ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి తిరుగేలేదు? ఈ సారి 175 సీట్లు గెలుస్తాం అనే అతివిశ్వాసంతో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సాగుతున్నారా? క్షేత్రస్థాయిలో పరిస్థితులు వ్యతిరేకంగా మారినా అర్థం చేసుకోవడం లేదా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి.
తాజాగా బస్సుయాత్రలో వివిధ వర్గాల నుంచి ఎదురవుతోన్న అసంతృప్తి సెగ, వ్యతిరేకతే అందుకు నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా కాకినాడలో కాలేజీ విద్యార్థులు జగన్ ముందే పవన్కు జిందాబాద్ కొడుతూ, వైసీపీపై విమర్శలు చేశారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సెన్సేషనల్గా మారింది.
ఈ ఘటనతో సీఎం జగన్పై, అధికార వైసీపీపై ఎంతటి వ్యతిరేకత ఉందో స్పష్టంగా అర్థమవుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఒక్క చోటులోనే కాదు జగన్ బస్సు యాత్ర ఎక్కడికి వెళ్లినా ఇలాంటి అనుభవమే ఎదురవుతోందని చెబుతున్నారు. కానీ ఈ విషయాన్ని జగన్ ఒప్పుకోవడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ ఈ వ్యతిరేకత అర్థమైనా బయటకు మాత్రం చూపించట్లేదని అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. తాజాగా రాయి దాడి జగన్కు ఎలాంటి మైలేజీ ఇవ్వలేకపోయిందనే టాక్.
గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇలాగే కేసీఆర్పై, బీఆర్ఎస్పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. కానీ దాన్ని పట్టించుకోకుండా, తనకు ఓటమి ఉండదనే ధోరణితో సాగిన కేసీఆర్కు ఓటర్లు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఈ వ్యతిరేకతను కాస్త అర్థం చేసుకున్న జగన్.. కొన్ని చోట్ల సిటింగ్ ఎమ్మెల్యేలను మార్చారు. కానీ అది సరిపోతుందో లేదో సమయమే చెప్పాలి
This post was last modified on April 21, 2024 9:38 pm
నిన్న మొన్నటి వరకు కారాలు మిరియాలు నూరుకున్న నాయకులు..ఇప్పుడు ఎంచక్కా చేతులు కలిపారు. సంక్రాంతి పుణ్యమా అని.. రాష్ట్రంలోని ఉభయగోదావరి…
దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు…
ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…
రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…