వైసీపీ అసహన రాజకీయాలకు ఇదొక నిదర్శనం. మెగాస్టార్ చిరంజీవి మీద దారుణాతి దారుణమైన రీతిలో వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా విమర్శల దాడికి దిగారు. వైసీపీ కీలక నేత అయితే, ‘సింగిల్ సింహం’ అని అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద అపారమైన స్వామి భక్తిని చాటుకునే క్రమంలో, రాజకీయ ప్రత్యర్థుల్ని జంతువులతో పోల్చుతున్నారు. ఆ జంతువుల్లో హైనా తదితర పేర్లనూ ప్రస్తావించడం అత్యంత శోచనీయం.
రాజకీయమన్నాక విమర్శలు సహజం. వాటికీ ఓ హద్దుండాలి. రాజకీయమంటే ప్రజా సేవ అన్న ప్రాథమిక సూత్రాన్ని వైసీపీ విస్మరిస్తోంది. అయినా, చిరంజీవి ఏమన్నారు.? తనకు అత్యంత సన్నిహితులైన ఇద్దరు వ్యక్తులకు రాజకీయంగా మద్దతు పలికారు. అందులో ఒకరు జనసేన నేత, ఇంకొకరు బీజేపీ నేత.
తనను కలిసిన ఆ ఇద్దరు నాయకులకూ చిరంజీవి మద్దతిచ్చారు. అదే వైసీపీ దృష్టిలో నేరం. వై నాట్ 175 అంటోంది వైసీపీ. అలాంటప్పుడు, ఎవరు ఎవరికి మద్దతిస్తే వైసీపీకి వచ్చిన నష్టమేంటి.? ఏమీ వుండదు కదా.? వైసీపీ కూడా గతంలో చాలామంది సినీ ప్రముఖుల మద్దతు తీసుకుంది. అది తప్పు కానప్పుడు, అది నేరం కానప్పుడు, టీడీపీ – జనసేన – బీజేపీ కూటమికి ఎవరైనా మద్దితిస్తే దాన్ని నేరంలా వైసీపీ ఎందుకు చూస్తోంది.?
ఇంతా చేసి, వైసీపీకి ఒనగూడే లాభం ఏమైనా వుంటుందా.? అంటే, అదీ లేదు.! మూడు రాజధానులకు చిరంజీవి మద్దతు పలికినప్పుడు, వైసీపీ నేతలంతా ఆయన్ని అభినందించారు. ‘చిరంజీవి మావాడు’ అని చెప్పుకున్నారు వైసీపీ నేతలు. ‘సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ కంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల అపారమైన ప్రేమ చిరంజీవికి’ అని కూడా చెప్పుకున్నారు.
ఇప్పుడేమో, చిరంజీవిని తూలనాడుతున్నారు, కొందరు వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా బెదిరిస్తున్నారు కూడా.! ఈ తరహా రాజకీయాలు వైసీపీకి చేటు చేస్తాయి. చిరంజీవిని అభిమానించేవారి ఓట్లు వైసీపీకి అస్సలు పడవనే పరిస్థితిని వైసీపీ కొనితెచ్చుకుందిప్పుడు.!
This post was last modified on April 21, 2024 9:32 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…