నెల్లూరుపై పట్టు నిలబెట్టుకునేందుకు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకుండా పోతోంది. 2014 ఎన్నికల్లో నెల్లూరులో 10కి 10 నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులే గెలిచారు. కానీ ఈ సారి పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. అందుకే కనీసం 5 సీట్లు గెలిచినా చాలనే పరిస్థితికి జగన్ వచ్చారనే టాక్ వినిపిస్తోంది. కానీ ఇప్పుడు అవి కూడా రావడం గగమనే చెప్పాలి. వైసీపీపై వ్యతిరేకత, కూటమి బలం జగన్ను దెబ్బకొట్టే అవకాశం ఉంది. ఇక నెల్లూరులో పట్టు కోసం కిందామీద పడుతున్న జగన్కు తాజాగా మరో షాక్ తగిలింది.
నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన వైసీపీ కీలక నేత మెట్టుకూరు చిరంజీవి రెడ్డి తాజాగా పార్టీకి రాజీనామా చేశారు. అలాగే పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ పదవినీ వదులుకున్నారు. ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో ఉదయగిరి నుంచి పోటీ చేయాలని చిరంజీవి రెడ్డి అనుకున్నారు. కానీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి జగన్ టికెట్ కేటాయించారు. ఇక నిరుడు మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారని వైసీపీ పార్టీ చంద్రశేఖర్ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరారు.
గత ఎన్నికల్లో సీటు రాకపోవడంతో అసంతృప్తితో ఉన్న చిరంజీవిని పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ పదవితో జగన్ బుజ్జగించారు. ఈ సారి ఎన్నికల్లోనూ పోటీకి చిరంజీవి సిద్ధమైనట్లు తెలిసింది. ఉదయగిరి టికెట్ ఇవ్వాలని జగన్ను చిరంజీవి అడిగినా ప్రయోజనం లేకపోయిందని సమాచారం. ఈ సారి మేకపాటి రాజగోపాల్ రెడ్డిని జగన్ నిలబెట్టారు. దీంతో కొద్దిరోజులుగా అసహనంతో ఉన్న చిరంజీవి ఎట్టకేలకు జగన్కు గుడ్బై చెప్పారు. టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిణామంతో నెల్లూరు జిల్లాలో వైసీపీకి మరింత డ్యామేజీ జరిగే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
This post was last modified on April 23, 2024 6:12 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…