‘’కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందూ మహిళల మెడల్లో మంగళసూత్రాలు తెంపడం ఖాయం’’ అని రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్న మాటలు మంటలు రేపుతున్నాయి.
మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తీవ్రంగా స్పందించారు. ‘నా మంగళసూత్రం తెంపే దమ్ము ఎవడికి ఉంది ? మీరు కట్టిన మాంగళ్యం విలువ తెలియదు కాబట్టి మీరు తాళికట్టిన ఆడబిడ్డ ఎక్కడో అమాయకంగా బతుకుతుంది. మీరు కట్టిన మంగళసూత్రం ఉరి తాడు అయింది. మోడీ వ్యాఖ్యలపై ఎన్నికల కమీషన్ చర్యలు తీసుకోవాలి. మోడీ క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి, తెలంగాణ ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ శాఖల ప్రధాన సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ ‘సంసారం చేయని ప్రధాని మోదీకి మంగళసూత్రం విలువ ఏం తెలుసని, ఆయన 140 కోట్ల జనాభాకు ప్రధాని అన్న విషయం మరిచి మాట్లాడుతున్నాడని, కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక వర్గానికి అనుకూలం అన్న ప్రధాని వ్యాఖ్యలు సిగ్గుచేటని’ విమర్శించారు.
మొదటి విడత 102 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగగా, రెండో దశ పోలింగ్ ఈ నెల 26న జరగనుంది. నాలుగో దశ ఎన్నికల షెడ్యూల్ విడుదలయిన నేపథ్యంలో దేశంలో రాజకీయ పార్టీల ప్రచార ఉదృతితో పాటు, విమర్శలు, ప్రతి విమర్శలు పెరిగాయి. ఎన్నికలు ముగిసే లోపు ఇవి ఎక్కడి వరకు వెళ్తాయో వేచిచూడాలి.
This post was last modified on April 23, 2024 10:24 am
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…
ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…
రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్ ట్రిబ్యునల్…
ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…
ఏపీ సీఎం చంద్రబాబును ఆ పార్టీ నాయకులు ఒకే కోణంలో చూస్తున్నారా? బాబుకు రెండో కోణం కూడా ఉందన్న విషయాన్ని…
గుంటూరు ఎంపీ అదే విధంగా కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖరకు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. రెండు…