కడప జిల్లా మీద వైఎస్ కుటుంబానికి ఉన్న పట్టు అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ కుటుంబంలోని ముఖ్యమంత్రి జగన్, ఆయన చెల్లెలు షర్మిల మధ్య తలెత్తిన విభేధాల మూలంగా ఈ సారి ఎన్నికలలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయాల మధ్య పెరిగి పెద్దయిన షర్మిల జగన్ జైలుకు వెళ్లిన నేపథ్యంలో వైసీపీ పటిష్టం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసింది. గత ఎన్నికలలో వైసీపీ గెలుపుకోసం పనిచేసింది. ఆ తర్వాత జగన్ తో విభేధించి తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ కూడా 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఏపీసీసీ అధ్యక్షురాలిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెట్టింది. కడప ఎంపీ అభ్యర్థిగా పోటీకి దిగింది.
రాజకీయ ఎత్తుగడల విషయంలో తాను ఏ మాత్రం తీసిపోను అంటూ షర్మిల కడప రాజకీయాలను నెరుపుతున్నట్లు కనిపిస్తుంది. ఉమ్మడి కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కమలాపురం, రాజంపేట మినహా అన్ని స్థానాలలో పోటీ చేస్తుంది. అయితే కడప నియోజకవర్గంలో మైనారిటీలది కీలకపాత్ర. అక్కడి నుండి కాంగ్రెస్ తరపున మైనారిటీ నేత అఫ్జల్ ఖాన్ ను బరిలోకి దింపాలని షర్మిల యోచిస్తున్నట్లు వస్తున్న వార్తలు వైసీపీ గెలుపుకు గండి కొడుతుందా ? అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
అఫ్జల్ ఖాన్ 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున శాసనసభకు పోటీ చేసి దాదాపు 14 వేల ఓట్లు సాధించారు. ఈ నేపథ్యంలో అతన్ని బరిలోకి దించితే మైనారిటీ ఓట్లు చీల్చడం ఖాయం అని భావిస్తున్నారు. వైసీపీకి సహజంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. ఈ పరిస్థితులలో కీలకమైన ఓట్లలో చీలిక ఆ పార్టీకి ఇబ్బందికరమే అన్న వాదన వినిపిస్తుంది. మరి షర్మిల ఎత్తులు ఈ విషయంలో ఎంత వరకు ఫలిస్తాయో వేచిచూడాలి.
This post was last modified on April 21, 2024 11:55 am
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…