ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం చేరువ అవుతున్న కొద్దీ.. పార్టీల మద్య పోటీ కూడా అంతే తీవ్రంగా మారుతోంది. దీంతో ప్రజలకు ఇచ్చే హామీలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికేసూపర్ సిక్స్ వంటి కీలక పథకాలతో ప్రజల ముందు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా మరో సంచలన హామీ కూడా ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే.. పేదలకు 2 సెంట్ల నుంచి 3 సెంట్ల భూమి ఇస్తామని చెప్పారు. అంతేకాదు.. స్థలంలో పునాదుల నుంచి రూఫ్ వరకు ప్రభుత్వమే కట్టి ఇస్తుందని చెప్పారు. ఇది తన హామీ అని ప్రకటించారు.
తాజా కాకినాడ జిల్లా జగ్గంపేటలో ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొన్నారు. కాకినాడ నుంచి ఎంపీ అభ్యర్తిగా జనసేన నాయకుడు ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు. వీరిరువురును చెరోపక్కనా నిలబెట్టుకున్న చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జగన్ చేసేదంతా విధ్వంసమేనని, వచ్చీరావడంతోనే ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టి రాష్ట్రంలో ఏ వ్యవస్థను వదిలిపెట్టకుండా అన్నింటినీ ధ్వంసం చేశాడని చంద్రబాబు దుయ్యబట్టారు.
ఇప్పటికే తాము ప్రకటించిన సూపర్ సిక్స్పై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పిన చంద్రబాబు.. వారి నుంచి కూడా తాము కొంత ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్టు చెప్పారు. దీని ప్రకారం.. చాలా మంది పేదలు తమకు స్థలం కావాలని కోరుతున్నా రని.. ఈ సైకో ఇచ్చిన బాత్ రూం వంటి స్థలంలో పడుకోవడానికి కూడా చోటు సరిపోవడం లేదని అన్నారని.. కాబట్టి తాము అధికారంలోకి రాగానే పేదలకు 2 నుంచి 3 సెంట్ల భూమిని ఇస్తామన్నారు. వారికి ఇల్లు కూడా కట్టించి ఇస్తామని చెప్పారు. అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలను అందరికీ వర్తింపజేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
This post was last modified on April 23, 2024 6:33 am
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…