ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం చేరువ అవుతున్న కొద్దీ.. పార్టీల మద్య పోటీ కూడా అంతే తీవ్రంగా మారుతోంది. దీంతో ప్రజలకు ఇచ్చే హామీలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికేసూపర్ సిక్స్ వంటి కీలక పథకాలతో ప్రజల ముందు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా మరో సంచలన హామీ కూడా ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే.. పేదలకు 2 సెంట్ల నుంచి 3 సెంట్ల భూమి ఇస్తామని చెప్పారు. అంతేకాదు.. స్థలంలో పునాదుల నుంచి రూఫ్ వరకు ప్రభుత్వమే కట్టి ఇస్తుందని చెప్పారు. ఇది తన హామీ అని ప్రకటించారు.
తాజా కాకినాడ జిల్లా జగ్గంపేటలో ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొన్నారు. కాకినాడ నుంచి ఎంపీ అభ్యర్తిగా జనసేన నాయకుడు ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు. వీరిరువురును చెరోపక్కనా నిలబెట్టుకున్న చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జగన్ చేసేదంతా విధ్వంసమేనని, వచ్చీరావడంతోనే ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టి రాష్ట్రంలో ఏ వ్యవస్థను వదిలిపెట్టకుండా అన్నింటినీ ధ్వంసం చేశాడని చంద్రబాబు దుయ్యబట్టారు.
ఇప్పటికే తాము ప్రకటించిన సూపర్ సిక్స్పై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పిన చంద్రబాబు.. వారి నుంచి కూడా తాము కొంత ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్టు చెప్పారు. దీని ప్రకారం.. చాలా మంది పేదలు తమకు స్థలం కావాలని కోరుతున్నా రని.. ఈ సైకో ఇచ్చిన బాత్ రూం వంటి స్థలంలో పడుకోవడానికి కూడా చోటు సరిపోవడం లేదని అన్నారని.. కాబట్టి తాము అధికారంలోకి రాగానే పేదలకు 2 నుంచి 3 సెంట్ల భూమిని ఇస్తామన్నారు. వారికి ఇల్లు కూడా కట్టించి ఇస్తామని చెప్పారు. అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలను అందరికీ వర్తింపజేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
బాలీవుడ్లో దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి హై ప్రొఫైల్ హీరోయిన్ల పోటీని తట్టుకుని చాలా ఏళ్లుగా టాప్లో కొనసాగుతున్న…
జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…
ఇటీవలే విడుదలైన నాగబంధంకు అంత ఓపెనింగ్స్ వస్తాయని ఊహించినవాళ్లు చాలా తక్కువ. ఎంత విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సినిమా…
రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…
కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగత వంగవీటి మోహన్రంగా కుమార్తె ఆశాలత త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…