‘’కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందూ మహిళల మెడల్లో మంగళసూత్రాలు తెంపడం ఖాయం’’ అని రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్న మాటలు మంటలు రేపుతున్నాయి.
మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తీవ్రంగా స్పందించారు. ‘నా మంగళసూత్రం తెంపే దమ్ము ఎవడికి ఉంది ? మీరు కట్టిన మాంగళ్యం విలువ తెలియదు కాబట్టి మీరు తాళికట్టిన ఆడబిడ్డ ఎక్కడో అమాయకంగా బతుకుతుంది. మీరు కట్టిన మంగళసూత్రం ఉరి తాడు అయింది. మోడీ వ్యాఖ్యలపై ఎన్నికల కమీషన్ చర్యలు తీసుకోవాలి. మోడీ క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి, తెలంగాణ ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ శాఖల ప్రధాన సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ ‘సంసారం చేయని ప్రధాని మోదీకి మంగళసూత్రం విలువ ఏం తెలుసని, ఆయన 140 కోట్ల జనాభాకు ప్రధాని అన్న విషయం మరిచి మాట్లాడుతున్నాడని, కాంగ్రెస్ మేనిఫెస్టో ఒక వర్గానికి అనుకూలం అన్న ప్రధాని వ్యాఖ్యలు సిగ్గుచేటని’ విమర్శించారు.
మొదటి విడత 102 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగగా, రెండో దశ పోలింగ్ ఈ నెల 26న జరగనుంది. నాలుగో దశ ఎన్నికల షెడ్యూల్ విడుదలయిన నేపథ్యంలో దేశంలో రాజకీయ పార్టీల ప్రచార ఉదృతితో పాటు, విమర్శలు, ప్రతి విమర్శలు పెరిగాయి. ఎన్నికలు ముగిసే లోపు ఇవి ఎక్కడి వరకు వెళ్తాయో వేచిచూడాలి.
This post was last modified on April 23, 2024 10:24 am
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…