అదే లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న కదా మరి అప్పుడే ఫలితం ఎలా వెల్లడయింది అని ఆశ్చర్యపోతున్నారా ? మీరు చదివింది నిజమే. పార్లమెంటు ఎన్నికల్లో చాలా అరుదయిన గెలుపు భారతీయ జనతా పార్టీ ఖాతాలో చేరిపోయింది. సూరత్ ఎంపీ స్థానాన్ని బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. వజ్రాల నగరం సూరత్ పై కాషాయ జెండాను రెపరెపలాడించింది.
దేశ వ్యాప్తంగా 18వ లోక్ సభకు ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడతలో దేశ వ్యాప్తంగా 102 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక 6 విడతల్లో మిగతా స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే బీజేపీ అరుణాచల్ ప్రదేశ్లో ఐదు శాసనసభ స్థానాలను ఏక గ్రీవంగా కైవసం చేసుకొని సంచలనం రేపింది. తాజాగా లోక్ సభ ఎన్నికల ముందే తొలి లోక్ సభ సీటును ఏకగ్రీవంగా గెలుచుకున్నది.
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లోక్ సభ స్థానానికి బీజేపీ తరుపున ముఖేష్ దలాల్, కాంగ్రెస్ నుంచి నీలేష్ కుభానీలు బరిలో ఉన్నారు. వీరితో పాటు మరో ఏడుగురు స్వతంత్ర్య అభ్యర్థులు కూడా నామినేషన్లు వేశారు. అయితే వీరంతా నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఎన్నిక ఏకగ్రీవం అయింది.
స్థానిక ఎన్నికల్లో సాధారణంగా ఉండే ఇలాంటి సంఘటనలు ప్రస్తుత రాజకీయాల్లో శాసనసభ, లోక్ సభ స్థానాల పరిధిలో అరుదు, అపూర్వం అని చెప్పాలి. ఏకగ్రీవ ఎన్నిక నేపథ్యంలో అక్కడి బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగాయి.
This post was last modified on April 22, 2024 6:20 pm
అక్కినేని అఖిల్ ఏజెంట్ డిజాస్టర్ వలన ఒక్కసారిగా స్లో అయ్యాడు. తదుపరి సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కథలపై…
ఏపీ ప్రతిపక్షం వైసీపీ నుంచి చాలా మంది నాయకులు బయటకు వెళ్లిపోతున్న విషయం తెలిసిందే. క్యూకట్టుకుని మరీ నాయకులు పార్టీకి…
ప్రజల్లో ఉండాలంటూ.. నాయకులకు, కార్యకర్తలకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తాజాగా సెలవిచ్చారు. 'ప్రజల్లో ఉంటేనే గుర్తింపు ఉంటుంది.…
2024 బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా సంచలన రికార్డులు నమోదు చేసిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఇంకా మొదలుకాని…
ఏదైనా భాషలో హిట్టయిన సినిమాను వీలైనంత త్వరగా రీమేక్ చేసుకుంటేనే సేఫ్. లేదంటే సబ్ టైటిల్స్ పెట్టుకుని ఆడియన్స్ ఓటిటిలో…
అల్లు అర్జున్ మీద ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా నెగెటివిటీ పెరిగిపోవడాన్ని గమనించే ఉంటారు. కెరీర్ ఆరంభంలో అతణ్ని…