వైసీపీ అసహన రాజకీయాలకు ఇదొక నిదర్శనం. మెగాస్టార్ చిరంజీవి మీద దారుణాతి దారుణమైన రీతిలో వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా విమర్శల దాడికి దిగారు. వైసీపీ కీలక నేత అయితే, ‘సింగిల్ సింహం’ అని అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద అపారమైన స్వామి భక్తిని చాటుకునే క్రమంలో, రాజకీయ ప్రత్యర్థుల్ని జంతువులతో పోల్చుతున్నారు. ఆ జంతువుల్లో హైనా తదితర పేర్లనూ ప్రస్తావించడం అత్యంత శోచనీయం.
రాజకీయమన్నాక విమర్శలు సహజం. వాటికీ ఓ హద్దుండాలి. రాజకీయమంటే ప్రజా సేవ అన్న ప్రాథమిక సూత్రాన్ని వైసీపీ విస్మరిస్తోంది. అయినా, చిరంజీవి ఏమన్నారు.? తనకు అత్యంత సన్నిహితులైన ఇద్దరు వ్యక్తులకు రాజకీయంగా మద్దతు పలికారు. అందులో ఒకరు జనసేన నేత, ఇంకొకరు బీజేపీ నేత.
తనను కలిసిన ఆ ఇద్దరు నాయకులకూ చిరంజీవి మద్దతిచ్చారు. అదే వైసీపీ దృష్టిలో నేరం. వై నాట్ 175 అంటోంది వైసీపీ. అలాంటప్పుడు, ఎవరు ఎవరికి మద్దతిస్తే వైసీపీకి వచ్చిన నష్టమేంటి.? ఏమీ వుండదు కదా.? వైసీపీ కూడా గతంలో చాలామంది సినీ ప్రముఖుల మద్దతు తీసుకుంది. అది తప్పు కానప్పుడు, అది నేరం కానప్పుడు, టీడీపీ – జనసేన – బీజేపీ కూటమికి ఎవరైనా మద్దితిస్తే దాన్ని నేరంలా వైసీపీ ఎందుకు చూస్తోంది.?
ఇంతా చేసి, వైసీపీకి ఒనగూడే లాభం ఏమైనా వుంటుందా.? అంటే, అదీ లేదు.! మూడు రాజధానులకు చిరంజీవి మద్దతు పలికినప్పుడు, వైసీపీ నేతలంతా ఆయన్ని అభినందించారు. ‘చిరంజీవి మావాడు’ అని చెప్పుకున్నారు వైసీపీ నేతలు. ‘సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ కంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల అపారమైన ప్రేమ చిరంజీవికి’ అని కూడా చెప్పుకున్నారు.
ఇప్పుడేమో, చిరంజీవిని తూలనాడుతున్నారు, కొందరు వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా బెదిరిస్తున్నారు కూడా.! ఈ తరహా రాజకీయాలు వైసీపీకి చేటు చేస్తాయి. చిరంజీవిని అభిమానించేవారి ఓట్లు వైసీపీకి అస్సలు పడవనే పరిస్థితిని వైసీపీ కొనితెచ్చుకుందిప్పుడు.!
This post was last modified on April 21, 2024 9:32 pm
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…