అయితే.. సీఎం జగన్ ఆమెను అనునయించి.. మనం ఒక లక్ష్యం పెట్టుకునిముందుకు సాగుతున్నామని.. అచ్చెన్నను ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. ఇప్పుడు పంతాలు పట్టింపులకు పోయే సమయం కాదని నచ్చజెప్పారు. అయినప్పటికీ వాణి మాట వినలేదు.
\
దీంతో అరగంట సమయం ఇచ్చిన జగన్ తర్వాత.. కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ను గెలిపించేందుకు కృషి చేయాలని.. ఆయన గెలిచిన తర్వాత.. ఆయన ఎమ్మెల్సీ సీటును మీకు ఇస్తామని వాణికి బలమైన హామీ ఇచ్చారు. దీంతో వాణి మెత్తబడ్డారు. తాను పోటీ నుంచి తప్పుకొంటానని చెప్పారు. వేసిన నామినేషన్ను కూడా వెనక్కి తీసుకుంటానని వెల్లడించారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్కు లైన్ క్లియర్ అయింది.
This post was last modified on April 24, 2024 6:17 am
ఫొటోల పిచ్చి అనండి.. ప్రచార పిచ్చి అనండి.. ఏదేమైనా ఏపీలోని వైసీపీ ప్రభుత్వం చేజేతులా చేసుకున్న వ్యవహారం ఇప్పుడు పీకల…
నిఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న స్వయంభు షూటింగ్ వేగమందుకుంది. సుమరు ఎనిమిది కోట్ల బడ్జెట్…
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం వాడి వేడిగా సాగుతున్న సమయంలో గత ఏడాది జగన్ సర్కారు ప్రవేశపెట్టిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్…
టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ కీలక నాయకుడు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన బరిలో ఉన్న…
మరో వారం రోజుల్లో (మే 13న) జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-భాజాపా కూటమికి సంఘీభావం తెలుపుతూ ఎన్నారై టీడీపీ…
ఆర్ఆర్ఆర్ సినిమా అద్భుత విజయం సాధించినప్పటికీ.. ఆ చిత్రంలో రామ్ చరణ్తో పోలిస్తే జూనియర్ ఎన్టీఆర్ పాత్రలో అంత బలం…