Political News

జగన్ చేతిలో ఉన్న చిల్లరెంతో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఎంతో తెలుసా ? మొత్తం రూ.529.87 కోట్లు. కానీ ఆయన చేతిలో ఉన్న నగదు ఎంతో తెలుసా ? కేవలం రూ.7 వేలు మాత్రమే. జగన్ సతీమణి భారతి పేరిట ఉన్న ఆస్తులు రూ.176.63 కోట్లు. కానీ ఆమె చేతిలో ఉన్న నగదు రూ.10,022 మాత్రమే. ఇద్దరు కుమార్తెలు హర్షిణి రెడ్డి, వర్షారెడ్డిల పేర ఉన్న ఆస్తులు రూ.51.50 కోట్లు. కానీ పెద్ద కూతురు వద్ద రూ.3 వేల నగదు, చిన్న కూతురు వద్ద రూ.6980 నగదు మాత్రమే ఉన్నాయి.

పులివెందుల శాసనసభ స్థానానికి దాఖలు చేసిన నామినేషన్ సంధర్భంగా వెల్లడించిన అఫిడవిట్ పొందు పరిచిన వివరాలు ఇవి. 2019లో జగన్‌ ఒక్కరి ఆస్తుల విలువ రూ.375 కోట్ల 20 లక్షలు కాగా గత అయిదేళ్లలో ఆయన ఆస్తుల విలువ రూ.154 కోట్ల 67 లక్షల మేర అంటే 41.22 శాతం పెరిగింది. 2019లో జగన్‌ కుటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ.510 కోట్లు 38 లక్షలు కాగా అయిదేళ్లలో రూ.247 కోట్ల 27 లక్షలు అంటే 48.45 శాతం పెరిగింది.

ఇక జగన్‌ ఓ సంస్థకు రూ.43 కోట్ల 10 లక్షలు అప్పు ఇవ్వగా, మరికొందరికి రూ.136 కోట్ల 15 లక్షలు అప్పుగా ఇచ్చారు. భారతిరెడ్డికి రుణగ్రహీతల నుంచి రూ.4 కోట్ల 37 లక్షలు రావాలి. ఇవి కాకుండా 26లక్షల 54 వేల మేర రుణాలిచ్చారు. జగన్ కుమార్తెలు హర్షిణిరెడ్డి రూ.2 కోట్ల 43 లక్షలు, వర్షారెడ్డి రూ.2 కోట్ల 68 లక్షలు అడ్వాన్సులుగా ఇచ్చారు.

జగన్‌కు రూ.కోటి 10లక్షల 78వేల 350 రూపాయలు, భారతికి రూ.7 కోట్ల 41లక్షల 79వేల 353, హర్షిణిరెడ్డికి  రూ.9 కోట్ల 2లక్షలు,  వర్షారెడ్డికి అంతే మేర అప్పులున్నట్లు అఫిడవిట్ లో పేర్కొనడం గమనార్హం. ఇన్ని కోట్ల ఆస్తులున్నా మరి చేతిలో చిల్లి గవ్వ ఎందుకు లేదన్నది ప్రశ్నార్ధకం. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో  ఆడవాళ్ల వయసు, రాజకీయ నాయకుల ఆస్తుల వివరాలు అడక్కూడదు, ఆరా తీయకూడదు అన్న సెటైర్లు మీడియా వర్గాలలో వినిపిస్తున్నాయి. 

This post was last modified on April 23, 2024 4:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వేమిరెడ్డి చిట్టా విప్పేస్తున్నారా?

నెల్లూరు పార్ల‌మెంటు స‌భ్యుడు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి వ్య‌వ‌హారం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీ వ‌ల వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి,…

3 hours ago

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

8 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

9 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

9 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

9 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

9 hours ago