Political News

టీడీపీ చేయాల్సిన వీడియోలు జనసేన చేస్తోంది!

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఓ వైపు మీడియా..మరోవైపు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఇలా తమ ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీని ఇరుకున పడేసేలా వీడియోలు చేయడంలో టీడీపీ కాస్త వెనుకబడి ఉంటే…టీడీపీ చేయాల్సిన పనిని జనసేన చేస్తోంది అన్న అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే నట శేఖర కృష్ణ గతంలో అన్న ఎన్టీఆర్ గురించి మాట్లాడిన మాటల వీడియోను జనసేన షేర్ చేయగా అది వైరల్ గా మారింది.

నందమూరి తారకరామారావు గారు టీడీపీ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న హీరో కృష్ణపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని, కానీ, జగన్ మాత్రం టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు చెందిన అమరరాజా బ్యాటరీల సంస్థపై కక్ష గట్టడంతో అది తెలంగాణకు తరలిపోయిందని విమర్శిస్తూ జనసేన ఎక్స్ లో పెట్టిన వీడియో వైరల్ గా మారింది. అన్నగారి వంటి నేతలు చేసిన హుందా రాజకీయాల నుండి నేర్చుకోవాల్సింది పోయి గల్లా వంటి వారి కుటుంబాలపై కక్ష కట్టాడు జగన్ అంటూ జనసేన విమర్శించింది. ఇటువంటి ఎన్నో నీతిమాలిన పనులు చేసిన జగన్ ను తరిమేయాల్సిన బాధ్యత కేవలం కృష్ణ, ఎన్టీఆర్ గారి అభిమానులపైనే కాదు, ప్రతీ సినీ హీరో అభిమానిపై ఉందని జనసేన ఎక్స్ లో ట్వీట్ చేసింది.

ఆ వీడియోలో కృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ తో తనకు ఇబ్బంది లేదని, ఎంపీగా గెలిచిన తర్వాత పార్లమెంట్ హౌస్ లో నుంచి వస్తుండగా ఎన్టీఆర్ ఎదురుపడ్డారని కృష్ణ గుర్తు చేసుకున్నారు. ఎలా ఉన్నారు..మా మీద ఇంకా సినిమాలు తీస్తున్నారా అని సరదాగా ప్రశ్నించారని చెప్పారు. ఇప్పుడే తీయడం లేదు అని తాను సమాధానమిచ్చానని, ఆయన చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారని అన్నారు. అంతేకాదు, రెండోసారి సీఎం అయిన తర్వాత ఇంటికి భోజనానికి కూడా పిలిచారని గుర్తు చేసుకున్నారు.

ఇక, ఏపీ సీఎం జగన్ మాత్రం అందుకు భిన్నంగా టీడీపీ నేతల వ్యాపారాలపై కక్షగట్టారని జనసేన విమర్శించింది. టీడీపీ మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కు చెందిన అమరరాజా బ్యాటరీస్ సంస్థను జగన్ టార్గెట్ చేశారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఆ కోవలోనే ఆ కంపెనీకి విద్యుత్ సరఫరా ఆపివేయడం, సంస్థ విస్తరణ పనులకు ఆటంకాలు కలిగించడం, పర్యావరణానికి హాని కలిగిస్తోందంటూ సంస్థపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఫిర్యాదు చేయడం వంటి చర్యలతో ఆ కంపెనీని ఇబ్బందిపెట్టింది. దీంతో, ఆ కంపెనీ విస్తరణ పనులు ఆపేయడమే కాకుండా…అది తెలంగాణకు తరలిపోయింది. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 483 ఎకరాలు ఇస్తే 253 ఎకరాలు వెనక్కు తీసుకంది. 9500 కోట్ల పెట్టుబడితో తెలంగాణలోని మహబూబ్ నగర్ లో ఆ సంస్థ నెలకొల్పేందుకు పనులు మొదలుబెట్టింది.

This post was last modified on April 23, 2024 6:38 am

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

అఖండ 2 ఆగింది… అసలేం జరుగుతోంది

బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…

19 minutes ago

అన్నగారు వచ్చేలా లేరు

నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…

35 minutes ago

‘హైదరాబాద్ హౌస్’లో పుతిన్ బస.. ఈ ప్యాలెస్ ఎవరిదో తెలుసా?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…

5 hours ago

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

8 hours ago

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

9 hours ago

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

11 hours ago