Political News

హేమాహేమీల మధ్య లో బర్రెలక్క

బ‌ర్రెల‌క్క‌గా ప్ర‌చారంలో ఉన్న శిరీష‌.. గ‌త ఏడాది జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసిన విష‌యం తెలిసిందే. జూప‌ల్లి కృష్ణారావు పోటీ చేసిన కొల్లాపూర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమె బ‌రిలోకి దిగారు. ఆమెకు ప్ర‌జా సంఘాలు, ఎన్నారైలు, జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ అధ్య‌క్షుడు, సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ వంటి వారు మ‌ద్ద‌తు తెలిపారు. ఇక‌, యువ‌త పెద్ద ఎత్తున ఆన్ లైన్ ప్రచారం కూడా చేశారు. యానాం మాజీ మంత్రి కృష్ణారావు కూడా.. రూ.2 ల‌క్ష‌లు విరాళంగా ఇచ్చారు. ఇలా అంద‌రూ ఆమెను ప్రోత్స‌హించారు.

అయితే.. ఆ ఎన్నిక‌ల్లో బ‌ర్రెల‌క్క ఓడిపోయారు. ఇక్క‌డ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్య‌ర్థి జూప‌ల్లి విజ‌యం ద‌క్కించుకున్నారు. ప్ర‌స్తుతం రేవంత్ మంత్రివ‌ర్గంలో ఆయ‌న మంత్రిప‌ద‌వి కూడా ద‌క్కించుకున్నారు. అయితే.. ఇప్పుడు శిరీష మ‌రింత దూకుడు పెంచారు. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. త‌న‌కు ప్ర‌జాసంఘాలు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాల‌ని కోరారు. గ‌త ఎన్నిక‌ల్లో ఏ స‌మ‌స్య‌ల‌పై అయితే.. తాను పోరాటం చేసేందుకు.. ఎన్నిక‌ల్లో నిల‌బ‌డ్డానో.. ఇప్పుడు కూడా అవే స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేసేందుకు పార్ల‌మెంటుకు వెళ్లాల‌ని అనుకుంటున్న‌ట్టు తెలిపారు.

నాగ‌ర్ క‌ర్నూలు పార్ల‌మెంటు స్థానం నుంచి ఇండిపెండెంటుగా బ‌రిలో దిగేందుకు శిరీష సిద్ధ‌మైన‌ట్టు చెప్పారు. అంతేకాదు.. మంగ‌ళ‌వారం మంచి ముహూర్తం చూసుకుని ఆమె నామినేష‌న్ కూడా వేసేశారు. ఇక‌, నాగ‌ర్ క‌ర్నూల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి హేమాహేమీలు బ‌రిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి దిగ్గ‌జ నాయ‌కుడు మ‌ల్లు ర‌వి పోటీ చేస్తున్నారు. బీఆర్ ఎస్ నుంచి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ . ఎస్‌. ప్ర‌వీణ్ కుమార్‌, బీజేపీ నుంచి పోతుగంటి మ‌హేష్‌(ఈయ‌న కోటీశ్వ‌రుడు), బీఎస్పీ నుంచి మందా జ‌గ‌న్నాధం(మాజీ మంత్రి) బ‌రిలో ఉన్నారు. మ‌రి వీరిని త‌ట్టుకుని శిరీష గెలుస్తారా? అనేది ప్ర‌శ్న‌. కానీ, యువ‌త‌కు మాత్రం ఆమె స్ఫూర్తిగా మ‌రోసారి నిల‌వ‌నున్నార‌నేది నిజం.

Satya

Recent Posts

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

3 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

3 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

6 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

6 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

7 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

7 hours ago